ల‌క్నో వ‌న్డే..సంజూ శ్ర‌మ వృధా..9 ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికా గెలుపు

ల‌క్నోలో జ‌రిగిన తొలి వ‌న్డేలో ద‌క్షిణాఫ్రికా భార‌త్ పై 9 ప‌రుగుల తేడాతో గెలిచింది. వ‌ర్షం కార‌ణంగా ఎంత ఆల‌స్యంగా ప్రారంభ మైన మ్యాచ్‌ని 40 ఓవ‌ర్ల‌కు కుదించారు. డాషింగ్ బ్యాట‌ర్లు డేవిడ్ మిల్ల‌ర్‌, క్లాస‌న్‌లు భార‌త్ బౌలింగ్‌ను సునాయాసంగా ఎదు ర్కొంటూ అద్బుత బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ప్రేక్ష కుల‌ను ఆకట్టుకున్నారు. క్లాస‌న్ 65 బంతుల్లో 74, మిల్ల‌ర్ 63 బంతుల్లో 75 ప‌రుగులు, డీ కాక్ 54 బంతుల్లో 48 ప‌రుగులు చేసి త‌మ జ‌ట్ట‌కు 249 ప‌రుగుల భారీ స్కోర్ రావ‌డంలో కీల‌క‌పాత్ర‌ వ‌హించారు. ద‌క్షిణాఫ్రికా 40 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 249 ప‌రుగుల చేసింది. భార‌త్ 8 వికెట్ల న‌ష్టానికి 240 ప‌రుగులు చేసింది. ద‌క్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో భార‌త్ బౌల‌ర్లు అంత‌గా స‌ఫ‌లీకృతం కాలేదు. పేస‌ర్ సిరాజ్ 49 ప‌రుగులు, బిష్ణోయ్ ఏకంగా 69 ప‌రుగులు ఇచ్చుకున్నారు. శార్దూల్ 35 ప‌రుగు లిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అంతేగాక భార‌త్ ఇన్నింగ్స్ చివ‌రి భాగంలో వ‌చ్చి అప్ప‌టికే విజృంభించి ఆడుతున్న శాంస‌న్‌తో క‌లిసి ప‌రుగుల వ‌ర‌దే సృష్టించాడు. 

250 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ్యాటింగ్‌కి దిగిన భార‌త్ ఊహించ‌నివిధంగా పేల‌వంగా బ్యాట్ చేసింది. కెప్టెన్ ధవ‌న్, శుభ‌మ‌న్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కానీ ఇద్ద‌రూ 6వ ఓవ‌ర్‌కే పెవిలియ‌న్ చేరారు. అప్ప‌టికి జ‌ట్టు స్కోర్ మ‌రీ 8 ప‌రుగులే! ప‌దో ఒవ‌ర్ అయ్యేస‌రికి భార‌త్ 2 వికెట్ల న‌ష్టానికి 24 ప‌రుగుల‌తో ఉంది. ఇదే స‌మ‌యంలో ద‌క్షిణాఫ్రికా వికెట్ న‌ష్ట‌పోకుండా 41 ప‌రుగులు చేసింది. కానీ రితిరాజ్‌, కిష‌న్‌లు ధాటిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిల‌బెట్టారు. వారిద్ద‌రూ 62 బంతుల్లో 37 ప‌రుగులు చేశారు. తొలి వ‌న్డే ఆడుతున్న రితిరాజ్ గైక్వాడ్ ఫ‌ర‌వాలేద‌ని పించాడు. కానీ 18 వ ఓవ‌ర్లో వెనుదిరిగేడు. అప్ప‌టికి అత‌ను 17 ప‌రుగులు చేశాడు. జ‌ట్టు స్కోర్ 50కి చేరుకుంది. ఆ త‌ర్వాత ఓవ‌ర్లోనే కిష‌న్ వెనుదిగాడు. అత‌ను 37 బంతుల్లో 20 ప‌రుగులు చేశాడు. ఈ దుస్థితి నుంచి జ‌ట్టును బ‌య‌ట‌ప‌డేయ‌డానికి సంజూశాంస‌న్ రంగంలోకి దిగాడు. ఎంతో ఆచీ తూచీ ఆడుతూ ఇన్నింగ్స్ నిల‌బెడుతూ ప‌రుగులు సాధించాడు. శాంస‌న్‌తో పాటు అయ్య‌ర్ జోడీగా జ‌ట్టు స్కోర్‌ను ప‌రుగులు పెట్టించారు. 23వ ఓవ‌ర్‌కి భార‌త్ స్కోర్ 100కి చేరుకుంది. అప్టికి అయ్య‌ర్ 34 ప‌రుగులు శాంస‌న్ 12 ప‌రుగుల‌తో ఉన్నారు. ఇద్ద‌రూ క‌లిసి అప్ప‌టికి 34 బంతుల్లో 53ప‌రుగులు సాధించారు. శ్రేయ‌స్ అయ్య‌ర్ అర్ధ‌సెంచ‌రీని 33 ప‌రుగుల్లో చేశాడు. 27వ ఓవ‌ర్లో అయ్య‌ర్ అవుట‌య్యాడు. అప్టికి జ‌ట్టు స్కోర్ 5 వికెట్ల‌న‌ష్టానికి 118 ప‌రుగులు.

