కెసిఆర్ ను కసబ్ లా ఉరితీయాలి: మోత్కుపల్లి
posted on Nov 25, 2012 @ 3:29PM
తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశాడని, ఉగ్రవాది కసబ్ లా ఉరి తీయాలని కేసీఆర్ ను ఉరితీయాలని టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు ద్వజమెత్తారు. సూర్యాపేటలో టిఆర్ఎస్ సమరబేరి జరుగుతున్న సందర్భంగా కెసిఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడంటూ నరసింహులు గన్ పార్కు వద్ద నిరశన దీక్షకు దిగారు.
తెలంగాణ అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అని చెప్పి ప్రజలను ఇంతకాలం మోసం చేసిన కెసిఆర్ ఇప్పుడు రెండువేల పద్నాలుగు వరకు రాదని, వంద సీట్లే వస్తుందని చెబుతూ మళ్లీ తెలంగాణ వాసుల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.