Read more!

పాకిస్థాన్: కరాచీ ఎయిర్‌పోర్టుపై తీవ్రవాదుల దాడి

 

పాకిస్థాన్‌లో తీవ్రవాదుల కార్యకలాపాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తీవ్రవాదుల దాడులతో పాకిస్థాన్ నగరాలు వణికిపోతున్నాయి. తాజాగా కరాచి జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై తీవ్రవాదులు దాడి చేశారు. ఆదివారం రాత్రి పాత విమానాశ్రయం భవనాన్ని చుట్టుముట్టిన తీవ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో 11 మంది మృతి చెందారు. ఎయిర్ భద్రతా సిబ్బంది వేషాల్లో వచ్చిన 10 మంది తీవ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు.అయితే ఏ విమానాన్ని ధ్వంసం చేయలేదని వెల్లడించారు. తీవ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. భద్రతా సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు తీవ్రవాదులు మృతి చెందారు. ప్రస్తుతం కరాచీ ఎయిర్ పోర్టులో పరిస్థితి అదుపులో వుంది.