Shakira Is Pregnant

pop singer shakira, Shakira Pregnant, Shakira is pregnant with her first child. The Hips don't Lie singer has confirmed she and Spanish soccer star Gerard Pique are expecting a baby together and has decided to cut down on her work schedule over the coming weeks. Writing on her website, Shakira told her fans, "As some of you may know, Gerard and I are very happy awaiting the arrival of our first baby! At this time we have decided to give priority to this unique moment in our lives and postpone all the promotional activities planned over the next few days. "This means I will not be able to be a part of the iHeartRadio Music Festival, but I'm sure this weekend in Las Vegas will be spectacular and I will be closely following everything that happens there!" "I'd like to thank Clear Channel and my fans for their constant love and understanding." "Big kiss! And will see you very soon! Shakira."

యజమానిని కాల్చిన పెంపుడు కుక్క

  పెంపుడు కుక్క యజమానిని కాల్చింది అంటే ఏదో ఫన్ని వీడియో అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే ఫన్ని వీడియోలలో ఎక్కువగా అలాంటి సన్నివేశాలు చూసి నవ్వుకుంటాం. నిజజీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందని తెలిసి ఆశ్చర్యపడుతున్నారు. కుక్కే తన యజమానిపై కాల్పులు జరిపిన సంఘటన అమెరికాలోని న్యూయార్క్ లో చోటు చేసుకుంది. ప్లోరిడాకు చెందిన జార్జ్ డెలి లానియర్...తన దగ్గరున్న బెరెట్టా 9ఎంఎం ఆటోమేటిక్ తుపాకీని క్లీన్ చేసి నేలమీదే పెట్టి బయటకు వెళ్ళిపోయాడు.   అతను బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి, కారు ఆపి దిగిన వెంటనే ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. ఏం జరిగింది! అని చూసుకొనే సరికి తన కాలులో నుంచి పొగ రావడం గమనించాడు. లైట్ గా రక్తం కూడా కారుతుంది. తీరా చూసుకొనే సరికి తన పెంపుడు కుక్క తాను క్లీన్ చేసినా గన్ పై నిలుచోని వుంది. యజమాని ఇంటికి రావడాన్ని గమనించిన కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గన్ ట్రిగ్గర్ పైన కాలు పెట్టడంతో అది కాస్త పేలి అతనికే తగిలింది. అయితే తన నిర్లక్ష్యానికి తగిన శాస్తి జరిగిందని ఆయన బాధపడ్డాడు.  

ఆమెను హింసించింది ఆ మైనరే !

      ఢిల్లీ లో గత నెల 16 వ తేదీన జరిగిన పారా మెడికల్ స్టూడెంట్ ఫై జరిగిన అత్యాచారంలో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు.   అత్యాచారం అనంతరం ఆ అభాగ్యురాలిని బస్సులోనుండి తోసివేయాలనే నిర్ణయం తీసుకొనడంతో పాటు, ఆమెను బస్సులో చిత్ర హింసలకు గురి చేసిన ఆ బాలుడు మాత్రం ప్రస్తుతం కఠిన శిక్ష నుండి మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఉద్యమకారులతో పాటు, పోలీసులకు కూడా మింగుడు పడని ఈ విషయంలో ఏమీ చేయలేని పోలీసులు ఆ బాలుడి పేరును చార్జ్ షీట్ లో నుండి తొలగించారు. ఇప్పటి చట్టాల ప్రకారం బాల నిందితులు ఎంత నేరానికి పాల్పడినా మూడు సంవత్సరాలకు మించి జైలులో పెట్టడానికి వీలు లేదు.   అసలు బస్సులో వారందరినీ అత్యాచారానికి ఉసిగొల్పింది ఆ బాలుడేనని సమాచారం ! ఆ యువతిఫై ఆ బాలుడు రెండు సార్లు అత్యాచారం చేశాడు కూడా. ఆమె జననాంగాలలోకి రాం సింగ్ తో కలిసి రాడ్ దూర్చడం వంటి దారుణ పనులకు ఒడిగట్టిన ఆ బాలుడు ప్రస్తుతం మైనర్ అయిన కారణంగా అతి తక్కువ శిక్షతో బయట పడే అవకాశం ఉంది. మైనర్ అయినా కూడా ఆ బాలుడు చేసిన పనులు దారుణంగా ఉన్నాయని, అవసరమైతే ఈ విషయంలో చట్టాలను సవరించాలని ఆ యువతి సోదరుడు మీడియా తో అన్నారు.   ఈ కారణాలతో బాల నేరస్తుల చట్టాన్ని సవరించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.సాక్షాత్తు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తేజేంద్ర ఖన్నా కూడా ఇలా డిమాండ్ లు చేస్తున్న వారిలో ముందు వరసలో ఉన్నారు.  

