ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉపఎన్నికలు.. ఇండియా కూటమి హవా
posted on Jul 13, 2024 @ 3:20PM
సార్వత్రిక ఎన్నికలలో గట్టిగా పుంజుకున్న కాంగ్రెస్ మంచి జోష్ మీద ఉంది. సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక స్థానాలలో విజయం సాధించి అధికారంలోకి రాలేకపోయినా ఇండియా కూటమి గణనీయంగా పుంజుకుంది. ఎన్నికలల విజయం సిద్ధించకపోయినా బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ అవతరించింది. గత రెండు సందర్భాలలోనూ అంటే 2014, 2019 ఎన్నికలలో వలె బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగేందుకు అవసరమైన స్థానాలు దక్కాయి. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు సంగతి దేవుడెరుగు కనీసం విపక్షంగా ఉండేందుకు అసమైర స్థానాలకు దక్కించుకోలేకపోయింది. అయితే 2024 ఎన్నొకతు వచ్చే సరికి కాంగ్రెస్ స్వయంగా బలం పుంజుకోవడమే కాకుండా, కేంద్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినన్ని స్థానాలు బీజేపీకి లభించకుండా చేయడంలో సక్సెస్ అయ్యింది.
ఇప్పుడు ఏడు రాష్ట్రాలలోని 13 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 10న జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి హవా సాగుతోంది. ఈ ఉప ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తొలి విజయాన్ని నమోదు చేయగా, మిగతా 12లో 10 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ మార్కు అందుకోలేకపోయిన బీజేపీ, మెజార్టీ మార్కుకు చేరువగా వచ్చిన కాంగ్రెస్ కూటమి ఈ ఎన్నికలను సవాలుగా తీసుకున్నాయి.
పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, బీహార్లలో ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. పశ్చిమ బెంగాల్లోని బాగ్డా, రాణాఘాట్, మణిక్తల, రాయ్గంజ్లోని నాలుగు స్థానాల్లోనూ అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. ఉత్తరాఖండ్లోని మంగ్లావుర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఖాజీ నిజాముద్దన్ తన సమీప బీఎస్పీ అభ్యర్థి ఉబేదెర్ రెహ్మాన్పై ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. అలాగే బద్రీనాథ్లో కాంగ్రెస్ అభ్యర్థి లఖ్పత్ సింగ్ బుటోలా స్పష్టమైన ఆధిక్యత కనబరిచారు. పంజాబ్లోని జలంధర్ వెస్ట్లో ఆప్ అభ్యర్థి మొహిందర్ భగత్ విజయం సాధించారు.
ఇక్కడి నుంచి విజయం సాధించిన ఆప్ ఎమ్మెల్యే శీతల్ అంగురల్ బీజేపీలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. తమిళనాడులోని విక్రవంది అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార డీఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ లీడింగ్లో ఉన్నారు. బీహార్లో జేడీయూ అభ్యర్థి కళాధర్ ప్రసాద్ మండల్ పై చేయి సాధించారు.
మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లా అమర్వారా నియోజకవర్గంలో బీజేపీ, హిమాచల్ ప్రదేశ్లో తొలుత వెనకబడిన కాంగ్రెస్ పుంజుకుని ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. డేహ్రాలో తొలుత వెనకబడిన సీఎం సుఖ్విందర్ సుఖు భార్య కమలేశ్ ఠాకూర్ ముందంజలో ఉన్నారు.