అయ్య‌ర్ స్థానంలో వ‌చ్చిన శార్ధూల్ ఠాకూర్ వ‌స్తూనే ధాటిగా ఆడుతూ ప‌రుగులు సాధించ‌డంలో శాంస‌న్‌కు జోడీ అయ్యాడు. ఇద్ద‌రూ జాగ్ర‌త్త‌గా ఆడుతూ ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌ను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. 30వ ఓవ‌ర్ల‌లో భార‌త్ 150 ప‌రుగులు పూర్తి చేసింది. 37 ఓవ‌ర్లో 200 ప‌రుగులు సాధించింది. శాంస‌న్ 180 ర‌న్‌రేట్ తో 49 బంతుల్లో అర్ధ‌సెంచ‌రీ పూర్తిచేశాడు. అక్క‌డి నుంచి ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌ను కంగారుపెట్టించాడు. ముఖ్యంగా ఎన్గిడీ, షంసీల‌ను బాదాడు. 38వ ఓవ‌ర్లో శార్దూల్ వెనుదిరిగేప్ప‌టికి అత‌ను 31 బంతుల్లో 33ప‌రుగులు సాధించాడు. కానీ ఆ త‌ర్వాతి ఓవ‌ర్లో వ‌రుస‌గా రెండు వికెట్లు ఆవేష్‌, కుల్దీప్‌లు పెవిలియ‌న్ చేర‌డంతో విజయం సాధించ‌డం క‌ష్ట‌మైంది. అప్ప‌టికీ శాంస‌న్ ఎంతో ధాటిగా ఆడుతూ స్కోర్‌ను ద‌గ్గ‌రికి తీసికెళ్లాడు. చివ‌రి రెండు ఓవ‌ర్లు ఎంతో ధాటిగా బ్యాట్ చేశ‌డు. ముఖ్యంగా షంషీ వేసిన చివ‌రి ఓవ‌ర్లో 30 ప‌రుగులు రావాలి. శాంస‌న్ మ‌రింత దూకుడుగా ఆడుతూ ఒక సిక్స్ మూడు ఫోర్లు కొట్టి ద‌క్షిణాఫ్రికాను ఖంగారు పెట్టాడు. అయినా కేవ‌లం 9 ప‌రుగుల దూరంలో భార‌త్ ఓట‌మి చ‌విచూసింది. సంజూ శాంస‌న్  62 బంతుల్లో 86 చేసి అజేయంగా నిలిచాడు.