ఎంఎల్ఏ బెయిల్ కు పోలీసుల గండి

      ఓ హత్య కేసులో నిందితునిగా ఉన్న గుంటూరు జిల్లా గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు బెయిల్ ప్రయత్నాలకు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గండి కొట్టారు. కాంగ్రెస్ నాయకుడు ఉన్నం నరేంద్ర హత్య కేసులో యరపతినేని మూడవ నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే. దీనితో ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నరసరావుపేట 13 వ అదనపు జిల్లా న్యాయమూర్తి రామారావు ఎదుట నిన్న ఈ పిటీషన్ ఫై విచారణ జరిగింది. ఆ ఎంఎల్ఏ తరపున వాదించిన న్యాయవాది తన వాదనను వినిపిస్తూ, అధికార పార్టీకి చెందిన ఎంఎల్సీ కృష్ణా రెడ్డి తన క్లెయింట్ ఫై కక్ష సాధించడానికే ఈ కేసులో ఇరికించారనీ, అసలు పోలీసుల ఎఫ్ఐఆర్ లో ఎంఎల్ఏ పేరు లేదని అన్నారు. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నిందితులకు, తన క్లెయింట్ కు ఎలాంటి సంబంధం లేదని వాదించారు. అయితే, యరపతినేని చేసిన ఈ బెయిల్ ప్రయత్నాలకు పోలీసులు, ప్రాసిక్యూషన్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గండి కొట్టారు. యరపతినేని నిర్వహించిన ఓ బహిరంగసభలో రాళ్ళు రువ్విన నరేంద్రను ఉద్దేశించి ‘రాళ్ళు రువ్విన వారిని స్మశానానికి పంపే వరకూ నిద్రపోను’ అన్న వీడియో క్లిప్పింగ్ ను స్థానిక సిఐ తన లాప్ టాప్ ద్వారా న్యాయమూర్తికి చూపించారు. అలాగే, ఈ హత్య జరిగిన తర్వాత ఈ కేసులోని నిందితులతో ఎంఎల్ఏ ఫోన్లో మాట్లాడిన విషయాన్ని దానికి రుజువుగా ఆయన కాల్ లిస్టు ను న్యాయమూర్తికి చూపించారు. దీనితో, ఆ ఎంఎల్ఏ కు బెయిల్ నిరాకరిస్తూ, న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

టిడిపి సీనియర్లఫై నన్నపనేని అసంతృప్తి

      గత నెల 28 న ఢిల్లీ లో తెలంగాణాఫై జరిగిన అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా అనుకూల వైఖరి తీసుకొని ఆ ప్రాంతంలో ఎలాగో గట్టేక్కామని తెలుగు దేశం పార్టీ భావిస్తున్న సమయంలో ఆ పార్టీకి చెందిన ఆంధ్రా ప్రాంత నేతల నుండి పార్టీకి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.   పార్టీ తీసుకొన్న వైఖరిఫై మొన్న టిడిపి పార్లమెంట్ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అసంతృప్తి గళం విప్పితే, నిన్న ఆ పార్టీ శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి ఈ కోవలోకి చేరారు. తాను సమైఖ్య వాదినని ప్రకటించారు. తమ పార్టీ అధిష్టానం నుండి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడవద్దని తమకు ఆదేశాలు ఉన్నాయని, అందువల్ల ఈ విషయంలో ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉందని ఆమె అన్నారు. కొంత మంది పార్టీ నాయకులు పార్టీలో ఏమి చేసినా జరిగిపోతుందని ఆమె విమర్శలు చేశారు.   చంద్రబాబు చుట్టూ ఉండే వారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలని ఆమె సూచించారు. తెలంగాణా కు వ్యతిరేకంగా మాట్లాడిన వేణుగోపాల్ రెడ్డి ని తాను అభినందిస్తున్నానని ఆమె అన్నారు. తాను సుదీర్ఘ కాలం పార్టీ కోసం కష్టపడటం వల్లే తనకు శాసన మండలి సభ్యత్వం ఇచ్చారని ఆమె అన్నారు.  

సైకిలు ఎదురొస్తే కారుకు భయమెందుకు?

