'నిర్భయ్' ఫెయిల్
posted on Mar 13, 2013 9:20AM
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.వో.) భారత స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తొలి సబ్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ 'నిర్భయ్' ను మంగళవారం ఒడీశాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రంలో మొబైల్ లాంచర్ నుంచి ఉదయం 11.50నిముషాలకు ప్రయోగించారు. నిర్భయ్ 25 నిముషాలు ప్రయాణించి మధ్యలోనే దారితప్పడంతో శాస్త్రవేత్తలు నిర్భయ్ ను మధ్యలోనే నిలిపివేశారు. లక్ష్యసాధనలో విఫలమైన నిర్భయ్ శకలాలు తీరప్రాంతంలోని సరబంత్, గదహరివ్ పూర్ గ్రామాలలోని మామిడి తోటల్లో పడడంతో గ్రామస్థులు భయాందోళనలు గురయ్యారు. తీరప్రాంత భద్రతకోసం ముడుజాగ్రట్ట చర్యగా నిర్భయ్ క్షిపణిని మధ్యలోనే కూల్చివేయవలసి వచ్చిందని, మార్గమధ్యంలోనే నిర్వీర్యం చేసిన క్షిపణిలు నేలపై కూలడం అసాదారణమని, దీనివల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని డి.ఆర్.డి.వో. అధికార ప్రతినిధి రవి గుప్తా ప్రకటించారు.