అవిశ్వాసానికి మేమూ రెడీ ...
posted on Mar 14, 2013 7:17AM
అవిశ్వాసం పెడతామని టి.ఆర్.ఎస్. ప్రకటించిన ఇరవైనాలుగు గంటలు గడవకముందే వైఎస్సార్సీపి కూడా మేమూ అవిశ్వాస తీర్మానానికి సిద్ధం అని ప్రకటించింది. అవిశ్వాస తీర్మానానికి కనీసం 30మంది సభ్యుల ఆమోదం అవసరం. కెసిఆర్ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపై నిప్పులు చెరిగారు. టి.ఆర్. ఎస్. సభ్యులు చంద్రబాబుపై విమర్శలు చేస్తూ ... "చారిత్రిక తప్పిదం చేస్తున్నావ్ ... గంగలో కలిసిపోతావ్ ... కావాలంటే మీరే అవిశ్వాసం పెట్టండి మేం మద్దతిస్తాం'' అని అన్నారు. గురువారం టి.ఆర్.ఎస్., వైఎస్సార్సీపి పార్టీలు వేరువేరుగా స్పీకర్ కు అవిశ్వాస తీర్మానం నోటీసులు అందజేయనున్నారు. అవిశ్వాస తీర్మానం గెలిస్తామని ధీమాగా ఉన్న ప్రభుత్వంలో కదలిక ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ఫిరాయించిన సభ్యులపై రెండు రోజుల్లో ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని చీఫ్ విప్, విప్, మంత్రులతో అన్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు ప్రతిస్పందిస్తూ ... "ఒకరిది బెయిలు మరొకరిది బ్లాక్ మెయిలు, వారి వ్యూహాలకు మేము దూరం'' అని అన్నారు.