తలసాని... ఎంసెట్.. ఛలో గవర్నర్...

 

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా అంశం మీద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం నాడు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ని కలసి ఫిర్యాదు చేశారు. తలసాని శాసనసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను వెంటనే ఆమోదించాలని, అలా కాకుంటే ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని వారు గవర్నర్ని కోరారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ తదితరులు గవర్నర్ని కలిసిన వారిలో వున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడిన ఎంసెట్ నిర్వహణ వివాదం గవర్నర్ వద్దకి చేరింది. మంగళవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గవర్నర్ నరసింహన్‌ని కలసి ఎంసెట్ నిర్వహణ ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోకే వస్తుందని విన్నవించారు.

Teluguone gnews banner