వలసల భారతం!

ఏటా లక్షలాది మంది భారతీయులు  విదేశాలకు వలస వెళ్లిపోతుండటం అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం.  స్వదేశంలో కన్నా విదేశాల్లో స్థిరపడడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న భారతీయుల సంఖ్య ఏటా పెరిగిపోతుండటానికి కారణమేమిటన్న దానిపై ఇటీవల ఇండోర్ లో జరిగిన భారతీయ ప్రవాసీ దివస్ లో చర్చ జరిగింది.  తాజా గణాంక వివరాల ప్రకారం, ప్రస్తుతం కోటీ 80 లక్షల మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారు.

ఇంత పెద్ద సంఖ్యోలో విదేశాలకు వెళ్లిన జనాభా ఉన్న దేశం ప్రపంచంలో భారత్ మాత్రమే. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వలసలు పోతున్నారన్న దానిపైనే   భారతీయ ప్రవాసీ దివస్‌లో  ఆందోళన వ్యక్తమైంది. భారతీయుల్లో అత్యధిక సంఖ్యా కులు విదేశాల్లో తమ భవితవ్యాన్ని, తమ అదృష్టాన్ని వెతుక్కోవడానికి దారి తీస్తున్న కారణాలపై కూడా చర్చ జరిగింది.  భారత్‌ తర్వాత అంత పెద్ద సంఖ్యలో వలసలు పోతున్న జనాభా కలిగిన దేశం మెక్సికో మాత్రమే. అయితే అక్కడి వారు ఎక్కువగా వలస వేళ్లేది అమెరికాకు మాత్రమే. అదే ఇండియన్స్ విషయానికి వస్తే.. వీరు దేశం విడిచి వెళ్లడానికి డెస్టినేషన్ ఒక్క అమెరికా మాత్రమే కాదు.. ప్రపంచంలోని ఏ దేశానికైనా సరే వెళ్లడానికి ఇసుమంతైనా సందేహించకుండా వెళ్లిపోతున్నారు.

 ఒక్క గల్ఫ్ దేశాలలోనే దాదాపు 80 లక్సల మంది భారతీయులు ఉద్యోగమో, వృత్తో, వ్యాపారమో చేసుకుంటగూ జీవనం గడుపుతున్నారు.  అలాగూ అమెరికా, ఇంగ్లండ్‌ ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాలకు వలస వెళ్లిన వారి సంఖ్యా లక్షల్లోనే ఉంటుంది. వీరంతా స్వదేశీ పాస్ పోర్టు స్థానంలో వీరు నివసిస్తున్న దేశం పాస్ పోర్టు కోసం ప్రయత్నాలు చేసి సాధిస్తున్నారు.  తూర్పు ఆఫ్రికా, కరిబ్బియన్‌, మలేషియా, ఫిజి దేశాల్లో కూడా భారతీయులు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు.  వీరంతా వలస పాలకుల కాలంలోనే భారతదేశం వదిలి ఇక్కడకు కార్మికులుగా చేరుకుని స్థిరపడ్డారు. విదేశాలకు వలస వెళ్లి స్థిరపడిన భారతీయుల్లో కార్మికులూ ఉన్నారు. అధికారులు ఉన్నారు. యజమానులు ఉన్నారు.

