చిత్రపరిశ్రమ కొందరి చేతుల్లోనే ఉంది

తెలంగాణ జేఏసీ ప్రతినిధులు ఆ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై జేఏసీ ప్రతినిధులు.. శ్రీనివాస్ యాదవ్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న చిత్రపరిశ్రమ కొందరి వ్యక్తుల చేతుల్లో నడవడం సబబుకాదన్నారు. కేవలం పెద్ద సినిమాలు, పెద్ద నిర్మాతలు మాత్రమే వృద్ధి చెందితే సరిపోదు, చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలు కూడా వృద్ధి చెందాలని అన్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పన్ను విధానం అశాస్త్రీయంగా ఉందని, ఈ విధానాన్ని సవరించాల్సిన అనసరం ఉందని మంత్రిగారిని కోరినట్టు కోదండరాం తెలిపారు.

Teluguone gnews banner