      ఇంతవరకు చంద్రబాబు ‘రెండుకళ్ళ’ సిద్దాంతంతో తెలంగాణా ప్రజలను మోసంచేస్తున్నాడని నిందించిన తెరాస, మొన్నజరిగిన అఖిలపక్షసమావేశంలో తెలుగుదేశంపార్టీ తెలంగాణాకి అనుకూల వైఖరిని ప్రకటించిన తరువాత, ఆపార్టీని మెచ్చుకోలేక, వ్యతిరేకించనూ లేక తెరాస ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది. ఇంతవరకు తెలంగాణా పై పూర్తీ పేటెంట్ హక్కులు తనవేఅన్నట్లు వ్యహరిస్తున్న తెరాసకి, ఇప్పుడు తెలుగుదేశం ఈ విదంగా ప్రకటించడం మింగుడు పడకపోవడంలో పెద్ద వింతేమి లేదు.   బిజెపి, సి.పి.ఐ.వంటి పార్టీలు తెలంగాణాకి అనుకూలమని చెప్పినప్పటికీ కంగారు పాడనీ తెరాస ఇప్పుడు తెలుగుదేశంపార్టీ అనుకూలమని ప్రకటించేసరికి మాత్రం ఎందుకో కొంచెం అసౌకర్యంగా భావిస్తోంది. ఎందుకంటే, బిజెపి, సిపిఐ పార్టీలు రెండూ కూడా తనని ఎన్నికలలో సవాలు చేసే స్థాయిలో లేవు గనుకనే వాటిని చూసి భయపడని తెరాస, తెలంగాణాలో తెలుగుదేశంపార్టీకున్న పటిష్టమయిన క్యాడర్, ప్రజల మద్దతును చూసి అది ఇప్పుడు మరింత బలపడి, మున్ముందు ఎన్నికలనాటికి తనకి సవాలు విసిరే అవకాశం ఉండవచ్చనుననే ఆందోళనతోనే గులాబిదండు తెలుగుదేశం వెంటపడినట్లు కనిపిస్తోంది. ఇంతవరకూ, తెలుగుదేశంపార్టీ తెలంగాణా వ్యతిరేఖి అంటూ ఆ పార్టీపట్ల ప్రజలలో ఏహ్యత కల్పించగాలిగిన తెరాస, ఆ పార్టీ ఎన్నటికీ తెలంగాణా వ్యతిరేఖిగానే ఉంటేనే తనకు రాజకీయంగా మేలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. తద్వారా, తెలంగాణాలో తన మాటే వేదవాక్కుగా చెలామణి అవుతుంది, ఎన్నికలలో కూడా మరే పార్టీ తనకు పోటీ ఉండదు. గానీ, తెలుగుదేశంపార్టీ ఈవిదంగా తెలంగాణా అనుకూల వైఖరిని ప్రదర్శించి తనకు పోటీగా తయారవడం సహించలేని కారణంగానే తెరాస తెలుగుదేశంపార్టీపై విమర్శలు చేస్తోంది.    తెలుగుదేశంపార్టీ షిండేకి ఇచ్చిన లేఖలో ఆ పార్టీ ప్రత్యేకతెలంగాణా కోరినట్లు తెరాసకు అర్దమయినపటికీ, రాజకీయంగా తెలుగుదేశంపార్టీని ఎదుర్కోక తప్పదు గాబట్టి, ఆ లేఖలో ఎక్కడా కూడా ‘తెలంగాణా అనేపదం’ లేకుండా వ్రాసి ప్రజలని మరోమారు మోసంచేస్తోందని ఒక అర్ధం లేని వితండవాదం మొదలు పెట్టింది. అఖిలపక్షసమావేశంలో పాల్గొన్న అన్నిపార్టీలకు అర్ధమయిన సంగతి తెరాసకు అర్ధం కాలేదంటే ఎవరు కూడా విశ్వసించరు.   తెలుగుదేశంపార్టీ అఖిలపక్ష సమావేశంలో తెలంగాణాకి అనుకూలంగా తన నిర్ణయం ప్రకటించిన తరువాత ప్రజా సంఘాల ఐ.క.స., ఉస్మానియా.ఐ.క.స.కు చందిన నేతలు గజ్జెల ఖంతం, రాజారామ్ యాదవ్ వంటి అనేక తెలంగాణా సంఘాలవారు  అభినందలు తెలుపుతూ చంద్రబాబును కలుస్తున్న ఈ సమయంలోనే, సీమంధ్ర వైపునుండి అతనికి మెల్లగా నిరసనలు పలకరిస్తున్నాయి. గుంటూరు జిల్లా, నరసరావుపేటకు చెందిన తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి మరోఅడుగు ముందుకువేస్తూ, త్వరలో తానూ చంద్రబాబును కలిసి పార్టీ నిర్ణయాన్నివ్యతిరేకిస్తున్నట్లు తెలియజేసి, సమైక్యంద్ర కోసం పార్టీని వీడాలనుకొంటున్నట్లు ప్రకటించేరు. మరో వైపు, సీమంద్రకు చెందిన కాంగ్రేసు నేతలయిన శైలజానాథ్ వంటివారు చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపడుతుండగా, అదే పార్టీకి చెందిన తెలంగాణా యం.