కలత చెందిన ప్రధాని
posted on Feb 12, 2014 @ 4:04PM
పార్లమెంటు ఆందోళనలపై ప్రధాని మన్మోహన్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. బుధవారం ఓటాన్ రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో సీమాంధ్ర ఎంపీలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశారు. సభను సక్రమంగా నిర్వహించకుండా అడ్డుపడ్డారు. కేంద్రమంత్రులు కూడా పోడియం వద్దకు వెళ్లారు. ఈ ఘటనతో కలత చెందినట్లు ప్రధాని తెలిపారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిదికాదని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా రాష్ట్ర విభజన అంశంతో ఉభయసభలు రగిలిపోయాయి.