టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్ధుల నామినేషన్లు దాఖలు

 

 

 

 

తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపికైన ఎమ్మెల్సీ అభ్యర్ధులు యనమల రామకృష్ణుడు, సలీం, శమంతకమణి అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలను అందజేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల మీడియాతో మాట్లాడుతూ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని తెలిపారు. పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన అన్నారు. టీడీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందని, ప్రజల పక్షాన పోరాడటమే పార్టీ ఎజెండా అని యనమల వ్యాఖ్యానించారు. అంతకుముందు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్‌ఘాట్‌కు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఎన్టీఆర్ ఘాట్లో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు ఘనంగా నివాళులు అర్పించారు.

Teluguone gnews banner