యాంటి బాయిటిక్స్ తో ముప్పే.. నిపుణుల హెచ్చరిక
posted on Sep 20, 2022 @ 12:21PM
మోతాదుకి మించి యాంటి బాయిటిక్స్ వినియోగిస్తే ముప్పు తప్పదు. అయితే భారత్ మాత్రం పరిమితికి మించి యాంటీబయాటిక్స్ ను వినియోగించిందని లాన్సెట్ నివేదిక వెల్లడించింది. కోవిడ్ మొదటి, రెండవ దశలలో బారత్ లో మోతాదుకు మించిన యాంటి బాయిటిక్స్,పరిమితిని మించి మించి మత్తు మందులు వినియోగించి నందువల్లనే స్ట్రోక్స్ వచ్చి చనిపోయరాని, అసలు కోవిడ్ సమయంలో ఏమందులు ఎంత మోతాదులో వాడాలో నియంత్రణ లేకుండా విచ్చల విడిగా స్టెరాయిడ్స్, ఇతర ఇంజక్షన్లు (రేమిడి సివిర్) ఇష్టా రీతిన వాడినందు వల్లె బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వంటి సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలతో కోవిడ్ బాధితులు ఇబ్బందులు పడ్డారు. ఇదే విషయాన్ని లన్సెట్ తన నివేదికలో పొందుపరిచింది.
అయితే లాన్సేట్ రిపోర్ట్ లో 2౦19 సంవత్సరంలో భారత్ లోని ప్రైవేట్ వైద్యులు 47%యాంటి బాయిటిక్స్ వినియోగించారంటు నివేదికలో పేర్కొనడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య ఎస్ ఎన్ సి ఎం స్టాండింగ్ నేషనల్ కమిటి మేదిసిన్స్ ఉపాధ్యక్షుడు సీనియర్ ఫర్మాకాలజిస్ట్ వై కే గుప్తా లాన్సేట్ నివేదికను తీవ్రంగా ఖండించారు. ఈమేరకు లాన్సేట్ నివేదిక అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూర్ మండవీయ ఆదేశం మేరకు వై కే గుప్తా వివరణ ఇస్తూ అత్యవసర మందుల జాబితాను తయారు చేసి ఇస్తామని, ఆయా రాష్ట్రాల నియంత్రణ మండలి డ్రగ్ ఆధారిటీ అనుమతితోనే ఫార్ములాను వెలువడతాయని పేర్కొన్నారు.
లాన్సెట్ నివేదికలో ఆమోదం పొందని ఫార్ములా అన్న పదం వాడారని అంటే దాని ఆర్ధం సి డి ఎస్ సి ఓ కాదని ఈ ఫార్ములాలు ఆయా రాష్ట్రాల డ్రగ్ రెగ్యులేటరీ అధారిటీ ఆమోదించినవే అని అందుకే, ఈ విషయం లో ఆమోదం పొందని అన్నపదం ప్రయోగించడం పై వై కే గుప్తా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ రెగ్యులేటరీ బాడీ ఫార్మా రంగం లో ఉందని తెలిపారు. లాన్సెట్ స్టడీ రిపోర్ట్ చదివిన తరువాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వివరణ కోరారని గుప్తా తెలిపారు. లాన్సెట్ నివేదికను ఉటంకిస్తూ యాంటి బాయటిక్స్ అతిగా వాడారని అనడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈమేరకు బ్రెజిల్,రష్యా,యురప్ దేశాల తో పోలిస్తే యాంటి బయటిక్స్ వాడకం భారత్ లో తక్కువేనని పేర్కొన్నారు. అయినప్పటికీ భారత్లో యాంటి బయటిక్స్ వినియోగం లో అగ్రభాగాన నిలిచిందని నివేదికలో పేర్కొనడం సరికాదని గుప్తా వెల్లడించారు. భారత్ లో రోజుకు 1౦౦౦ డోస్ లు వాడితే ప్రపంచవ్యాప్తంగా 1౦.4శాతం ఎక్కువగా వినియోగించారని గుప్తా స్పష్టం చేసారు. కాగా 2౦15 లో 1౩ .6% వినియోగించారని,లాన్సెట్ నివేదిక ప్రకారాం దేశంలో యాంటి బాయిటిక్స్ వినియోగం,నియంత్రణ, అమ్మకాలు నిలువరించాల్సిన అవసరం ఉందని గుప్తా అభిప్రాయపడ్డారు.
