శంకర్ పల్లి టూ దేవరకొండ! చిన్నారులతో కాలినడక!
posted on Apr 14, 2020 @ 10:06AM
వారంతా పొట్ట చేతపట్టుకొని కడుపునింపుకోడానికి పని నిమిత్తం శంకర్ పల్లి వెళ్లారు. అక్కడే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో పనిచేసుకుంటున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో వారికి పనికరువైంది. ఈ నెల 14న లాక్ డౌన్ ముగుస్తుందని ఆశతో అక్కడే ఉండిపోయిన వారికి లాక్ డౌన్ పొదగించడం తో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. దీంతో 5గురు చిన్నారులతో పాటు 3కుటుంబాలు తమ సొంత గ్రామమైన దేవర కొండకు వెళ్లేందుకు కాలినడకన బయలు దేరారు.
కేశంపేట మీదుగా వెళుతున్న వీరిని గమనించిన స్థానిక ఎస్.ఐ కోన వెంకటేశ్వర్లు ఆపి వివరాలు తెలుసుకున్నారు.లాక్ డౌన్ నేపద్యంలో పంపించడానికి వీలుకాదని మీరు ఉండటానికి వసతి కల్పిస్తామని వారికి వివరించారు. కేశంపేట సర్పంచ్ తలసాని వెంకట్ రెడ్డి వారికి భోజన వసతి కల్పించారు.మండుటెండలో 5 గురు చిన్నారులతో కాలినడకన వెళుతున్న వారి పరిస్థితి చూసిన పలువురు చలించిపోయారు.