Read more!

హత్య చేసి పది ముక్కలుగా కోసి.. సొంత వాళ్ల పనే

మానవ సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. స్వార్థం, అవసరం ఇవే జీవితం అనే స్థితికి సమాజంలోని కొందరు దిగజారిపోయారు. ఇందు కోసం సొంత వారికి నడతేర్చేందుకు కూడా తెగిస్తున్నారు. ప్రేమ పేరుతో సహజీవనం చేసి శద్ధావాకర్ అనే మహిళను ఆమె ప్రియుడే అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి మరువక ముందే ఢిల్లీలో మరో దారుణ హత్యోదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇటీవల శద్ధావాకర్ అనే యువతిని ఆమె ప్రియుడే హత్య చేసి 35 ముక్కులుగా నరికిన సంఘటన తరహాలోనే.. ఈ కేసులో భార్యా, తన కుమారుడితో కలిసి భర్తను హత్య చేసి పది ముక్కులుగా నరికి రాం లీలా మైదానంలో పడేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మృతుడు అంజన్ కుమార్ బీహార్ కు చెందిన వాడే అయినా చాలా కాలంగా ఢిల్లీలోనే నివసిస్తున్నాడు. బీహార్ లో పెళ్లాం బిడ్డలు ఉంటారు. ఈ క్రమంలో అంజన్ దాన్ పూనమ్ అను మహిళతో కొంత కాలం సహజీవనం చేసి ఆ తరువాత పెళ్లి చేసుకున్నాడు.

పూనమ్ కు అంతకు ముందే పెళ్లై ఇద్దరు పిల్లలు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. మొదటి భర్త చనిపోయిన తరువాత పూనమ్ అంజన్ దాస్ ను పెళ్లి చేసుకుంది. ఎలాంటి సంపాదనా లేని అంజన్ దాస్ తరచూ పూనమ్ తో గొడవపడుతుండేవాడు. పూనమ్ నగలు అమ్మి ఆ సొమ్మును బీహార్ లోని తన మొదటి భార్యకు పంపేడు. ఈ క్రమంలో గొడవలు మరింత పెరిగాయి.

అంతే కాకుండా అంజన్ దాస్ తన సవతి కుమార్తెపైనా, తన సవతి కొడుకు భార్యపైనా కూడా కన్నేశాడు. దీంతో విసినిపోయిన పూనమ్ తన కుమారుడితో కలిసి మద్యంలో మత్తు మందు కలిపి అంజన్ దాస్ కు ఇచ్చి.. అతడు స్ఫృహ కోల్పోయిన తరువాత హత్య చేసింది. శవాన్ని పది ముక్కలుగా కోసి రాం లీలా మైదానంలో పడేసింది. ఆ శరీర భాగాలను గుర్తించిన పోలీసులు శాస్త్రీయ పద్ధతిలో విచారించి.. చివరకు మృతుడు అంజన్ దాస్ గా గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తు చేసి పూనమ్, ఆమె కుమారుడే ఈ దారుణానికి పాల్పడ్డారని తేల్చారు.