Read more!

నట్వర్ సింగ్ ఆత్మకథకు సీక్వెల్

 

కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ రాసిన ఆత్మకథ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’ మార్కెట్లోకి విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. సోనియాగాంధీ కుటుంబం గుట్టు రట్టు చేసింది. ఇప్పుడు నట్వర్ సింగ్ తన తన ఆత్మకథ పార్ట్ - ’ సిద్ధం చేస్తున్నారు. ఆ పుస్తకానికి ‘మై ఇర్రెగ్యులర్ డైరీ’ అని పేరు పెట్టారు. ఈ సీక్వెల్ పుస్తకాన్ని మార్చిలో మార్కెట్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. గాంధీ కుటుంబ వ్యవహారతీరును, కాంగ్రెస్ పార్టీ నడిపించిన నాయకత్వంపై మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉంటాయని సూచనప్రాయంగా నట్వర్ వెల్లడించారు. ఇదిలా వుండగా, నట్వర్ సింగ్ రచించిన 'వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్' అనే ఆత్మకథ మరో నాలుగు రోజుల్లో మార్కెట్‌లోకి రానుంది. సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ కలిసిన నేపథ్యంలో ఏమైనా అంశాలను తొలగించారా అనే ప్రశ్నకు ఒక పదాన్ని కూడా తీయకుండా తన ఆత్మకథ మార్కెట్ లోకి రాబోతోందని నట్వర్ సింగ్ తెలిపారు.