Sakshi Dhoni recreates her wedding outfit for Dhoni!

 

Indian cricket limited overs captain MS Dhoni is on a spree promoting his biopic ‘MS Dhoni: The untold story’ in which Sushant Singh Rajput plays his onscreen self. On Friday, the crew, along with Dhoni met Tamil superstar Rajinikanth. Dhoni uploaded a live video on his Facebook page of the encounter. MS Dhoni: The Untold Story has been one of the most-awaited biopics of the year. The Neeraj Pandey directorial promises to give audience an insight into Dhoni’s life and as the film’s tagline suggests “the man you know, the journey you don’t,” will reveal lots of untold stories that the audiences might not be aware of. The makers have shared Sakshi Dhoni’s wedding picture. Actress Kiara Advani, who plays Dhoni’s onscreen wife Sakshi, wore the exact wedding lehenga choli weaving all the fine details that made her transform into Sakshi Dhoni onscreen. In a bid to make the cricketer's wedding scene as authentic as possible, a replica of Sakshi's shaadi ka joda was created for Kiara. In fact, Sakshi took the actress to the same designer, who had fashioned the bridal lehenga. MSD's wife also wanted the make-up and accessorising to be exactly theway she had done it. The movie which also stars Disha Patani as Dhoni’s girlfriend, is all set to revive the ace cricketer’s journey onto the big screen. It will be releasing on the 30th of September.

ఐడీపీఎల్ ల్యాండ్స్‌పై విజిలెన్స్ విచారణ

హైదరాబాద్ లోని ఐడీపీఎల్  భూముల వివాదం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దాదాపు నాలుగు వేల  కోట్ల రూపాయల విలువైన భూములపై వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచా రణకు ఆదేశాలు జారీ చేసింది. కూకట్‌పల్లి పరిధిలోని సర్వే నంబర్‌ 376లో జరిగిన లావా దేవీలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఐడీపీఎల్ భూముల విషయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత  ఇటీవల పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ భూముల వ్యవహారం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.   ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఆయన కుమారుడు భూకబ్జాలకు పాల్పడ్డారని కవిత ఆరోపించగా,  మాధవరం కృష్ణారావు కవిత భర్త అనిల్‌పై భూకబ్జా ఆరోపణలు చేశారు. ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో  ప్రభుత్వం ఈ భూముల అసలు యాజమాన్యం, గతంలో జరిగిన లావాదేవీలు, అక్రమ కబ్జాల అంశాలపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేసి పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని ఆదేశించింది.   ఈ విచారణలో  కబ్జాదారులు ఎవరన్నది తేలితే   వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని ప్రభుత్వం స్పష్టం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ వివాదం రాజకీయంగా సంచలనంగా మారగా, విజిలెన్స్ విచారణతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా బ్రహ్మణి నో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి కోడలు, మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబును స్కిల్ కేసు పేరుతో అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో నారా బ్రహ్మణి తొలి సారిగా ప్రజల మధ్యకు వచ్చి అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ సందర్భంగా ఆమె ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. స్వచ్ఛమైన ఉచ్ఛారణతో తెలుగులో ఆమె చేసిన ప్రసంగం, రాజకీయాలపై ఆమెకు ఉన్న అవగాహనను ప్రస్ఫుటం చేసింది. దీంతో అప్పట్లో తెలుగుదేశం కు నారా బ్రహ్మణి బ్రహ్మాస్త్రం అంటూ తెలుగుదేశం శ్రేణులు పేర్కొన్నాయి. విశ్లేషకులు సైతం ఆమె రాజకీయాలలోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే తాజాగా బ్రహ్మణి స్వయంగా తనకు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తన ప్రథమ ప్రాధాన్యత హెరిటేజ్ ఫుడ్స్ మాత్రమేనని చెప్పారు.   బిజినెస్ టుడే  ఈ నెల 12న ముంబైలో నిర్వహించిన 'మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ -2025 కార్యక్రమంలో బ్రాహ్మణి  పాల్గొని ప్రసంగించారు. హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా  సమాజంపై గొప్ప ప్రభావం చూపించే అవకాశం తనకు లభించిందన్న ఈ సందర్భంగా ఆమె చెప్పారు. కాగా కార్యక్రమ నిర్వాహకులు ఒక వేళ చంద్రబాబు మిమ్మల్ని రాజకీయాలలోకి రావాల్సిందిగా కోరితే ఏం చేస్తారు అన్న ప్రశ్నకు.. నారా బ్రహ్మణి రాజకీయాలు తనకు  ఆసక్తికరమైన రంగం కాదని స్పష్టం చేశారు. పాడి పరిశ్రమ రంగంలో  లక్షల మంది మహిళా రైతులు, కోట్లాది మంది వినియోగదారులపై ప్రభావం చూపగలిగే అవకాశం తనకు లభించిందని, అటువంటి అవకాశాన్ని తాను వదులుకోదలచుకోలేదని బ్రాహ్మణి అన్నారు. 