తెలంగాణ స్పీకర్‌కి సుప్రీం నోటీసులు

తెలంగాణలో బీఆర్ఎస్  ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీం కోర్టులో సకీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీం ధర్మాసనం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం (జనవరి 19) విచారణ చేపట్టింది. గతంలో పెండింగ్‌లో ఉన్న కేసుతో బీజేపీ పిటిషన్‌ను కూడా జత చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. మూడు నెలల్లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించినప్పటికీ.. ఆ ఆదేశాలను అమలు చేయలేదని బీజేపీ   తన పిటిషన్ లో పేర్కొంది.   ఈ మేరకు స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరుతూ తెలంగాణ బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నానని చెప్పిన కామెంట్లనూ  పిటిషన్‌లో పొందుపరిచారు. గత నవంబర్‌లోనే స్పీకర్‌కు సుప్రీం కోర్టు కంటెంప్ట్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ పిటిషన్‌ను జతచేసి మరోసారి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

తెలంగాణ మునిసిపోల్స్ కు కేబినెట్ ఆమోదం

 తెలంగాణ  మునిసిపోల్స్ నిర్వహణకు  రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.  ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం (జనవరి 18)  జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మేడారంలో జరిగిన కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సచివాలయంలో కాకుండా మేడారంలో కేబినెట్ సమావేశం ఏర్పాటైందన్నారు.  ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క ఇందుకు చొరవ తీసుకున్నారని, మేడారంలో కేబినెట్ భేటీ విషయంలో  అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారని వివరించారు. అందరి ఏకాభిప్రాయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో మంత్రివర్గ సమావేశం జరిగిందన్నారు. ఈ సమావేశంలోనే రాష్ట్రంలో గడువు పూర్తైన  116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లలోని 2,996 వార్డులు, డివిజన్లకు సాధ్యమైనంత  త్వరగా ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్  నివేదిక ప్రకారం  రిజర్వేషన్లు ఖరారయ్యయన్నారు.

చంద్రబాబు కోసం బండ్ల గణేష్ పాదయాత్ర

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. సంకల్ప యాత్రు పేరిట తాను చేపట్టిన ఈ యాత్ర ఎంత మాత్రం రాజకీయ యాత్ర కాదని స్పష్టం చేసిన బండ్ల గణేష్ కేవలం తన మొక్కు చెల్లించుకోవడం కోసం మాత్రమే ఈ పాదయాత్ర చేస్తున్నానన్నారు.  రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని తన సినిమా థియేటర్ నుంచి సోమవారం (జనవరి 19)   ఉదయం ఆయనీ యాత్రను ప్రారంభించారు. దాదాపు  500 కిలోమీటర్ల ఈ పాదయాత్ర సాగనుంది. తాను తిరుమ లకు పాదయాత్ర చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభిమానంతో నేనన్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆశీస్సులతోనే ముందడుగు వేస్తున్నానని చెప్పారు.  జగన్ హయాంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును స్కిల్ కేసు పేరుతో అక్రమంగా అరెస్టు చేయడం తనను ఎంతో బాధించిందన్న బండ్ల గణేష్ అప్పట్లో ఆయనకు బెయిలు వస్తుందని కోర్టు విచారణ ఉన్న ప్రతిసారీ సుప్రీంకోర్టులో ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు. అప్పుడే ఈ కేసు నుంచి ఆయన  ఎలాంటి మచ్చలేకుండా విడుదల కావాలని ఏడుకొండల వాడికి మొక్కుకున్నానన్నారు. ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకోవడానికే షాద్ నగర్ లోని తన సినిమా థియేటర్ నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించానని బండ్ల గణేష్ చెప్పారు. 