సంపన్నులూ, పేదవారూ కూడా ఉన్నారు.  అయితే, వీళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆయా దేశాలలో  సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అక్కడి వారి దృష్టి పడేది ప్రధానంగా ప్రవాసులపైనే.   విశేషమేమిటంటే, చాలా దేశాల్లో భారతీయులు ఘన విజయాలు సాధిస్తున్నారు. ఇక అమెరికాలో అయితే, ఇతర దేశాల సంతతికి చెందినవారిలో భారతీయులే సంపన్న వర్గంగా రికార్డులకెక్కింది. ఇంగ్లండ్‌ పోర్చుగల్‌, ఐర్లాండ మారిషస్‌ ప్రధాన మంత్రులు, గుయానా, సూరినామ్‌, ఇండొనీషియా అ ధ్యక్షులు భారతీయ సంతతికి చెందినవారే. మొత్తం మీద నాలుగు ఖండాల్లోని దేశాలలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కూడా భారతీయ సంతతికి చెందిన వ్యక్తే.  అనేక దేశాల్లో అత్యంత పట్టు, పలుకుబడి కలిగిన వర్గంగా రూపాంతరం చెందిన భారతీయులు భారత్‌కు, ఇతర దేశాలకు మధ్య భౌగోళికంగానే కాక, రాజ కీయంగా, ఆర్థికంగా కూడా ఓ బలమైన వారధిగా పనిచేయడం కద్దు.  ఇలా ఎన్నిసానుకూలతలు ఉన్నా అందే ఆందోళన కర విషయాలు కూడా ఉన్నాయి.

 ప్రతి ఏటా కనీసం లక్షమంది భారతీయులు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. 2022లో మొదటి పది నెలల కాలంలోనే ఈ సంఖ్య లక్షా 83 వేలు దాటింది. హెన్లీ అండ్‌ పార్ట్నర్స్‌ అనే ప్రసిద్ధ కన్సల్టెన్సీ సంస్థ అందజేసిన వివరాల ప్రకారం, గత ఏడాది సుమారు 8,000 మంది భారతీయ కుబేరులు భారతదేశ పౌరస త్వానికి స్వస్తి పలికారు. అంతేకాదు, సంపన్న భారతీయుల్లో ఎక్కువ మంది విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతోంది. భారత దేశ ఆర్థిక వ్యవస్థ మీద విశ్వాసం సడలిపోవడమే ఇందుకు ముఖ్యంకారణంగా చెబుతున్నారు.  దేశంలో రాజకీయ పరిస్థితులు, ఆర్ధిక విధానాలు కారణంగానే తాము దేశం విడిచి వెళ్లడానికి కారణమని కూడా అత్యధికులు చెబుతున్నారు. 

Teluguone gnews banner

జూబ్లీ గెలుపు.. నవీన్ యాదవ్ కు రాహుల్ అభినందన

ప్రతిష్టాత్మక  జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన నేపథ్యం లో ఢిల్లీలో ఏఐసిసి అగ్రనేత రాహు ల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జూబ్లీ హి ల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన నవీన్ యాదవ్ ను రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ నవీన్ యాదవ్ ను అభినందించారు. అలాగే వెల్ డన్ గుడ్ వర్క్ అంటూ సీఎం రేవంత్ నూ అభినందించినట్లు తెలిసింది.   ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవ హారాలు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై రాహుల్ తో కాంగ్రెస్ బృందం చర్చించింది.  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ సాధించిన విజయంపై రాహుల్  సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీ బ లా న్ని మరింత పటిష్ఠం చేయడానికి తీ సుకోవాల్సిన చర్యలపై నాయకులకి రాహుల్‌ సూచనలు ఇచ్చారు.  స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తు న్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, బలహీన ప్రాంతాల్లో పార్టీ బలోపేతం తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. అనంతరం ఢిల్లీ పర్యటన ముగిం చుకుని రేవంత్ బృందం శనివారం (నవంబర్ 15) రాత్రి హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. 

కేటీఆర్ పరాజయాల హ్యాట్రిక్!

