పర్వతారోహకుడు మస్తాన్ బాబు అంత్యక్రియలు
posted on Apr 25, 2015 @ 10:17AM
పర్వాతారోహణలో గిన్నిస్ రికార్డు సాధించి తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశాడు మల్లి మస్తాన్ బాబు. అతనికి తన స్వస్థలం నెల్లూరు జిల్లా గాంధీజనసంగంలో అతని పొలంలోనే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మస్తాన్ బాబు కుటుంబసభ్యులు, బంధువులు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. మస్తాన్ బాబు అంత్యక్రియలకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ మంత్రులు నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, రావెల కిశోర్ బాబు, జిల్లా కలెక్టర్ జానకి పలువురు రాజకీయ నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మల్లి మస్తాన్ బాబు మళ్లీ పుడతాడని అన్నారు. పర్వాతరోహణలో మస్తాన్ బాబు చరిత్ర సృష్టించాడని, ఆయన కీర్తి ఎవరెస్టు శిఖరాన్ని దాటిందన్నారు. మస్తాన్ బాబు మృతదేహం ఇక్కడికి రావడానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ చొరవే కారణమని తెలిపారు. వారే అర్జెంటీనాతో దౌత్యపరమైన చర్చలు జరిపి మృతదేహాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.