ఏపీ లిక్కర్ స్కామ్‌.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడి నోటీసులు

ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.  ఇప్పటికే  ఈ కేసులోపలువురు కీలక వ్యక్తులను విచారించిన ఈడి, రెండు రోజుల కిందట వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు తాజాగా  వైసీపీకి చెందిన మరో ఎంపీకి నోటీసులు జారీ చేయడం రాజకీయంగా కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.   మిధున్ రెడ్డిని ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో  పేర్కొంది.   ఇప్పటికే ఇదే కేసులో ఎంపీ మిధున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది.  ప్రస్తుతం ఆయన బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.  ఏపీ లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడి అనుమానిస్తోంది. లిక్కర్ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో హవాలా మార్గంలో భారీ ఎత్తున జరిగిన నగదు చలామణి లో మిథున్ రెడ్డి పాత్ర ఉందని   ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణం ద్వారా అక్రమంగా సంపాదించిన సొమ్మును వివిధ మార్గాల్లో  మనీ ల్యాండరింగ్ చేశారనీ, ఆ సొమ్ము  కీలక వ్యక్తుల వరకూ చేరిందని ఈడీ అనుమానిస్తోంది.   జగన్ హయాంలో అమలు చేసిన మద్యం విధానంలో  లైసెన్సుల కేటాయింపు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఇప్పటికే  దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కీలకంగా భావి స్తున్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మిథున్ రెడ్డి పాత్రపై స్పష్టత కోసం ఆయనను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్కామ్‌కు సంబంధించి పలువురు అధికారులు, వ్యాపారులు, మధ్యవర్తులను విచారించిన ఈడి, తాజాగా ఎంపీ స్థాయి నేతకు నోటీసులు ఇవ్వడంతో కేసు దర్యాప్తు తుదిదశకు చేరుకున్నదని భావించవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మిథున్ రెడ్డి విచారణ లో కొత్త ఆధారాలు వెలుగు లోకి వచ్చే అవకాశ ముందం టున్నారు.   మనీ ట్రయిల్‌పై ఈడి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు  ఈ పరిణా మాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతు న్నాయి.  మిథున్ రెడ్డి ఈడి విచారణకు ఎలా స్పందిస్తారన్నది, విచార ణలో ఏమి బయటపడ నున్నదని, ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

మిథున్ రెడ్డి కాషాయ తీర్థం.. జాప్యానికి కారణమేంటంటే?

వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ర రెడ్డి కమలం గూటికి చేరుతాడంటూ గత ఐదారు నెలలుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా మద్యం కుంభకోణంలో జైలు కెళ్లి బయటకు వచ్చిన మిథున్ రెడ్డి ఇక బీజేపీ తీర్థం పుచ్చుకోవడమ లాంఛనమేననీ, అయితే మిథున్ రెడ్డి కంటే ముందు మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత విజ‌య‌సాయిరెడ్డి  కూడా కమలం కండువా కప్పుకుంటారనీ గట్టిగా వినిపించింది. అయితే ఆ ప్రచారం ఇప్పటికీ ప్రచారంగానే మిగిలిపోయింది. ఇంతలో  విజ‌య‌సాయిరెడ్డి సొంతంగా  కొత్త  పార్టీ  పెడ‌తార‌ంటూ ప్రచారం మొదలైంది. ఆ మాట స్వయంగా విజయసాయిరెడ్డే చెప్పారు.  అది పక్కన పెడితే  మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్ల‌డానికి ఆటంక‌మేంటి? అన్న చర్చ ఆరంభమైంది.   మిథున్ రెడ్డి  తండ్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి  వైసీపీలో అత్యంత కీలకమైన నేత. మిథున్ రెడ్డికి 2014- 24 మ‌ధ్య 500 శాతానికిపైగా ఆస్తుల పెరుగుద‌ల ఏమంత సులువుగా  జ‌ర‌గ‌లేదు. జ‌గ‌న్ కి అత్యంత స‌న్నిహితుడు మిథున్ రెడ్డి. స‌రిగ్గా అదే స‌మ‌యంలో జ‌గ‌న్ హయాంలో ఆయన కేబినెట్ లో పెద్దిరెడ్డి చాలా ముఖ్యుడు.  భారీ ఎత్తున‌ భూక‌బ్జాలు, అట‌వీ  భూముల ఆక్ర‌మ‌ణ‌లు, ఆపై ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ వంటి కార్య‌క‌లాపాలు య‌ధేచ్చ‌గా సాగాయనీ, తండ్రీ కొడుకులు పెద్దరెడ్డి, మిథున్ రెడ్డిలు కోట్లాది రూపాయ‌లు అక్రమంగా సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారన్న మరక ఉన్నందున మిథున్ రెడ్డి ఎంట్రీ విషయంలో బీజేపీ ముందువెనుకలాడుతోందని పరిశీలకులు అంటున్నారు. అవినీతి మరక ఉన్నప్పటికీ బీజేపీ ఎంట్రీకి అదేమంత అడ్డంకి కాదని గతంలో పలువురి విషయంలో రుజువైంది. అయితే మిథున్ రెడ్డి విషయంలో మాత్రం కమలనాథులు కండీషన్లు పెట్టారనీ, అందుకే మిథున్ రెడ్డి బీజేపీ ఎంట్రీకి బ్రేక్ పడటానికి కారణమంటున్నారు. ఇంతకీ బీజేపీ పెట్టిన కండీషన్స్ ఏమిటంటే.. మిథున్ రెడ్డి బీజేపీ గూటికి చేరిన తరువాత ఇక జగన్ తో ఎటువంటి సంబధాలూ ఉండకూడదు.  లోపాయికారీ ఒప్పందాలేవీ చేసుకోకూడ‌దు. ఈ కండీషన్స్ కారణంగానే   మిథున్ రెడ్డి బీజేపీలో చేరికకు బ్రేక్ పడిందని అంటున్నారు. అంతే కాకుండా కేవలం మిథున్ రెడ్డి మాత్రమే కాకుండా ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో అనుచరులను కూడా తీసుకురావాలని బీజేపీ షరతు విధించిందనీ, అది కూడా మిథున్ రెడ్డి బీజేపీ ఎంట్రీ జాప్యం కావడానికి కారణమంటున్నారు.   ఇప్ప‌టికే వైసీపీలో కొంద‌రు సీనియ‌ర్లు.. సైలెంట్ మోడ్ లోకి వెళ్లి  పోయారు. అలాంటి వారితో క‌ల‌సి మిథున్ బీజేపీలోకి వ‌స్తే.. ఏపీలో కూడా పార్టీ బ‌ల‌ప‌డుతుంది. కాబ‌ట్టి.. అలా చేయ‌గ‌లిగితే త‌మ‌కేం అభ్యంత‌రం లేద‌ని కేంద్ర క‌మ‌ల‌నాయ‌క‌త్వం భావిస్తోంద‌ట‌. దీంతో ఇటు మిథున్ తో పాటు అటు విజ‌య‌సాయి  కూడా ఇలాంటి క‌మ‌లం బాట ప‌ట్టే వారి  కోసం తీవ్రంగా  య‌త్నిస్తున్నార‌ట‌. దీంతో మిథున్ బీజేపీ ఎంట్రీకి జాప్యం అవుతోందనీ, బీజేపీ కండీషన్లన్నిటినీ నెరవేర్చి  మిథున్ రెడ్డి బీజేపీకి వెళ్లేలోపు   2029 ఎన్నిక‌లు కూడా వ‌చ్చేలా ఉన్నాయంటున్నారు పరిశీలకులు.