కేసీఆర్ రాజకీయంగా క్రీయాశీలంగా లేరు. ఆయన స్థానంలో ఆయన కుమారుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. పార్టీ బాధ్యతలను కేటీఆర్ స్వీకరించిన తరువాత  జూబ్లీ ఉప ఎన్నిక పరాజయంతో కేటీఆర్ వరుస వైఫల్యాలలో హ్యాట్రిక్ సాధించినట్లైంది.  2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత కేసీఆర్ పూర్తిగా క్రీయాశీల రాజకీయాలకు దూరమై, ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అడపాదడపా.. పార్టీ నేతలను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడినా, వారికి రాజకీయ దిశానిర్దేశం చేసినా గత రెండేళ్లుగా ఆయన తీరు చూస్తుంటే ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారని అనిపించక మానదు.  సరే అది పక్కన పెడితే.. తండ్రి క్రీయాశీల రాజకీయాలకు దూరమైనప్పటి నుంచీ పార్టీ వ్యవహారాలన్నీ తానై నడిపిస్తున్న కేసీఆర్ ఆ విషయంలో విఫలమయ్యారనే చెప్పాలి. జూబ్లీ ఉప ఎన్నిక ఓటమి ద్వారా కేటీఆర్ వరుసగా మూడు ఎన్నికలలో పార్టీని పరాజయం దిశగా సక్సెస్ ఫుల్ గా నడిపించారు. ఔను.. గత ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత నుంచీ కేసీఆర్ బాధ్యతలను పూర్తిగా కేటీఆర్ కు అప్పగించి తాను క్రియాశీల రాజకీయాలకు విరామం ప్రకటించారు. అప్పటి నుంచీ బీఆర్ఎస్ బాధ్యతలన్నీ కేసీఆర్ తన భుజస్కంధాలపై పెట్టుకుని నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత అసెంబ్లీ ఎన్నికల తరువాత గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ జీరో స్కోర్ చేసింది. ఆ తరువాత కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో పరాజయం పాలై సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇప్పుడు తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కూడా సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి పరాజయాలలో హ్యాట్రిక్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు పరాజయాలూ కేటీఆర్ ఖాతాలోనే పడ్డాయి.   పార్లమెంటు ఎన్నికల తరువాత రాష్ట్రంలో జరిగిన రెండు ఉప ఎన్నికలూ.. గత అసెంబ్లీ ఎన్నికలలో  బీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యం కనబరిచిన జీహెచ్ఎంసీ పరిధిలోనివి కావడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికలలో జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ విజయం సాధించలేదు. అటువంటిది ఇప్పుడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ విజయాలతో సత్తా చాటింది. దీంతో పార్టీ క్యాడర్ లో కేటీఆర్ నాయకత్వం పట్ల నమ్మకాన్ని సడిలేలా చేశాయి ఈ పరాజయాలు.   

జూబ్లీలో ఓటమిని కేసీఆర్ ముందే ఊహించారా?

బీఆర్ఎస్ చావో రేవో అన్నట్లు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జూబ్లీ హిల్ ఉప ఎన్నికలో అనూహ్యంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.  కాంగ్రెస్ కు కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. దాదాపు పాతిక వేల ఓట్ల తేడాతో ఇక్కడ పరాజయాన్ని మూటగట్టుకుంది. 2023 ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత జరిగిన రెండు ఉప ఎన్నికలలోనూ కూడా బీఆర్ఎస్ పరాజయం పాలైంది. అయితే కంటోన్మెంట్ పరాజయంతో పోలిస్తే ఈ పరాజయం బీఆర్ఎస్ కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. 2023 ఓటమి తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపుగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్టీ వ్యవహారాలన్నీ ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావే ముందుండి నడిపిస్తున్నారు. అయితే జూబ్లీ ఉప ఎన్నికలో మాత్రం స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ముందుగా కేసీఆర్ పేరు కూడా ఉంది. దీంతో పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జూబ్లీ ఉప ఎన్నిక ప్రచార సారథ్యం కేసీఆర్ చేపడతారని అంతా భావించారు. బీఆర్ఎస్ క్యాడర్ కూడా అలానే అనుకుంది. అయితే కేసీఆర్ మాత్రం గడపదాటి బయటకు రాలేదు. జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారం చేయలేదు. దీంతో ఇప్పుడు పార్టీ ఓటమి తరువాత.. కేసీఆర్ జూబ్లీ ఓటమిని ముందే ఊహించారా? అన్న చర్చ మొదలైంది.   జూబ్లీ హిల్స్ లో క్షేత్రస్థాయి పరిస్థితి ఏమిటన్నది అర్ధం అయ్యింది కనుకనే కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎటూ ఓడిపోయే ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం అనవసరమని ఆయన భావించి ఉంటారని  అంటున్నారు. తాను ప్రచారం చేసిన తరువాత కూడా పార్టీ అభ్యర్థి పరాజయం పాలైతే అది గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం కంటే ఎక్కువ అవమానకరమని కేసీఆర్ భావించి ఉంటారని అంటున్నారు.  జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారం వైపు కేసీఆర్ కన్నెత్తి కూడా చూడకపోవడంతో  పార్టీ క్యాడర్ కూడా ఇదే  అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నది. 

జూబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం వెనుక తెలుగుదేశం క్యాడర్?!

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించేలా పార్టీని ముందుండి నడిపించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయం సాధించారు. జూబ్లీ ఉప ఎన్నిక విజయంతో ఇటు జనంలోనే కాకుండా పార్టీ హైకమాండ్ వద్ద కూడా రేవంత్ ఇమేజ్ ఇనుమడించిందనడంలో సందేహం లేదు. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుందనుకున్న జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు పాతిక వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం గమనార్హం. అయితే పోలింగ్ ముగిసి ఫలితం వచ్చిన తరువాత.. ఇప్పుడు మరో చర్చ తెరపైకి వచ్చింది. ఈ ఉప ఎన్నికలో తెలుగుదేశం క్యాడర్ మద్దతు ఎవరికి లభించింది? అందుకు కారణమేంటి? అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.  గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ విజయం వెనుక ఉన్న నిర్ణయాత్మక శక్తి తెలుగుదేశం క్యాడరే అని అప్పట్లో పరిశీలకులు సోదాహరణంగా, గణాంకాలతో సహా వివరించారు. ఇప్పుడు జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ కు తెలుగుదేశం క్యాడర్ అండగా నిలవడం వల్లనే ఆ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో సునాయాస విజయం సాధించారని అంటున్నారు.  ఇందుకు కారణాలు కూడా పరిశీలకులు వివరిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి  శ్రీశైలం యాదవ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఇప్పటికి కూడా ఆయన తెలంగాణలో తెలుగుదేశం నాయకులు, శ్రేణులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అలాగే గతంలో తెలుగుదేశంలో అత్యంత కీలకమైన, బలమైన నాయకుడైన రేవంత్ రెడ్డి పట్ల తెలంగాణ తెలుగుదేశం శ్రేణులలో అభిమానం చెక్కు చెదరలేదు. ఈ కారణంగానే జూబ్లీ బైపోల్ లో తెలుగుదేశం క్యాడర్, ఆ పార్టీ మద్దతుదారులు, అభిమానులు మొత్తంగా కాంగ్రెస్ కు అండదండగా నిలిచారని పరిశీలకులు అంటున్నారు.  ఈ ఉప ఎన్నిక సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం కారణంగా వచ్చింది. మాగంటి గోపీనాథ్ కూడా గతంలో తెలుగుదేశం నాయకుడే. 2019, 2023 ఎన్నికలలో మాగంటి విజయం వెనుక ఉన్నది తెలుగుదేశం క్యాడరే. అయితే రాష్ట్రంలో మారిన  పరిస్థితి,  మాగంటి మరణం తరువాత తెలుగుదేశం  క్యాడర్ బీఆర్ఎస్ కు దూరం జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే తెలుగుదేశం క్యాడర్ ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా నిలిచిందని చెబుతున్నారు.  