పీ.లు ఆయనని అభినందిస్తూ తెలంగాణా ఏర్పడేవరకూ మాట తప్పవద్దని హెచ్చరించారు.   ఇంతమందికి అర్ధమయిన విషయం మరి తెరాసకు అర్ధం కాలేదంటే నమ్మశక్యంగా లేదు. తెలుగుదేశంపార్టీకి చెందిన తెలంగాణానేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఇదే విషయాన్నీ ప్రశ్నిస్తూ, “మా పార్టీ ప్రత్యేక తెలంగాణా కోరడం మీకు అయిష్టంగా ఉందా లేక మేము ఆవిధంగా ప్రకటించి మీ పార్టీకి సవాలుగా తయారయమని మీరు భయపడుతున్నారా చెప్పండి? అంటూ ప్రశ్నించారు.   ఇక చంద్రబాబు కూడా తాము 2008 సం.లో వ్రాసిన ఏలేఖని చూసి తమతో తెరాస పొత్తుకు అంగీకరించిందో ఇప్పుడు అదే లేఖకి విలువలేదని ఎందుకు అంటోంది అని సూటిగా ప్రశ్నించేరు. అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ నిజంగానే సమైక్యాంద్రకి మొగ్గు చూపుతూ మాట్లాడి ఉంటే, తెలంగాణా ఉద్యామలకి పురిటిగడ్డ అని పేరుపడ్డ వరంగల్ లో చంద్రబాబుని కాలుమోపనీయ కుండా అక్కడి స్థానిక ప్రజలే అడ్డుపడేవారు. గానీ, చంద్రబాబు యాత్రకి ప్రజలు చాలచోట్ల సంఘీభావం కనబరుస్తున్నట్లు వస్తున్నవార్తలును చూస్తే, వారు కూడా తెలుగుదేశంపార్టీ ఈసారి తెలంగాణాకి అనుకూలనిర్ణయం ప్రకటించిందని విశ్వసించినట్లు అర్ధం అవుతోంది.   తెలంగాణాలో తనకి మరే ఇతర పార్టీ కూడా పోటీ ఉండకూడదని కోరుకొనే తెరాస, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, వై.యస్సార్.పార్టీలపై  ‘తెలంగాణా వ్యతిరేఖముద్ర’ లేదా ‘సీమంద్రా ముద్ర’ వేసి ఉన్న మూడు బలమయిన పార్టీలను తెలంగాణానుండి తరిమేయాలని ఆలోచిస్తున్నట్లు అర్ధమవుతోంది. కొద్ది రోజుల క్రితం కేసిర్ తననోటితోనే కాంగ్రెస్ పార్టీలో తెరాసను కలిపేయడానికికూడా సిద్ద పడ్డానని చెప్పిన సంగతి మరిచిపోయి, తెలంగాణా ఈయకపోతే కాంగ్రెసుకు బొంద పెడతానని, నామరూపాలు లేకుండా చేస్తామని బీరాలు పలకడం చాలా విచిత్రం. రేపు అదే కాంగ్రెస్ మళ్ళీ ఏదయినా చక్రం తిప్పినట్లయితే, మళ్ళీ ఆ పార్టీ చుట్టూనే తెరాస అదినేత కేసిర్ తిరిగినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. గానీ, అతను తమ పార్టీని అంతగా కించపరుస్తుంటే దానిని ఖండించకపోగా అతనితోనే రాసుకుపూసుకు తిరగడం కాంగ్రెస్ నేతల దౌర్భాగ్యం.  తప్పనిసరయితే, అతనికే ఊడిగం కూడా చేసేందుకు సిద్దం అని కాంగ్రేసు నేతలు కొందరు చెప్పడం మరింత సిగ్గుచేటయిన విషయం. ఈ విదంగా తెలంగాణా కాంగ్రెసు సభ్యులను మెల్లగా తన దారికితెచ్చుకొంటూ, మిగిలిన రెంటినీ అడ్డుతోలగించుకొనే ప్రయత్నంలోనే, తెరాస ఇప్పుడు వై.యస్సార్.పార్టీ, తెలుగుదేశంపార్టీలపై దాడి చేస్తోందని భావించవలసి ఉంటుంది. గులాభి దండు  వై.యస్సార్.పార్టీపై ఆగ్రహం చూపడానికి కొంత అర్ధం ఉన్నపటికీ,తెలంగాణాకి అనుకూలమని చెప్పిన తెలుగుదేశంపార్టీపై కూడా విమర్శల వర్షం కురిపిస్తోందంటే, తెలుగుదేశం పార్టీ నేతలు చెపుతున్నట్లు నిజంగానే తమపార్టీని చూసి తెరాస గుండెల్లో రైళ్ళు పరుగేడుతున్నాయని భావవించవలసి వస్తుంది.