యాంటి బయటిక్స్ పై మరిన్ని పరిశోదనలు అవసరమని పేర్కొన్నారు. 2౦19 లో అజితో మైసిన్ విరివిగా వాడారని, యాంటి బాయిటిక్స్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. మార్కెట్ లో నేడు 1౦% ఫార్ములాలు ఉన్నాయని, అదనంగా మరో 5౦ % పైగా ఫార్ములాలు ఉండడం వల్ల యాంటి బాయిటిక్స్ వాడినట్లు కనిపిస్తోందని ,అజిత్రో మైసిన్ 5౦౦ ఎంజి ,అమోక్సిలిన్ 5౦౦ ఎం జి,125 ఎం జి సిసిక్షిన్ 2౦౦ ఎం జి విరివిగా వాడారనివాటి పై అవగాహన కల్పించాలని గుప్తా అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం మార్కెట్ లో ప్రైవేట్ రంగం అమ్మకాల సమాచారం మాత్రమే అని ఇంకా పూర్తి వివరణాత్మక సమాచారం కావాలాని గుప్తా విజ్ఞప్తి చేసారు. రోగుల సంరక్షణ వారికి వైద్యులు ఎలాంటి ప్రిస్కేఫ్షణ్ లో ఎలాంటి యాంటి బాయిటిక్స్ వాడారు అన్న సమాచారం. మైక్రో బయాలాజికల్ టెస్ట్ లు యాంటి బాయిటిక్స్ వినియోగం వంటి నిశితంగా పరిశీలించాల్సి ఉందని ప్రిస్కిప్షన్ సూక్ష్మం గా పరిశీలించడం అసాధ్యమని ఆయాత్యవసర సమయాలాలో ఎలావినియోగించారన్నది అంచనా అసాధ్య్యమని గుప్తా వివరించారు. ఫర్మా ట్రాక్ స్యంపుల్ కవర్స్, స్టాకిస్టులు 6౦% మంది మాత్రమే ఉన్నారని.ప్రైవేట్ రంగంలో ఫర్మా అమ్మకాలపై లక్ష్యంగా చేసుకుని నివేదిక చేసినట్లు ఉందని గుప్తా విమర్శించారు.
ప్రభుత్వ శాఖాలలో మందుల ప్రోక్యుర్మేంట్ జాతీయ,లేదా అయారాస్త్రాల స్థాయలో నిర్ణయించిన లిస్ట్ మేరకు మందులు మాత్రమే అని వివరించారు. యాంటి బయటిక్స్ వినియోగం పై అవగాహన అవసరమని ప్రస్తుతం యాంటి బాయిటిక్స్ ప్రభావం ఉందని కొత్త యాంటి బాయిటిక్స్ వాడే అధికారం ఉందని తేల్చి చెప్పారు. ఇది ఇలా ఉంటె కోవిడ్ సమయం లో లేదా యురిన్ ఇన్ఫెక్షన్ సమయం లో గనక యాంటి బాయిటిక్స్ వినియోగించడం పై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోతాదుకు మించి యాంటి బయటిక్స్ వాడడం వల్ల శరీరంలో అత్యవర సమయంలో యాంటి బయటిక్స్ పనిచేయవని. శరీరంలో మెటాబాలిజం దెబ్బతిని హార్మోన్ సంబంధిత ఇతర సమస్యలు వస్తాయని, మన శరీరంలో మంచి బ్యాక్టీరియా చనిపోతుందని చెడు బ్యాక్టీరియా వృద్ధి చెంది అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని. యాంటి బడీలు ఇమ్యునిటి వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు పేర్కొన్నారు కాగా శరీర తత్వాన్ని బట్టి మాత్రమే యాంటి బాయిటిక్స్ మోతాదును డాక్టర్ సలహామేరకు వాదాలె తప్ప మరేఇతర సమాచారం ఆధారంగా యాంటి బాయిటిక్స్ వాడరాదని సూచించారు.