మద్యం కుంభకోణం కేసులో అనిల్ చోఖ్రా అరెస్టు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో కీలక  పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబైకి చెందిన అనిల్ చోఖ్రాను సిట్ అరెస్టు చేసింది. ఈ అనిల్ ఛోఖ్రా ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి చెందిన రూ.77.55 కోట్ల నగదును డొల్ల కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు సిట్ పేర్కొంది. అనిల్ చోఖ్రా ముంబై కేంద్రంగా బినామీల పేర్లతో నాలుగు డొల్ల కంపెనీలను సృష్టించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.  క్రిపటి ఎంటర్‌ప్రైజెస్‌, నైస్‌నా మల్టీ వెంచర్స్‌, ఓల్విక్‌ మల్టీ వెంచర్స్‌, విశాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేర్లతో  సృష్టించిన ఈ కంపెనీల ఖాతాల్లోకి  లిక్కర్ సొమ్మును జమ చేసి,  అనంతరం ఆ నిధులను మరో 32 వేర్వేరు ఖాతాలకు బదిలీ  చేసి, బ్లాక్ మనీని వైట్ గా మార్చే మార్చే ప్రయత్నం చేసినట్లు సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇలా ఉండగా  అనిల్ చోఖ్రా గతంలో కూడా ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారని సిట్ పేర్కొంది. 2017, 2021 సంవత్సరాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అనిల్ చోఖ్రాను మనీలాండరింగ్ కేసుల్లో రెండు సార్లు అరెస్టు చేసినట్లు తెలిపింది. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత, ఈ అనిల్ చోఖ్రా లిక్కర్ స్కామ్ సొమ్మును వైట్‌గా మార్చేందుకు మద్యం స్కామ్ నిందితులు ఆయన్ను సంప్రదించినట్లు తమ దర్యాప్తులో గుర్తించినట్లు సిట్ పేర్కొంది. భారీగా కమీషన్ తీసుకుని మరీ అనీల్ చోఖ్రా ఈ లావాదేవీలకు సహకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. టెక్నాలజీ సహాయంతో  అనిల్ చోఖ్రాపై నిఘా పెట్టిన సిట్ అధికారులు, గురువారం  (నవంబర్ 13)న అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో  మద్యం కుంభకోణం కేసులో అనిల్ చోఖ్రాను 49వ నిందితుడిగా చేర్చిన సిట్ అతడిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.

బీహార్ ప‌వ‌న్ చిరాగ్ పాశ్వాన్!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌న్నెండేళ్ల శ్ర‌మ ఆపై రెండు ఎన్నిక‌ల ప్ర‌యోగాలు చేసి, అటు పిమ్మ‌ట మూడో ఎన్నిక‌ల్లో సాధించిన హండ్రెడ్ పర్సెంట్ విక్ట‌రీ ఇచ్చిన ఇన్ స్పిరేష‌న్ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పాకిందా అంటే.. ఔననే చెప్పాల్సి వస్తోంది.  త‌మిళ‌నాడులో విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీకి  ప‌వ‌నే అతి  పెద్ద ఇన్ స్పిరేష‌న్ గా చెబుతున్నారు. ఇదిలా ఉంటే బీహార్ లోని చిరాగ్ పాశ్వాన్ విజయం సైతం సైతం ప‌వ‌న్ హండ్రడ్ పర్సంట్ స్ట్రైక్ రేట్ తోనే పోలుస్తున్నారు. గ‌త ఏపీ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో 21 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ  సీట్ల‌ను ఎలా కైవ‌సం  చేసుకున్నారో.. అక్క‌డ బీహార్ లో చిరాగ్ పాశ్వాన్ 75 శాతం స్ట్రైక్ రేట్ తో ప‌వ‌న్ ని తలపింపచేశారని పరిశీలకులు అంటున్నారు.  బీహార్ గ‌త కాల‌పు రాజ‌కీయ నాయ‌కుల్లో ఒక‌రైన రామ్ విలాస్ పాశ్వాన్ వార‌స‌త్వాన్ని నిల‌బెడుతూ లోక్ జ‌న  శ‌క్తి పార్టీని ముందుకు తీస్కెళ్తున్న యువ కెర‌టం  చిరాగ్ పాశ్వాన్. ఈ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ  29 సీట్ల‌కు పోటీ చేయ‌గా వాటిలో 19 స్థానాలలో విజయం సాధించింది.  గ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల్లో చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఐదు ఎంపీ  సీట్ల‌ను గెలిచింది. దీంతో తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా చిరాగ్ పాశ్వాన్ దూసుకెళ్తున్నారు. ఏపీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ లా  చిరాగ్  సైతం బీహార్ లో ప్ర‌భావం చూపుతున్న‌ట్టుగా చెబుతున్నారు చాలా మంది.

