ప్రణీత్ కుమార్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు
posted on Mar 15, 2024 @ 3:53PM
మాజీ డిఎస్పీ ప్రణీత్ కుమార్ రిమాండ్ రిపోర్ట్ సంచలన విషయాలు వెల్లడి చేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలముందు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందన్న సమాచారంతో ప్రణీత్ కుమార్ సడెన్ గా తన డిసీషన్ మార్చుకున్నాడు. తను ఉప యోగించిన హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేసే పనిలో పడ్డాడని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. మొత్తం మూడు రకాల నేరాలకు ప్రణీత్ కుమార్ పాల్నడినట్లు తెలుస్తోంది. ఒకటి ఫోన్ ట్యాపింగ్ రెండు సాక్ష్యాలను చెరిపి వేయడం, మూడు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం వంటి నేరాలకు ప్రణీత్ కుమార్ పాల్పడినట్లు ఆధారాలు లభించాయి. 17 సిస్టమ్ ల ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నేరాలకు పాల్పడ్డాడు. ఈ కేసును జూబ్లిహిల్స్ ఎసిపి వెంకటగిరి దర్యాప్తు అధికారిగా ప్రభుత్వం నియమించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతి రోజున అంటే డిసెంబర్ 4న రాత్రి కట్టర్లు ఉపయోగించి పాత హార్డ్డిస్క్లో ఉన్న డేటా మొత్తాన్ని చెరిపేసి వాటిని ధ్వంసం చేశాడు. ఏళ్ల తరబడి రహస్యంగా సేకరించిన డేటాను ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా రాగానే చెరిపేశాడు. ధ్వంసం చేసిన పాత హార్డ్డిస్క్ల స్థానంలో కొత్త వాటిని అమర్చినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
అరెస్ట్ సందర్భంగా ప్రణీత్రావు నుంచి మూడు సెల్ఫోన్లు, ఒక ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. సాక్ష్యాల చెరిపివేత, ప్రభుత్వ ఆస్తి ధ్వంసం, ఎలక్ట్రానిక్ సాక్ష్యాల ట్యాంపరింగ్ వంటి నేరాలకు పాల్పడినట్టు తేలింది. 17 కంప్యూటర్ల ద్వారా ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ చేశాడని, అందుకోసం ప్రత్యేకంగా ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ప్రణీత్కు కేటాయించారని తెలిసింది. ప్రముఖ కాల్స్ను రహస్యంగా రికార్డు చేసి దానిని తన పర్సనల్ పెన్ డ్రైవ్లోకి కాపీచేసుకునే వాడని తేలింది. ఆయనతోపాటు మరికొందరు కూడా ఈ అక్రమాల్లో పాలుపంచుకున్నట్టు తేలింది.
ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ వివరాలు తమకు చిక్కినట్టు పేర్కొన్న ఒక టీవీ చానెల్ మరెన్నో సంచలన విషయాలను బయటపెట్టింది. బీఆర్ఎస్ ముఖ్యనేత ఇచ్చిన ఆదేశాలతోనే ప్రణీత్ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని, ఆయన ఇచ్చిన వంద నంబర్లపై ప్రణీత్ కన్నేశారని పేర్కొంది. రేవంత్రెడ్డి ఎవరెవరిని కలుస్తున్నారు? అన్నదానిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపింది. రేవంత్రెడ్డిని ఎవరు? ఎక్కడ కలుస్తున్నారు? అన్న సమాచారాన్ని ప్రణీత్రావు బీఆర్ఎస్ పెద్దలకు అందించారని, డబ్బులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయన చేరవేశారన్న విషయాలు వెలుగులోకి వచ్చాయని వివరించింది.
రేవంత్రెడ్డి అనుచరులతోపాటు చుట్టుపక్కల ఉన్న వారి ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. రేవంత్రెడ్డి సోదరుల ఫోన్ నంబర్లను కూడా ప్రణీత్ ట్యాప్ చేశారు. అక్కడితో ఆగకుండా కొందరు మీడియా పెద్దల ఫోన్లను సైతం ఆయన ట్యాప్ చేసిన విషయం చాటింగ్ ద్వారా బయటపడిందని, దీని ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారని ఒ కథనంలో పేర్కొంది.