నీతి ఆయోగ్ సీఈఓతో ఏపీ మంత్రి భరత్ భేటీ!
posted on Sep 21, 2024 @ 1:07PM
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ నీతి ఆయోగ్ సీఈఓ బి.వి.ఆర్ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న భరత్ ఉత్పాదక రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన పురోగతితో వచ్చే ఐదేళ్లలో రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలను వివరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న భరత్ ఈ సంరద్భంగా పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను పెంపొందించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఆవిష్కరణలను పెంచడంపై నీతి ఆయోగ్ సీఈవోతో చర్చించారు.