అనుచిత పోస్టుల కేసు... జగన్ సమీప బంధువు అరెస్ట్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు  అర్జున్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో అప్పటి విపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై ఇష్టారీతిగా అసభ్య పోస్టులు పెట్టిన కేసులో ఈ అరెస్టు జరిగింది.  జగన్ అధికారంలో ఉన్న సమయంలో  తమకు ఎదురే లేదన్నట్లు చెలరేగిపోయిన వైసీపీ నేతలు, అప్పటి తన కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవించక తప్పడం లేదు. జగన్ గద్దె దిగి   రెండేళ్లు అవుతున్నా నాడు జగన్ అధికారం అండ చూసుకుని చెలరేగి అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయినందుకు ఫలితం అనుభవించక తప్పడం లేదు.  జగన్ హయంలో ఇష్టారీతిగా వ్యవహరించి, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులతో చెలరేగిపోయిన వైసీపీ నేతలు పలువురు తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే విదేశాలకు పరారైపోయారు. అయితే పోలీసులు వారికి లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి మరీ అరెస్టులు చేస్తున్నారు.   అధికారం శాశ్వతం, ఏపీలో ఇక తమకు ఎదురేలేదన్నట్లు అక్రమాలు, దౌర్జన్యాలతో చెలరేగిపోయి,  జగన్ మెప్పు కోసం  సోషల్ మీడియాలో విపక్షాల ముఖ్యనేతలు, వారి కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెడుతూ   రాక్షస ఆనందం పొందిన వైసీపీయులు ఇప్పుడు  కేసులు ఎదుర్కొంటున్నారు.  ఎక్కడెక్కడికో పరారైన వైసీపీ నేతలను పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి మరీ అదుపులోనికి తీసుకుంటున్నారు.   తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్ సమీప బంధువు అర్జున్‌రెడ్డిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ సోషల్ మీడియా విభాగంలో అప్పటి ఆ వింగ్ ఇన్చార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డితో కలిసి అర్జున్‌రెడ్డి యాక్టివ్‌గా పని చేశాడు. ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వారి కుటుంబ సభ్యుల చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి వైసీపీ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారంటూ అర్జున్‌రెడ్డిపై గతేడాది నవంబరులో గుడివాడలో కేసు నమోదైంది. అప్పట్లో అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా విదేశాలకు పారిపోయాడు. తర్వాత పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. తాజాగా అతను విదేశాల నుంచి తిరిగి రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అర్జున్‌రెడ్డిని అడ్డుకుని గుడివాడ పోలీసులకు సమాచారమిచ్చారు. ఏపీ నుంచి వెళ్లిన పోలీసు బృందాలు అదుపులోనికి తీసుకుని సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ నోటీసులు అందజేశారు. అయితే అర్జున్‌రెడ్డి అప్పటికే తన లాయర్లను ఎయిర్‌పోర్టుకి రప్పించుకున్నారు. అతనిపై ఉమ్మడి కడప జిల్లా సహా పలు జిల్లాల్లో కేసులున్నాయి.  వైఎస్ జగన్‌కు బాబాయ్ వరుసయ్యే వైఎస్ ప్రకాశ్‌రెడ్డి మనుమడే అర్జున్‌రెడ్డి. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో నిందితుడైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్‌యాదవ్, అర్జున్‌రెడ్డిల మధ్య వివేక హత్య జరిగిన రోజు రాత్రి ఫోన్ సంభాషణలు జరిగినట్లు అభియోగాలున్నాయి. దీనిపై దర్యాప్తు చేసి, అనుబంధ చార్జ్‌షీట్ వేయాలని హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు ఇటీవల సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే.  మరోవైపు బద్వేలుకు చెందిన వైసీపీ నేత బత్తల శ్రీనివాసులరెడ్డిని  కడప చిన్నచౌకు పోలీసులు హైదారాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం అయిన నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై బత్తల శ్రీనివాసులరెడ్డి సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడు. దీనిపై కడపకు చెందిన టీడీపీ నేతలు గత ఏడాది నవంబరులో చిన్నచౌకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాసులురెడ్డిపై చిన్నచౌకుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. కాగా.. కూటమి అధికారంలోకి రాగానే బత్తల శ్రీనివాసులరెడ్డి గల్ఫ్‌ వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో  గల్ఫ్‌ నుంచి ఆయన హైదారబాద్‌కు రాగానే ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకుని కడప పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చిన్నచౌకు పోలీసులు హైదారబాద్‌కు వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకుని కడపకు తీసుకువచ్చారు. మొత్తానికి అరెస్టుల భయంతో అసలే బిక్కుబిక్కు మంటున్న వైసీపీ శ్రేణులకు ఈ తాజా అరెస్టులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం : కవిత

  సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో తాము పోటీలో ఉంటామని తేల్చిచెప్పారు. సోమవారం ఆస్క్ కవిత హ్యాష్ ట్యాగ్ పై ట్విట్టర్ (ఎక్స్) లో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె వివరంగా సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ విషయంలో తన విజన్, జాగృతి భవిష్యత్ కార్యాచరణ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు సహా పలు ప్రశ్నలను నెటిజన్లు సంధించారు. వాటికి కవిత ఇచ్చిన సమాధానాలు. ట్విట్టర్ (ఎక్స్) పాలిటిక్స్ విభాగం లో ఆస్క్ కవిత ఇంటరాక్షన్ నంబర్ వన్ గా నిలిచింది. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం  సామాజిక తెలంగాణ తన ధ్యేయమని కవిత తెలిపారు. యువత, మహిళలు వారికి నచ్చిన రంగాల్లో అవకాశాలు పొందాలని...అందుకు వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. యువత, మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు జాగృతి కృషి చేస్తుందన్నారు. కొత్త పార్టీకి సంబంధించి అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.  ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడుతామన్నారు. తెలంగాణ సాధికారిత సాధించాలంటే మెరుగైన, నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలని అన్నారు. తెలంగాణ లో తల్లితండ్రులు పిల్లల చదువుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఉండే పరిస్థితి రావాలన్నారు. ఉద్యోగాలు, స్కిల్, భద్రత మూడింటిలో దేనికి ప్రాధాన్యం ఇస్తారని ప్రశ్నించగా... యువతకు ఉద్యోగాలు కల్పించటమే తన ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు.  ఉద్యోగాలతో పాటు వారికి భద్రత కూడా కల్పించాలన్నారు.  సామాజిక న్యాయం కోసం జాగృతి పోరాటం కొనసాగుతుందన్నారు. క్రమంగా జాగృతిని చాలా బలంగా తయారు చేస్తామని చెప్పారు. త్వరలోనే జాగృతి మెంబర్ షిప్ డ్రైవ్ కూడా ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా మేము వేసిన కమిటీల్లో ఇప్పటికే అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చామని చెప్పారు.  కాంగ్రెస్ పాలన పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రేవంత్ రెడ్డి పరిపాలన గురించి పలువురు నెటిజన్లు కవిత ను ప్రశ్నలు అడిగారు. రేవంత్ పాలన ఎలా ఉందన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవటంతో లక్షలాది మంది విద్యార్థులు చదువులకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వం నిర్లక్ష్యం ఆడపిల్లల చదువుకు మరణశాసనంగా మారిందన్నారు. ఇక రైతుల ఆత్మహత్యలు చాలా బాధకరమని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక వరుసగా రైతుల ఆత్మహత్యలు కొనసాగటం బాధకరమన్నారు. ప్రభుత్వం చేతగాని, నిర్లక్ష్య వైఖరిని ఇది నిదర్శనమని చెప్పారు. ఇక ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూముల్లో ఫ్యూచర్ సిటీ అంటూ హడావుడి చేయటంపై మండిపడ్డారు.  తర్వలోనే అక్కడి రైతులకు మద్దతుగా పోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక సింగరేణి సంస్థను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎంఎస్ తో కలిసి సింగరేణి కోసం ప్రభుత్వం పై పోరాటం చేస్తామన్నారు. హైదరాబాద్ లో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవటంపై కవిత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెస్ట్ సిటీ పై పెట్టిన శ్రద్ధ, ఈస్ట్ సిటీ ని సిటీ అభివృద్ది చేయటంలో పెట్టలేదన్నారు. చిరంజీవి అభిమానిని.. కవిత వ్యక్తిగత అభిరుచులకు సంబంధించి పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలని అడగగా...చాలా హంబుల్ గా ఉండే వ్యక్తి. మంచి డ్యాన్సర్ అన్నారు. ఐతే తాను చిరంజీవి అభిమానిని అని...చిరంజీవి తర్వాతే రామ్ చరణ్ అన్నారు.  చిన్నప్పుడు ఎర్రమంజిల్ లో గడిపిన క్షణాలు తనకు చాలా సంతోషానిచ్చాయని అన్నారు. ఐతే రాజకీయాలు కాకుండా ఏదైనా బిజినెస్ పై దృష్టి పెట్టాలంటూ ఓ నెటిజన్ సూచించగా... అందుకు కవిత కూల్ గా అన్సర్ చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి చాలా నెగిటివీ ఉంటుందని దాన్ని పట్టించుకోకుండా మంచిగా ఆలోచించాలని సూచించారు.  ట్విట్టర్ ట్రెండింగ్ లో టాప్ ఆస్క్ కవిత ఇంటరాక్షన్  గంటన్నర పాటు సాగింది. వందలాది మంది ట్విట్టర్ (ఎక్స్) లో ప్రశ్నలు అడిగారు .. కవిత వారికి సమాధానాలు ఇచ్చారు. సోమవారం  ట్విట్టర్ (ఎక్స్) పాలిటిక్స్ విభాగంలో ఈ ఇంటరాక్షన్ నంబర్ వన్ గా నిలిచింది.

