జగనన్న మరో బాదుడు.. ట్యాక్స్ పెంచి జనం జేబుకు చిల్లు
posted on Nov 23, 2021 @ 11:13AM
ప్రజలపై మరో భారం మోపేందుకు సిద్ధమైంది జగన్ రెడ్డి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ పై అదనపు ట్యాక్సులు వసూల్ చేస్తోంది. ఆస్తి పన్నును పంచేసింది. విద్యుత్ చార్జీలను అడ్డగోలుగా వసూల్ చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇవీ చాలవన్నట్లు తాజాగా వాహనాల లైఫ్టాక్స్, గ్రీన్టాక్స్ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
మోటారు వాహనాల పన్ను చట్టం 1963లో సవరణలకు అసెంబ్లీలో బిల్ ప్రవేశ పెట్టారు. కొత్త చట్టం ద్వారా నూతన వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో... ఇకపై 13, 14, 17, 18 శాతం చొప్పున లైఫ్ టాక్స్ విధించబోతోంది. ట్యాక్సుల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై 410 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వం మోపనుంది. 2019-21లో రవాణా శాఖకు రూ. 3,181 కోట్ల ఆదాయం
లభించింది. టాక్స్ల పెంపుతో లక్షల మందిపై వందల కోట్ల భారం మోపనుంది.
రాష్ట్రంలో ఇప్పటికే కోటి 31 లక్షల వాహనాలు - 1.15 కోట్ల రవాణాయేతర వాహనాలున్నాయి. 2010లో చివరి సారిగా పన్నుల్లో సవరణ చేశారు. రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాల్లో రవాణా శాఖ ఆదాయమే కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. ద్రవ్యోల్బణం, రహదారుల భద్రత, కాలుష్య నియంత్రణ కోసం టాక్స్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. జగన్ సర్కార్ తాజా బాదుడుపై జనాలు భగ్గుమంటున్నారు. వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేన్ని వదలవా జగన్ అంటూ ప్రశ్నిస్తున్నారు.