మళ్లీ జగన్ కోటరీని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి

వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జగన్ చుట్టూ కోటరీ ఉందని వ్యాఖ్యానించిన విజయసాయిరెడ్డి..  తాజాగా అమ్ముడుపోయి కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండని హితవు పలికారు. భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించాలని పేర్కొన్నారు. వెనిజులాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్నా.. ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా ఎత్తుకుపోయిందని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. దానికి కారణం ఏంటి? వారంతా అమ్ముడుపోవటమే కదా అని ట్వీట్ చేశారు. అయితే, గతంలోనూ వైసీపీ అధ్యక్షుడు జగన్ చుట్టూ కోటరీ ఉందని.. విజయసాయిరెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్‌ను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

జీవితంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయను : జగ్గారెడ్డి

  కాంగ్రెస్ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో అసెంబ్లీ ఎన్నికల్లో మర్చిపోలేనిదని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఇళ్ళ స్థలం లేని పేదలతో సంగారెడ్డిలోని గంజి మైదానంలో టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ వచ్చి నన్ను గెలిపించాలని ప్రచారం చేస్తే, నన్ను  ఇక్కడ ఓడించారు. జగ్గారెడ్డిని గెలిపించాలని రాహుల్‌ గాంధీ అడిగితే.. నన్ను ఓడించారు. నా జీవితంలో ఇది మరిచిపోలేనిది.  అందుకే సంగారెడ్డిలో జీవితంలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాని  హాట్‌ కామెంట్స్‌ చేశారు. నా ఓటమికి కారణం పేద ప్రజలు కాదు..ఇక్కడి మేధావులు.. పెద్దలది. రేపు సంగారెడ్డిలో నా సతీమణి నిర్మలా పోటీ చేసిన కూడా నేను ప్రచారం చేయను. రాష్ట్రంలో నేను ఎక్కడికైన వెళ్ళి ప్రచారం చేస్తా కానీ.. సంగారెడ్డిలో ప్రచారం చేయను’ అని జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు  

శ్రీరాముడికీ బీజేపీ సభ్యత్వం.. ఆ విషయం ఆయనకు తెలుసా అరవిందా?