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందే నియోజకవర్గాల పునర్విభజన!

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన పక్కాగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అది కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. డీ లిమిటేషన్ తరువాతనే సార్వత్రిక ఎన్నికలు ఉంటాయన్న మాట.  తనను కలిసిన పలు రాష్ట్రాలఎంపీలతో  అమిత్ షా ఈ విషయం చెప్పారు.   జనగణన నిర్దేశిత సమయానికే పూర్తవుతుందని అమిత్ షా అన్నారు.   జనగణనకు కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిదే.  ఈ జనగణన రెండు దశలలో పూర్తి కానుంది.  ఇలా ఉండగా నియోజకవర్గాల పునర్విభజనపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమైందని అధికార వర్గాలు చెబుతున్నాయి.  డీలిమిటేషన్‍లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లతోపాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక పోతే 2027 నాటికి  జనాభా లెక్కల సేకరణ పూర్త వుతుందనీ, ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలౌతుందనీ అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.  

ప్రత్యక్ష ఎన్నికలకు దూరం.. శ్రీకాకుళం సీటుపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు

జనసేన ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరమని సంచలన ప్రకటన చేశారు. తాను పార్టీ కార్యకర్తగానే ఉంటాననీ, రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ తన సోదరుడు పవన్ కల్యాణ్ కు అండగా, సహాయంగా ఉంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్సీగా చాలా హ్యాపీగా ఉన్నానన్న నాగబాబు, తనకు ఇది చాలని అన్నారు. వచ్చే ఎన్నికలే కాదు, అసలు ఏ ఎన్నికలలోనూ తాను పోటీ చేయనన్నారు. తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తున్న నాగబాబు ఆదివారం (డిసెంబర్ 14) శ్రీకాకుళంలో జనసేన నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఎన్నికలలో తన పోటీ గురించి వచ్చిన ప్రస్తావనపై స్పందించిన ఆయన ఐదారేళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనన్న ఆయన తాను మాత్రం ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.  వాస్తవానికి తాను ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటే.. 2024 ఎన్నికలలోనే పోటీకి దిగేవాడనన్న ఆయన.. తాను స్వయంగా   నిర్ణయించుకోవడం వల్లే పోటీకి దూరంగా ఉన్నట్లు తెలిపారు.    అయితే వాస్తవానికి నాగబాబు 2024 ఎన్నికలలో అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీకి దిగాలని భావించారు. అందుకు అన్ని విధాలుగా సంసిద్ధమయ్యారు కూడా. అయితే కూటమి పొత్తు ధర్మంలో బాగంగా ఆయన అనివార్యంగా విరమించుకోవలసి వచ్చింది. అనకాపల్లి నుంచి అవకాశం లేదన్నది నిర్ధారణ అయ్యాక కూడా నాగబాబు శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీకి ప్రయత్నించారు. అయితే పొత్తు ధర్మం కారణంగా అప్పట్లో ఆ అవకాశం కూడా దక్కలేదు.  సరే వచ్చే ఎన్నికల్లో అయినా శ్రీకాకుళం నుంచి బరిలో దిగాలని ఆయన భావిస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా ఆయన తరచుగా శ్రీకాకుళంలో పర్యటనలు చేస్తూ వచ్చారు. ఎంత ఎక్కువగా అంటే గత ఏడాది కాలంలో ఆయన శ్రీకాకుళంలో 12 సార్లు పర్యటించారు. దీంతో నాగబాబు కేంద్ర మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడి సీటుపై కన్నేశారంటూ తెలుగుదేశం శ్రేణుల నుంచి ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఇదో పెద్ద వివాదంగా పరిణమించే అవకాశాలున్నాయని గ్రహించిన నేపథ్యంలో నాగబాబు శ్రీకాకుళం వేదికగా తనకు అసలు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశమే లేదంటూ ప్రకటించి, వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఊరికే రారు మహాను భావులు.. అంబటి, ఉండవల్లి గుంటూరు ట్రిప్ మర్మమేంటో?