సన్నీ లియోన్ చాలా కాస్ట్ లీ గురూ..!

      అసలే పోర్న్ స్టార్..ఇక జిస్మ్ల్ చిత్రంలో తన అందాలతో యువతను మత్తెక్కించి చిత్తుచేసింది. అలాంటి పోర్న్ స్టార్ డిసెంబరు 31న ఓ వేదిక మీద డాన్స్ చేయాలంటే మాటలా. తన ఫాలోయింగ్ ను బట్టి తను కూడా ఉంటుంది. అందం ఉన్నప్పుడు చూపిస్తేనే ఎవరయినా చూస్తారు. అది కాస్తా పోయాక ఎవరు పలకరిస్తారులే అనుకుందేమో సన్నీ లియోన్ తను చెప్పిన రేటుకు ఒక్క రూపాయి తగ్గేది లేదు. చేతనయితే కార్యక్రమం ఫిక్స్ చేసుకోండి..లేకుంటే మీ ఇష్టం అని తెగేసి చెప్పిందట. దీంతో దిమ్మ తిరిగిన ఆ స్టార్ హోటల్ నిర్వాహకులు సన్నీ చెప్పిన రేటుకు ఓకే అన్నారట. ఇక ఇప్పుడు ఢిల్లీలోని స్టార్ హోటల్ రేట్లకు కూడా రెక్కలొచ్చాయి మరి. ఒక్కటా రెండా ఏకంగా ఒక్క రాత్రికి కోటి రూపాయలు అఫర్ చేశారు. ఆ మాత్రం ధరలు పెంచకుంటే గిట్టుబాటవుతుందా ? సన్నీ లియోన్ అందాలు తెరమీద కాకుండా ప్రత్యక్ష్యంగా చూడాలంటే ఈ నెల 31న ఢిల్లీలోని ఆ స్టార్ హోటల్ కు వెళ్లాల్సిందే. పోర్స్ స్టార్ గా అంతంత మాత్రం ఆదాయంతో నెగ్గుకొచ్చిన సన్నీ భారతీయ మార్కెట్ బాగానే రుచి చూస్తోందన్న మాట.

‘టి’ కి వ్యతిరేకంగా మాట్లాడితే, పరుగే పరుగు !

      ఈ నెల 28 న ఢిల్లీ లో జరిగే అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా కు వ్యతిరేకంగా మాట్లాడితే, తెలుగు దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణా లో చేస్తున్న పాదయాత్రలు కాస్తా పరుగు యాత్రలుగా మారతాయని తెలంగాణా రాష్ట్ర సమితి ఎంఎల్ఎ కే. తారక రామా రావు హెచ్చరించారు.   కాంగ్రెస్, తెలుగు దేశం, వై ఎస్ ఆర్ కాంగెస్ పార్టీలు ఒకే అభిప్రాయం చెప్పాలని ఆయన సూచించారు. ఈ సమావేశం తేదీ దగ్గర పడుతుండడంతో టిఆర్ఎస్ దూకుడు పెంచినట్లుగా కనపడుతోంది. ప్రతి పార్టీ నుండి ఇద్దరేసి ప్రతినిధులు రావాలని కేంద్రం సూచించడంతో టిఆర్ఎస్ ఈ హెచ్చరిక చేసినట్లు భావిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయి.   రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రాజ్యాంగానికి లోబడి పనిచేయడం లేదని కేటిఆర్ విమర్శించారు.