(శ్రీరాముడికీ బీజేపీ సభ్యత్వం ఉంది.. ధర్మపురి అరవింద్) మొన్నామధ్య  వూరి పెద్ద బస్టాండ్‌లో మిట్టమధ్యాన్నం కాషాయ దుస్తుల్లో ఒకాయన బస్సుదిగాడు. మెల్లగా చెట్టు నీడలోకి వచ్చి సోడా తాగి బెంచీ మీద కూచున్నాడు. అప్పటిదాకా కాగితంతో ఆడుతున్న కుక్కపిల్లతో సహా అక్కడ బెంచీల మీద కూచున్నాళ్లంతా ఆయన్నే చూస్తుండిపోయారు. ఓ అరగంట తర్వాత బస్సు క్లీనర్‌ దగ్గరగా వెళ్లి పలకరించాడు..‘సామీ ఎవరు మీరు? ఇక్కడ ఎవరు కావాల?’ అని. చిన్న గడ్డం సవరించుకుంటూ ‘నర్సిమ్మ కొట్టుకెల్లి   బీడీకట్టట్టుకురారా అంటూ ఆ స్వామి ఆదేశించాడు. అంతే ఆయన మాటతీరు  బాగా దగ్గరగా చూసిన ఆ కుర్రాడు.. ఒరేయ్‌  ఈడు సాములోరు గాదురా.. మన  సత్తిగాడు అని గావుకేక వేశాడు. ఏదో వజ్రాన్ని కనుగొన్నట్టు బస్టాండ్‌ అంతా పరిగెడుతూ అందరికీ స్వామి అసలు పేరుతో సహా ప్రకటించాడు. అంతే వీలయినంతమంది సత్తి చుట్టూ చేరి  అయినా ఇదేం యాశంరా ’ అంటూ ప్రేమగానే తిట్టారు.  సదరు స్వామి నవ్వి,  వేషం మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. వీధిపేరు, ఊళ్లో బావిపేరు, మున్సిపల్‌ స్కూలు పేరు.. ఇలా అన్నీ  మార్చేస్తున్నారు. నన్నూ మారుస్తారని  ముందుగా నేనే మారిపోయాను. ఎవరో మనల్ని మార్చడం కన్నా మనకు మనము మారడం ఉత్తమం కదా  అన్నాడు స్వామి సత్తి.అందరూ తలగోక్కున్నారు. వీడిలానే వీడి మాటా అర్దమై చావదు, ఏం చెబుతున్నావో సరింగజెప్పరా పిచ్చి సన్నాసీ  అని అరిచింది అరటిపళ్లు అమ్మే ముసలామె. గొంతు సవరించుకుని సత్తి సామి..  అంతా రామమయం  అంటే కేవలం సినిమాలో ఎస్పీ గొంతు చించుకున్న పాటే అనుకున్నామా, కానీ  అది అంతటితో ఆగలేదు, అంతా రామమయం అంటే అంతటా, అన్నింటా రామమయం చేయాలని కొందరు కాషాయాలు బిగించారు. మీకింకా ఆ సంగతి తెలియలేదు. తెలిసేప్పటికీ మీ ఇళ్ల పేర్లన్నీ రాముడితో, కృష్ణుడితో నిండిపోతాయి నాయనలారా  అంటూ జ్ణానబోధ చేశాడు స్వామి సత్తి.  అదెట్టా? అడిగారు కొందరు. దేవర తలచుకుంటే ఊరేం ఖర్మ దేశమే పేరు మార్చుకుంటుంది. భరతావని మనది. జండా పట్టుకుని చాలా చక్కగా నవ్వుతూ నిలబడి ఉంటుంది. ఆ మాతను మనసులో నిలుపుకుని అంతే పద్దతిలో మనం నడచుకోవాలి అని  ఏలికలు నువ్వూ నేనూ చూడని పాతతరం సీనియర్‌ నాయకుల స్ఫూర్తితో, భక్తి రసం తలకెక్కించుకుని రైల్లో, విమానాల్లో బయలుదేరి వీలయినన్ని ప్రాంతాలు, భవనాలు, కూడళ్లు, గ్రామాల పేర్లు అమాంతం మార్చేస్తున్నారు. అదో దండు. లోకంలో వారిని మించిన రామభక్తులు ఉండటం అసాధ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మీ యింట్లో పెద్దతరం వారూ వీళ్ల ముందు బలాదూర్‌. బతికిబట్టకట్టమంటూ ఇచ్చే కార్డు ముక్క కూడా స్వయంగా రాములవారి భిక్షట. ఏలిక స్వయంగా రామభక్తుడు. అందువల్ల ప్రజలంతా చచ్చినట్టు రామసంకీర్తనతోనే కార్యాలయాల్లో, బడిలో కాలం గడపాలేగాని వేరే లోకం ఉండకూడదు.  అలాగాకుంటే ఆంజనేయులవారికి చెడ్డ కోపం వస్తుందని, కండల మీద బొమ్మలు వేసుకున్న వస్తాదులు ఊరూరా తిరుగుతున్నారు.ఈ భక్తి పారవశ్యంలో వీలయినన్ని ఊళ్లు, బజార్లు, బస్టాండ్ల పేర్లు మారుస్తూ పోతున్నారు. అలవాటులో పొరపాటుగా నా పేరూ మార్చేస్తారేమోనని ముందు జాగ్రత్తకోసం కాషాయం ధరించా.  ఇంతలో ఎవరో సైకిల్‌ మీద పోతూ ‘జై శ్రీరామ్‌!’ అని అరుస్తూ వెళ్లాడు.   కొంత దూరం వెళ్లి ఆగి మళ్లీ  వెనక్కి వచ్చి అటుగా సిగెరెట్టు తాగుతూ వెళుతోన్న కుర్రాడిని అడ్డగించాడు. నీకు దేశభక్తి లేకపోతే ఎలాగయ్యా.. ఏలిక దేశ ప్రగతి కోసం  సంస్కృతిని కాపాడేందుకు ఎంత చమటోడుస్తున్నాడు.. జైశ్రీరామ్‌ అను ఆయనకు ఉపశమనం కలుగుతుంది అన్నాడు.  ఛస్తే అన్ను.. ఆయనకు దురదేస్తే.. నేను గోక్కోడం ఏమిటయ్యా బుద్ధుందా?’ అని ఎదురు తిరిగాడు.. అంతే ఓ అరగంట అలా గొంతు చించుకున్నారు. ఆనక అలసిపోయి విడిపోయారు.  రాములవారికీ పార్టీ సభ్యత్వం అంటగట్టినవారు దేశాన్ని ఒకే రంగు పులిమి ఓట్లు గుద్దించుకోవడమనే వారి భవిష్యత్‌ ప్రణాళిక. డబ్బు చేసినవాడికి జబ్బో లెక్కా.. రాముడిని ఎలాగయినా వాడుకోవచ్చని నిర్ధారించుకున్నాక కౌసల్య రూపంలో ఎవరు గుండెలు బాదుకున్నా ఏమీ కాదు..!

