అయినా కోర్టుకు హాజరు కాని సోనియా, రాహుల్..
posted on Dec 8, 2015 @ 4:27PM
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణకు గాను ఇరువురు కోర్టు హాజరుకావాల్సి ఉంది. కానీ సోనియా గాంధీ, రాహుల్ ఇద్దరూ కోర్టుకు హాజరుకాలేదు. దీనిపై స్పందించిన కోర్టు.. కోర్టుకు కచ్చితంగా హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోర్టుకు హాజరు కావాలని కోర్టు చెప్పినా ఇద్దరూ హాజరుకాకపోవడం. అంతేకాదు కోర్టు ఆదేశాలు ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజే రాహుల్ చెన్నై వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లారు. మరోవైపు ఈ విషయంపై మీడియా సోనియాను పదేపదే అడుగగా ఈ విషయంలో ఏ విధంగాను స్పందిచబోనని 'మీరయితే ఎలాంటి న్యాయం చెప్తారో చెప్పండి' అంటూ ఆమె ఎదురు ప్రశ్నించారు. మొత్తానికి కోర్టు ఆదేశాలను కూడా దిక్కరించిన సోనియా, రాహుల్ పై.. కోర్టు ఇంకెలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.