బిహార్‌‌లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం... బీజేపీకి అత్యధిక స్థానాలు

  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయభేరి మోగించింది. ప్రస్తుతానికి 199 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. మరో 4 స్థానాల్లో లీడ్‌లో ఉంది. దాదాపు 203 సీట్లు గెలిచే అవకాశం ఉంది. బీజేపీ 90 స్థానాల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 82 సీట్లు గెలిచాయి. మరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్‌జేపీ 18 స్థానాల్లో గెలిచి మరో స్థానంలో లీడ్‌లో కొనసాగుతుంది. మరోవైపు మహాగఠ్‌ బంధన్‌ కూటమి 35  స్థానాల్లో గెలిచి మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది.  ఆర్జేడీ 23 స్థానాల్లో గెలిచి మరో స్థానంలో లీడ్‌లో ఉంది. కాంగ్రెస్ ఐదు స్థానల్లో గెలిచి మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. రెండు దశాబ్దాలకు పైగా బీహార్‌లో బలీయమైన రాజకీయ శక్తిగా ఉన్న ఆర్జేడీ ఓటు బ్యాంకు క్రమంగా తగ్గుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ప్రస్తుత ఎన్నికల్లోనూ అన్ని పార్టీల కంటే ఆర్జేడీ ఓటు బ్యాంకు ఎక్కువగా నమోదైంది. తాజా ఫలితాల్లో ఆర్జేడీకి 22.9 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 20.1 శాతం, జేడీయూకు 19.24 శాతం ఓట్లు వచ్చాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధి ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్ విజయం సాధించారు. అతి చిన్న వయస్సులో ఆమె బీహార్ అసెంబ్లీకి ఎన్నికైన రికార్డు సృష్టించారు. అలీనగర్ నుంచి ఆమె తన సమీప ఆర్జేడీ అభ్యర్థి బినోద్ మిశ్రాపై 11,730 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.రాఘోపూర్ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) నేత తేజస్వీ యాదవ్ విజయం సాధించారు. 1,04,065 ఓట్లు సాధించిన ఆయన.. ప్రత్యర్థి బీజేపీ నేత సతీశ్ కుమార్‌పై 14,532 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

పడిలేచిన కెరటాలు...ఏపీలో పవన్ బీహార్‌లో చిరాగ్

  బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వన్  లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ దూసుకెళ్తుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 29 స్థానాల్లో పోటీ చేసిన ఎల్‌‌జేపీ 19 స్థానాల్లో ముందంజలో ఉంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే పోత్తులో భాగంగా పోటీ చేసిన 5  ఐదు ఎంపీలు విజయం సాధించి పట్టు నిలుపుకున్నాది. సరిగ్గా ఐదేళ్ల కిందట దారుణ పరాజయాన్ని చవిచూశారు.  2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లు పైగా పోటీ చేసి కేవలం ఒకేఒక స్ధానంలో గెలిచారు. బాబాయ్‌తో విభేధాలు 2021లో పార్టీ చీలిక తర్వాత తట్టుకుని నిలబడ్డారు. ఈ విజయాన్ని ఏపీలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జనసేన విజయంతో పోలుస్తున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి దూసుకెళ్తోంది. ఎన్డీయేలోని కీలక పార్టీలైన బీజేపీ 43 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం మరో 49  స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. జేడీయూ 17 స్థానాల్లో గెలిచి మరో 61 స్థానాల్లో లీడ్‌లో ఉంది.  మహాగఠ్‌బంధన్ 31 సీట్లలో ముందంజలో ఉంది.విపక్ష ఆర్జేడీ 26, కాంగ్రెస్ 3, వామపక్షాలు 2 సీట్లలో గెలుపును ఖాయం చేసుకోగా, తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ ఖాతా కూడా తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. ఏఐఎంఐఎం 6, ఇతరుల ఒక స్థానంలో అధిక్యంలో ఉంది.నితీష్ కుమార్ వరుసగా తొమ్మిదో సారి బిహార్ సీఎంగా పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. నితీష్ ప్రణాణస్వీకారానికి ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ వస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో ఎన్డీయే 205 సీట్లలో జయకేతనం ఎగురవేసింది.  

