Read more!

హిమాచల్‌ ప్రమాదం: బాబు ప్రత్యేక విమానం

 

 

 

హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులను ప్రమాద స్థలానికి తీసుకువెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించారు. ఈ విమానం శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి చండీగఢ్ కు వెళ్ళనుంది. అక్కడి నుంచి విద్యార్ధుల తల్లిదండ్రులని ఘటన స్థలానికి తీసుకువెళ్ళడానికి రెండు ప్రత్యేక బస్సులను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు మంత్రులు,అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని మంత్రి నారాయణ,ఏపీ అధికార ప్రతినిధి కంభంపాటి, ఏపీ రెసిడెంట్ కమిషనర్ సతీష్‌చంద్రను ఆదేశించారు.