గుంటూరులో  ఇటీవల   ఉండవల్లి అరుణకుమార్, అంబటి రాంబాబు కలిసి,  ఇద్దరు మాజీ ఎంపీలు, టీడీపీ నాయకులు యలమంచిలి శివాజీ, రాయపాటి సాంబశివరావులను కలిశారు. వారిద్దరూ ఆనారోగ్యంతో ఉన్నారని పరామర్శకు వెళ్ళామని అంబటి ఒక వీడియో చేసి యూట్యూబ్ లోని తన సొంత సైట్‌లో పెట్టారు. దీనిపై పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు.  తెలుగుదేశం సీనియర్లు, అందులోనూ కమ్మసామాజికవర్గానికి చెందిన దిగ్గజాలను అంబటి పరామర్శించడం వెనుక లెక్కలేంటి?  ఊరకరారు మహానుభావులు అన్నట్లు అంబటి రాక వెనుక పొలిటికల్ ఈక్వేషన్లు ఏంటన్నది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.  అంబటి రాంబాబు అప్పుడెప్పుడో అంటే దాదాపు మూడున్నర దశాబ్దాల కిందట, 1989లో రేపల్లెలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదైపోయాక మళ్లీ 2019లో వైసీపీ నుంచి సత్తెనపల్లి ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు మంత్రిగా కూడా పని చేశారు.  అంతే మళ్లీ ఆయన్ని సత్తెనపల్లికి కూడా పనికిరాడని తేల్చేసిన జగన్ జిల్లా మార్చేసి.. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించింది. అయితే ఆయన ఆశలు పెట్టుకున్న గుంటూరు వెస్ట్ పార్టీ బాధ్యతలు మాత్రం అప్పగించలేదు. దాంతో అంబటి వారు నియోజకవర్గం లేని మాజీ మంత్రిగా మిగిలిపోయారు. అదలా ఉంటే రాజధాని  అమరావతి ప్రాంతం విస్తరించి ఉన్న గుంటూరు జిల్లాలో వైసీపీకి గత ఎన్నికల్లో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అమరావతిపై కమ్మ సామాజికవర్గం ముద్ర వేసి, ఆ ఆక్కసుతో అమరావతిని నిర్వీర్యం చేయాలని చూసిన వైసీపీకి జిల్లా వాసులు తగిన బుద్ది చెప్పారు. ఇప్పటికీ అమరావతిపై వైసీపీ స్పష్టమైన వైఖరి వెల్లడించడం లేదు. ఆ క్రమంలో జిల్లాలో పార్టీ ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది. ఆ ఎఫెక్ట్‌తో ఇప్పుడిప్పుడే పార్టీ బలోపేతంపై వైసీపీ అధిష్టానం దృష్టి సారిస్తోంది. జిల్లా పార్టీ అధ్యక్షులకు, పార్టీ ఇన్చార్జులకు బాధ్యతలు కట్టబెడుతోంది. అందులో భాగంగానే తమ పార్టీపై ఉన్న కమ్మ వ్యతిరేక ముద్రను తుడిచేసుకోవడానికి అంబటి రంగంలోకి దిగినట్లు కనిపిస్తున్నారు. పొలిటికల్‌గా ఎక్స్‌పైర్ అయిపోయి, దాదాపు అందరూ మర్చిపోతున్న టీడీపీ మాజీ ఎంపీలు, గుంటూరులో సీనియర్ కమ్మ నేతలు రాయపాటి సాంబశివరావు, యలమంచిలి శివాజీలు అందుకే అంబటికి గుర్తు కొచ్చారంటున్నారు. ఏదో