బీహార్ లో కనీసం బోణీ కొట్టని ప్రశాంత్ కిశోర్ జన్ సురాజ్

అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందన్న సామెత చందంగా తయారైంది ప్రశాంత్ కిశోర్ పరిస్థితి. ఎన్నికల వ్యూహకర్తగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్ గత రెండు దశాబ్దాలుగా అనేక పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి తన వ్యూహాలు, ప్రణాళికలతో  ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చేలా చేశారు. 2014 ఎన్నికలలో కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికీ, అలాగే 2019లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికార పగ్గాలు చేపట్టడానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలే కారణం. అలాగే పశ్చిమ బెంగాల్ లో మమత సర్కార్ కొలువుదీరడానికీ ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలే కారణం అనడంలో సందేహం లేదు. అయితే ఆయన స్వయంగా ఒక రాజకీయ పార్టీ స్థాపించి తన సొంత రాష్ట్రం బీహార్ లో పోటీ చేస్తే.. పాపం ఘోర పరాజయమే ఎదురైంది.  జనసురాజ్ పార్టీ స్థాపించి స్వరాష్ట్రంలో కింగ్ లేదా కనీసం కింగ్ మేకర్ గానైనా నిలుద్దామన్న ప్రశాంత్ కిశోర్ ఆశలకు బీహార్ జనం గండి కొట్టారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాలలో తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన ప్రశాంత్ కిశోర్ వారిలో కనీసం ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయారు.  రాష్టరంలోని మొత్తం 243 స్థానాల్లో జనసురాజ్ అభ్యర్థులు నిలబడినా ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయారు. సోంత పార్టీ జన సురాజ్ కు ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు ఇసుమంతైనా పని చేయలేదు.   అనేక పార్టీలకు విజయం అందించిన ప్రశాంత్ కిషోర్ సొంత రాజకీయ ప్రస్థానం తొలి అడుగులోనే చతికిల పడిందని నెట్టింట సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.  

బీహార్ లో గెలుపు ముంగిట ఎన్డీయే.. చంద్రబాబు హర్షం, అభినందన

బీహార్‌లో ఎన్డీయే కూటమి భారీ, చారిత్రక విజయం ముంగిట నిలవడం పట్ల  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో పాటు బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్) తరఫున గెలుపొందిన, ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ  వికసిత భారత్ దార్శనికతకు, ఎన్డీయే ప్రగతిశీల పాలనకు ప్రజలు మరోసారి మద్దతు పలికారని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆయన పోస్టు చేశారు.  బీహార్‌లో ఎన్డీయే సాధించిన ఈ అద్భుతమైన విజయం, కూటమి అందిస్తున్న ప్రగతిశీల పాలనపై ప్రజలకు ఉన్న అపార విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.    ఈ సందర్భంగా ఆయన నితీశ్ కుమార్‌కు, బీజేపీ, జేడీయూ విజేతలకు   శుభాకాంక్షలు తెలిపారు.  తన పోస్టుకు చంద్రబాబు నరేంద్రమోడీ, నితీష్ కుమార్ పేర్లను కలుపుsp ఎన్ఎఎన్ఐ (NaNi)  #NaNiLandslideInBihar అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు.  జాతీయ రాజకీయాల్లో కీలకమైన బీహార్ ఎన్నికల ఫలితాలపై ఎన్డీయే మిత్రపక్ష నేతగా చంద్రబాబు స్పందించారు.