వాయునాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్
posted on Apr 3, 2024 @ 3:11PM
దేశంలో బిజెపిసంకీర్ణానికి ఎన్ డి ఏ అయితే కాంగ్రెస్ సంకీర్ణానికి ఇండియా కూటమి నేతృత్వం వహిస్తుంది. ఎన్ డి ఏ కూటమికి ప్రధాని మోదీ అయితే ఇండియా కూటమికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అని ప్రచారంలో ఉంది. రాహుల్ గాంధీ దక్షిణాదిలోని కేరళ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయిపోయారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2019లో ఆయన అమేథీ, వాయనాడ్ రెండు చోట్లా ఎంపీగా పోటీ చేయగా, అమేథీలో ఓడిపోయి, వాయనాడ్ లో గెలిచారు. రాహుల్ గాంధీ ఈసారి కేవలం వాయనాడ్ నుంచే బరిలో దిగుతున్నారు.
ఈ నేపథ్యంలో, ఇవాళ ఆయన వాయనాడ్ లో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు ఆయన భారీ రోడ్ షో నిర్వహించారు. వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలి రాగా, కోలాహలంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలి వెళ్లి నామినేషన్ పత్రాలన సమర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ వెంట ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా ఉన్నాను.
నామినేషన్ వేసే ముందు కాంగ్రెస్ జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తన చెల్లెలు ప్రియాంక గాంధీని ఎలా చూసుకుంటానో, వాయనాడ్ ప్రజలను కూడా తన కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటానని అన్నారు. మీ ప్రతినిధిగా పార్లమెంటులో ఉండడం నాకు లభించిన గౌరవంగా భావిస్తాను అని తెలిపారు.