Read more!

హిమాచల్‌ప్రదేశ్: రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం

 

హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రమాదస్థలికి నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ బృందం బయలుదేరి వెళ్లిందని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. పంజాబ్‌లోని బతింద నుంచి 45 మంది రిస్క్యూ టీమ్ సభ్యులతో పాటు 4 పడవలు, గజ ఈతగాళ్లు బయలుదేరి వెళ్లారన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల గల్లంతు సమాచారం తెలియగానే అక్కడి పోలీసు అధికారులతో మాట్లాడానని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. విద్యార్థులో సురక్షితంగా ఉన్నవారి నుంచి సమాచారాన్ని తీసుకుని మిగతావారి జాడ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. కాగా, బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్‌తో కూడిన ప్రత్యేక పోలీసు బృందం సోమవారం ఉదయం ఘటనా స్థలానికి బయల్దేరి వెళ్ళిందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.