ఒక వంక చెప్పి వారితో మాట్లాడివస్తే, లేనిపోని విమర్శలు వస్తాయి కాబట్టి... వారి అనారోగ్యం పేరు చెప్పి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో కలిసి వారిని కలిసి వచ్చారు. ఆ సందర్భంగా 80 ఏళ్లు పైబడిన యలమంచలి శివాజీ రాజ్యసభ స్థానానికి ఇప్పటికీ అర్హులని అయన్ని అందలానికెక్కించేసేలా మాట్లాడారు.  ఈ సందర్భంగా ఉండవల్లికి సోదరుడు వరుసయ్యే రఘు అనే పెద్దాయన్ని కలిస్తే.. ఆయన అంబటి రాంబాబు ముఖ్యమంత్రి అయిపోతారని జోస్యం చెప్పేశారు. అదలా ఉంటే వైఎస్ కు అంబటి , ఉండవల్లి ఇద్దరూ ఆప్తులు.. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకాలు కూడా. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సన్యాసం ప్రకటించేసిన ఉండవల్లి   సమయం వచ్చినప్పుడు మాత్రం చంద్రబాబును విమర్శిస్తుంటారు.  జగన్ పై కూడా విమర్శలు చేసినా అవి చాలా సున్నితంగా, జనగ్ హితం కోరి ఇస్తున్న సలహాల్లా  ఉంటాయి. అటువంటి ఉండవల్లి ఇప్పుడు  పనిమాలా గుంటూరు రావడం, అంబటితో కలసి రాయపాటిని, శివాజీ ని కలవడం.. శివాజీ రాజ్య సభలో ఉండాల్సిన వారంటూ పొగడ్తలు కురిపించడం వెనుక ఎదో మతలబు ఉందంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి సొంత పార్టీలో నియోజకవర్గం లేక .. టీడీపీ మాజీలైన కమ్మ దిగ్గజాలతో అలా కానిచ్చేస్తున్న అంబటి లెక్కలు ఎంత వరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

ఎన్ని జన్మలు ఎత్తిన తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రాదు : స్టాలిన్

  తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో భారతీయ జనత పార్టీ ఎన్ని జన్మలు ఎత్తినా అధికారంలోకి రాదంటూ ఘూటు వ్యాఖ్యలు చేశారు. అనుకొగానే బీజేపీ  అధికారంలోకి రావడానికి "ఇది బీహార్ కాదని.. తమిళనాడు అని స్టాలిన్ అన్నారు. బీజేపీ నాయకుల ఆటలు ఇక్కడ సాగవు అని తీవ్ర విమర్శలు చేశారు. కేవలం కేంద్ర మంత్రి  అమిత్ షా మాత్రమే కాదు, బీజేపీ నాయకులు అందరూ వచ్చినా కూడా తమిళనాడులో గెలవలేరని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజల మనస్తత్వాన్ని వివరిస్తూ, "ప్రేమతో వస్తే తమిళ ప్రజలు స్వాగతిస్తారు. కానీ అహంకారంతో వస్తే తన్ని తరిమేస్తారు" అని స్టాలిన్ హెచ్చరించారు. ఈ కామెంట్స్ రానున్న శాసన సభ ఎన్నికల నేపథ్యంలో  బీజేపీ, డీఎంకే మధ్య రాజకీయ ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉంది

కవిత జనజాగృతి ఎఫెక్ట్.. పంచాయతీల్లో బీఆర్ఎస్ కుదేలు

తెలంగాణ‌లో  మూడు విడతల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో బాగంగా తొలి రెండు విడతల పోలింగ్ జరిగి ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీ పునాదులు కదిలిపోతున్నాయా అనిపించేలా ఉన్నాయి. రెండు విడతలలోనూ కూడా కాంగ్రెస్ హవా బ్రహ్మాండంగా సాగింది. ఈ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే అత్యధికంగా విజయం సాధించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికలలో అయితే.. 193 మండలాల పరిధిలోని 3వేల‌, 911 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు  గాను  1,728 మంది స‌ర్పంచ్‌లు కాంగ్రెస్ మద్దతుదారులే.   తొలి విడతలో కాంగ్రెస్ హవాతో కంగుతిన్న బీఆర్ఎస్ రెండో విడత వచ్చే సరికి అప్రమత్తమైంది. రెండో విడ‌త‌లో  తడాఖా చూపాలని బీఆర్ఎస్ అగ్రనాయత్వం తన కేడర్ కుస్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది  అయినా కూడా రెండో విడతలోనూ బీఆర్ఎస్ చతికిల పడింది. కేవలం  912 స‌ర్పంచ్ స్థానాలలోనే విజయం సాధించింది.  గ్రామీణ స్థాయిలో బీఆర్ఎస్‌కు ప్ర‌జ‌ల నుంచి పెద్దగా మద్దతు లేదని ఈ రెండు విడతలలోనూ రూఢీ అయిపోయింది.   వాస్తవానికి తొలి విడతతో పోల్చుకుంటే రెండో విడతలో పోలింగ్ శాతం అధికంగా నమోదైంది. ఈ పెరిగిన ఓటింగ్ తమదేనని బీఆర్ఎస్ భావించింది. కానీ ఫలితాలు వెల్లడైన తరువాత ఆ పార్టీకి విషయం బోధపడింది.  పోలింగ్ శాతం అధికంగా ఉన్న చోట్లా, , స్వల్పంగా నమోదైన చోట్లా కూడా కాంగ్రెస్ ఆధిపత్యం సుస్పష్టంగా కనిపించింది.  మొత్తంగా.. రెండు విడతల్లోనూ కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ కు వాతావరణం అనుకూలంగా లేదనీ, ప్రజా మద్దతు కూడగట్టడంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమైందనీ తేటతెల్లమైంది.  ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పంచాయతీల్లో చతికిలబడటానికి కారణాలపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ మాజీ నేత, తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై ప్రతికూలతకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా సరిగ్గా పంచాయతీ ఎన్నికల వేళ కవిత చేపట్టిన జనజాగృతి యాత్ర ప్రభావం బీఆర్ఎస్ ఓటింగ్ పై తీవ్ర ప్రభావం చూపిందంటున్నారు. జగజాగృతి పేరుతో కల్వకుంట్ల కవిత వ‌రంగ‌ల్‌, క‌రీంగ‌న‌గ‌ర్‌, న‌ల్లగొండ‌, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో ప‌ర్య‌టించారు.  ఆయా జిల్లాల్లోని ప‌ల్లెల్లో కాంగ్రెస్ మ‌ద్ద‌తు దారులు విజ‌యం ద‌క్కించుకున్నారు. సో.. మొత్తానికి క‌విత దెబ్బ కూడా బీఆర్ ఎస్‌కు గట్టిగానే త‌గిలింద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

పంచాయతీ సిత్రాలు సూడ‌రో!.. సుసైడ్ విన్నర్ ఎవరో తెలుసా?