కార్పొరేషన్ మేయర్లు, మునిసిపల్ చైర్మన్ ల రిజర్వేషన్లు ఖరారు

కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లను తెలంగాణ  ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులను కేటాయించారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ మేరకు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి శనివారం (జనవరి 17) ఉత్తర్వులు జారీ చేశారు.  ఇక  కార్పొరేషన్‌ చైర్మన్లకు ఖరారు చేసిన రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్‌  ఎస్టీ జనరల్, రామగుండం కార్పొరేషన్‌కు ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ కార్పొరేషన్ బీసీ మహిళ, మంచిర్యాల కార్పొరేషన్ బీసీ జనరల్, కరీంనగర్ కార్పొరేషన్ బీసీ జనరల్, జీహెచ్ఎంసీ మహిళ జనరల్,  గ్రేటర్ వరంగల్ జనరల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్‌లలో మహిళ జనరల్‌ను ఖరారు చేశారు.

ఏపీ మద్యం స్కాం.. విజయసాయికి ఈడీ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.  2019 నుంచి ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలో అనుసరించిన మద్యం విధానంలో అవకతవకలు, అక్రమాలు, మనీలాండరింగ్ చట్ట ఉల్లంఘనలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.  గత ప్రభుత్వ హయాంలో మద్యం వ్యాపారానికి సంబంధించిన పెద్ద ఎత్తున మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలపై ఈ దర్యాప్తు సాగుతోంది.   మద్యం సేకరణ వ్యవస్థను ఆటోమేటెడ్ ప్రక్రియ నుండి మాన్యువల్ ఆమోదాలకు మార్చడం, తద్వారా కొన్ని సంస్థలకు ప్రయోజనం చేకూరేలా ఒప్పందాల మార్పిడికి దోహదపడిందని ఈడీ తన దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.   కాగా ఈ కేసును ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సిట్ ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని అరెస్టు చేసింది వారిలో కొందరు బెయిలుపై విడుదల కాగా, ఇంకా కొందరు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో విజయసాయి కూడా ఇప్పటికే సిట్, ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఈ నెల 22 విచారణకు రావాల్సిందిగా విజయసాయికి ఈడీ నోటీసులు పంపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ, వైసీపీకీ రాజీనామే చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాననీ, వ్యవసాయమే తన వ్యాపకమని చెప్పుకుంటున్న విజయసాయి ఈడీ విచారణలో ఏం చెబుతారన్న ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. ఇప్పటికే పలు సందర్భాలలో వైసీపీ నేతలపై విమర్శలు చేసిన విజయసాయి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో ఈడీ విచారణలో  వెల్లడించే విషయాలు కీలకం కానున్నాయంటున్నారు.