Read more!

కేసీఆర్ దిగ్భ్రాంతి.. హిమాచల్‌కి నాయిని

 

హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్‌ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో ఆ నీటి ప్రవాహంలో రాష్ట్రానికి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయిన ఘటన గురించి తెలియగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని, క్షేమంగా వున్న విద్యార్థులను తిరిగి హైదరాబాద్‌కి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రమాద ఘటన గురించి తెలియగానే రాష్ట్ర హోంమంత్రి నాయిని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. సోమవారం ఉదయం రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బిఆర్ మీనా, గ్రేహౌండ్స్ ఎస్‌పి కార్తికేయలతో, కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ప్రత్యేక విమానంలో హిమాచల్ ప్రదేశ్‌లోని ఘటనా స్థలానికి బయల్దేరారు. అలాగే రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అక్కడి డీజీపీ, మండి ఎస్‌పితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.