సింగిల్ ఓట్ విన్న‌ర్స్ అనే మాట వినే ఉంటాం ఆ మాట‌కొస్తే ల‌క్కీ డ్రా విన్న‌ర్స్ అనే క్యాప్ష‌న్ కూడా చ‌దివే ఉంటాం.. ఈ సూసైడ్ విన్న‌ర్స్ అంటే ఏంటి? ఈ పంచాయితీ ఎన్నిక‌ల్లో వెలుగులోకొచ్చిన కొత్త ప‌దం ఇది. సంగారెడ్డి, రాయికోడ్ మండ‌లం, పిప‌డ్ ప‌ల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజు ఉదంతంతో ఈ పదం పుట్టుకొచ్చిందని చెప్పొచ్చు.  స‌ర్పంచ్ అభ్య‌ర్ధిగా పోటీ చేసిన  రాజుది ఓ  విషాద గాథ‌. మ‌ద్ధ‌తుదారులు స‌హ‌క‌రించ‌డం లేద‌నీ, ఎన్నిక‌ల్లో ఖ‌ర్చుకు డ‌బ్బుల్లేవ‌న్న మ‌న‌స్తాపంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు రాజు. ఈ నెల 8న అత‌డు ఉరి వేసుకుని చ‌నిపోగా.. సర్పంచ్ ఎన్నికలలో అతడు  గెల‌వ‌డం పంచాయితీ  ఎన్నిక‌ల చ‌రిత్ర‌లోనే కొత్త రికార్డుగా న‌మోద‌య్యింది. అత‌డి మ‌ర‌ణం కార‌ణంగా మ‌ళ్లీ ఎన్నిక నిర్వ‌హించాల్సి వ‌స్తోంది. ఏది ఏమైనా రాజు సూసైడ్ విన్న‌ర్ గా నిలిచి చ‌రిత్ర సృష్టించాడ‌న్న చర్చ జరుగుతోంది. ఇక సింగిల్ ఓట్ విన్న‌ర్లు ఎవ‌రెవ‌రున్నారో చూస్తే.. నిర్మల్ జిల్లా, బాగాపూర్ గ్రామంలో ముత్యాల శ్రీవేద అనే మహిళ ఒకే ఒక్క ఓటు తేడాతో సర్పంచ్‌గా గెలిచారు, ఈమెకు పోటీగా బ‌రిలో నిలిచిన హ‌ర్ష స్వాతికి  కూడా 180 ఓట్లే వ‌చ్చాయి. దీంతో పోస్ట‌ల్ బ్యాలెట్ లెక్కించగా..  ఒక్క ఓటు కార‌ణంగా శ్రేవేదను విజ‌యం వ‌రించింది. అమెరికా నుంచి వచ్చిన తన మామ వేసిన పోస్టల్ ఓటు ఆమె విజయానికి కారణమైంది.   కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పొతంగల్‌ఖుర్ద్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బెస్త సంతోష్ సంచలన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠ భ‌రితంగా సాగింది.. చివరకు సంతోష్ తన సమీప ప్రత్యర్థిపై కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సంతోష్‌ను చూసి గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, ప్రతి ఓటూ కీలకమని ఈ ఫలితం నిరూపించిందని అంటున్నారు అధికారులు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం గణేశ్‌పాడు గ్రామ పంచాయతీలో ప్రధాన పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. ఇక్కడ బీఆర్ఎస్ మద్దతుదారుడైన రమేశ్ నాయక్, కాంగ్రెస్ మద్దతుదారుడిపై విజయం సాధించారు. అయితే ఈ విజయం నల్లేరు మీద నడకలా సాగలేదు. ఎంతో స‌స్పెన్స్ తో  జరిగిన కౌంటింగ్‌లో రమేశ్ నాయక్ కేవలం ఒక్క ఓటు ఆధిక్యంతో ప్రత్యర్థిని ఓడించి సర్పంచ్ పీఠాన్ని కైవ‌సం  చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా, మర్పల్లి మండలం, రామాపూర్ గ్రామ పంచాయతీలో కూడా ఇదే తరహా ఫలితం వెలుగు చూసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రమాదేవి తన ప్రత్యర్థి నుంచి తీవ్ర  పోటీని ఎదుర్కొన్నారు. చివరి రౌండ్ వరకు ఇద్దరి మధ్య ఓట్లు సమానంగా వస్తాయేమో అన్నంత ఉత్కంఠ నెలకొంది. చివరకు ఫలితం వెలువడేసరికి రమాదేవి ఒక్క ఓటు తేడాతో గెలుపు సాధించారు.