రాజారెడ్డి రాజ్యాంగంలో పోలీసులకే దిక్కులేదు...
posted on Feb 20, 2021 @ 11:33AM
ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా నెల్లూరులో జరిగిన ఒక ఘటన పై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. వైకాపా ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్లో పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందని లోకేష్ విమర్శలు గుప్పించారు. ఇక ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఎలా బతకాలని ఆయన నిలదీశారు.
"రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజల రక్షణ దేవుడెరుగు.. పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం, గ్రిద్దలూరు గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శివశంకర్ గారి పై వైకాపా గూండాలు విచక్షణారహితంగా దాడి చెయ్యడం దారుణం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను" అని అయన విమర్శించారు.
అంతేకాకుండా "శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులకే రక్షణలేకపోతే ఇక ఈ రాష్ట్రంలో సామాన్యులు ఎలా బ్రతకాలి?ఎస్ఐ శివశంకర్ గారి పై దాడి చేసిన వైకాపా రౌడీలను కఠినంగా శిక్షించాలి" అని జగన్ ప్రభుత్వాన్ని లోకేష్ డిమాండ్ చేశారు.