జల్లికట్టుకు కంటే కోడి పందేలు ప్రమాదకరమైనవా?
posted on Jan 11, 2016 @ 2:54PM
తమిళనాడులో సంప్రదాయ క్రీడగా పేరొందిన జల్లికట్టుకు కేంద్రం గ్రీన్ స్నిగల్ ఇవ్వడంతో అక్కడి ప్రజల్లో సంబరాలు మిన్నంటుతున్నాయి. తమిళనాడుకు కేంద్ర౦ ఇచ్చిన బహుమతిగా అక్కడి ప్రజలు దీనిని భావిస్తున్నారు. ఎద్దుల్ని వదిలి, వాటితో తలపడటమే జల్లికట్టు. ఎందరో ఈ జల్లికట్టు కారణంగా ప్రాణాలు కోల్పోయారు, కోల్పోతూనే వున్నారు. అయిన ప్రభుత్వం ఈ క్రీడను అక్కడి సంప్రదాయ౦గా భావించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జల్లికట్టు తరహాలోనే మన ఆంధ్రప్రదేశ్లోనూ కొన్ని సంప్రదాయాలున్నాయి. సంక్రాంతి పండుగ తెలుగునాట అత్యంత ప్రాధన్యత కలిగినది. తెలుగువారి జనజీవన స్రవంతిలో ఒక భాగమైన అందరికీ ఇష్టమైన సంబరాల పండుగ ఇది. ఈ పండుగలో ముఖ్య ఘట్టం కోడి పందేలు..ఎడ్ల పందేలు. కోస్తాంధ్రల్లోని వివిధ పల్లెలు ఎడ్ల పందేలతో.. కోడి పందేలతో సందడిగా మారుతాయి. మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే ఈ పోటీలను పల్లెసీమల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఈ పోటీల కోసం ఎక్కువగా ఒంగోలు జాతి పశువులను సంక్రాంతి పందేల కోసం శిక్షణనిచ్చి సిద్ధం చేసేవారు. బండలాగుడుతో పాటు ఎద్దులకు అందాల పోటీలు కూడా నిర్వహించేవారు. అయితే వాటిపై ప్రభుత్వాలు నిషేధం విధించడంతో..వీటిని పెంచే ధనిక వర్గాలు కూడా ఆసక్తి చూపించడం మానేసారు. అలాగే ఈ ఎడ్లను పెంచేవారు కూడా చాలా తగ్గిపోయారు. కొన్ని సంవత్సరాలు తరువాత ఈ జాతి కూడా అంతరించిపోయే ప్రమాదంలో వుందని ఓ సర్వే చెప్పినట్టు సమాచారం.
ఇక కోడి పందాలు.. సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్లో ఇవే స్పెషల్ ఎట్రాక్షన్. తరతరాలుగా సంక్రాంతి పండుగకు కోడి పందేలు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. పండుగ మూడు రోజులు ఇవి బరిలో నిలిచి పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే ఈ సంప్రదాయాలపై కోర్టులు, ప్రభుత్వాలు నిషేధం విధించడంపై కోస్తా జిల్లాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి వస్తుందంటే వారి ఆనవాయితీ కోసం ముందుగానే కోళ్ళను ఎన్నో వేళ రూపాయలు ఖర్చు పెట్టి వాటిని రెడీ చేస్తారు...ఇదంతా పందేళ్ళలో డబ్బుల కోసం కాదని..తరతరాలుగా వస్తున్న తమ ఆచారాన్ని బతికి౦చుకోవడం కోసమని వారు అంటున్నారు. డబ్బు కోసమే అనుకుంటే ..ఒక్కో కోడికి నెలకీ ఐదు నుంచి ఎనిమిది వేల రూపాయలు పెట్టి ఎలా పెంచుతామని ప్రశ్నిస్తున్నారు? రోజు కోసుకొని తినే కోళ్ళకు అనుమతి ఇచ్చిన జంతుసంరక్షకులు, కోర్టులు మూడు రోజులు జరుపుకొనే ఆనవాయితికి ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు?
మరోవైపు గతంలో జల్లికట్టుపై నిషేధం విధించిన కేంద్ర౦పై ఒత్తిడి తెచ్చి తమ ఆచారాన్ని కాపాడుకున్నారు తమిళ నేతలు. దీనిపై వెంటనే జీవో తెచ్చుకోవడంలో కూడా వారు సక్సెస్ అయ్యారు. మరి మన నేతలు మన ఆచారాలను ఎందుకు పట్టించుకోవడం లేదు? జల్లికట్టు కంటే కోడి పందేలు ప్రమాదకరమైనవా? తమిళ నేతలు తెచ్చిన ఒత్తిడి మన నేతలు తెలేకపోతున్నారా? అనే ప్రశ్నలు ఆంధ్ర ప్రజల్లో హాట్ టాక్ గా నడుస్తున్నాయి.