‘‘దామోదర్ గౌతమ్ సవాంగం అన్న’’... సమగ్ర చరిత్ర..!

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్)

వెల్‌కమ్ టు జర్నలిస్ట్ లాండ్రీ. దామోదర్ గౌతమ్ సవాంగ్. 1986 ఏపీ కేడర్‌కి చెందిన మాజీ ఐపీఎస్ అధికారి. స్వరాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. బీఏ చదివిన గౌతమ్ సవాంగ్ బీకాం చదివిన మాస్టర్ మైండ్ అబ్దుల్ కరీం తెల్గీ... అంటే నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణం చేసిన అబ్దుల్ కరీం తెల్గీతో సంబంధాలు కలిగి వున్నాడని నాడు సీబీఐ తేల్చింది. 1992 నుంచి 2003 వరకు దాదాపు పదకొండు సంవత్సరాల పాటు సాగిన మూడువేల కోట్ల రూపాయల ఈ నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణం 2003లో వెలుగులోకి వచ్చింది. తెల్గీ అరెస్టు కంటే ముందు నుంచే అతనితో గౌతమ్ సవాంగ్ సన్నిహిత సంబంధాలు కలిగివున్నాడని, పలుమార్లు తెల్గీతో కలసి హైదరాబాద్ నుంచి ముంబైకి ఫ్లైట్‌లో ప్రయాణించాడని నాడి ఏపీ సీఐడీ నిర్ధారించింది. బాంబేలో పెద్ద మొత్తంలో సవాంగ్‌కి తెల్గీ నుంచి డబ్బులు ముట్టాయని వార్తలు వచ్చాయి. గౌతమ్ సవాంగ్‌కి సహకరించిన నాటి ఏసీపీ భూపేందర్ రెడ్డి కూడా ఈ కేసులో నిందితుడే అని సీబీఐ తేల్చింది. ఇదే కేసులో నాటి టీడీపీ మంత్రి కృష్ణ యాదవ్ అరెస్టయి జైలు జీవితం గడిపారు. డిటెక్టివ్ డిపార్ట్.మెంట్ డీఐజీ నరసింహారావు ఈ కేసులో అరెస్టయి సంవత్సరాలపాటు ఊచలు లెక్కపెట్టాడు. హైదరాబాద్ వెస్ట్ డీసీపీగా పనిచేస్తు్న్న గౌతమ్ సవాంగ్‌ను ఈ కేసులో విచారించడానికి సీనియర్ అధికారి ఉమేష్ షరాఫ్ నాటి సవాంగ్ ఆఫీసులో అడుగుపెడితే గౌతమ్ సవాంగ్ ఏం చేశారో తెలుసా? గోడ దూకి పారిపోయారు అనే వార్త అప్పట్లో హల్‌చల్ చేసింది. ఇదే కేసులో డీఎస్పీ సత్యనారాయణరెడ్డి, సీఐ మహ్మద్ అషీఫ్, ఎస్.ఐ. మధుమోహన్, కానిస్టేబుల్ కేపీ రెడ్డి కూడా జైలుపాలయ్యారు. కేసు సీబీఐకి బదిలీ అయింది. గౌతమ్ సవాంగ్‌కి ఉచ్చు బిగిసే సమయంలో నాటి టీడీపీ ప్రభుత్వంలో పెద్దల ఆశీస్సులతో సవాంగ్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా కేవలం శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నాడు సీబీఐ సిఫార్సు చేసింది అనే వాదన బలంగా వుంది. ఆ తర్వాత కొద్దికాలానికే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అందివచ్చిన అవకాశాన్ని స్వయంగా క్రిస్టియన్ అయిన గౌతమ్ సవాంగ్ వినియోగించుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి దగ్గర క్రిస్టియన్ ఫాదర్ల లాబీయింగ్‌తో సీబీఐ సిఫారసు చేసిన శాఖాపరమైన చర్యలు అటకెక్కాయనేది బహిరంగ రహస్యం. 

ఆంధ్రప్రదేశ్ రెండ్ రాష్ట్రాలుగా విడిపోయింది. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విజయవాడ పోలీస్ కమిషనర్‌గా గౌతమ్ సవాంగ్ జులై 2015 నుంచి జులై 2018 వరకు మూడు సంవత్సరాలు కొనసాగారు. సవాంగ్ ఆగం 2.0 ఇక్కడే మొదలైంది. విజయవాడ పోలీస్ కమిషనర్‌గా అనేక అక్రమాలకు పాల్పడ్డారని కింది స్థాయి పోలీసు సిబ్బందిని ఎవరిని కదిలించినా కథలు కథలుగా చెబుతారు. అందులో ప్రధానంగా దొంగ బంగారం ముచ్చట ముందు చెబుతాను. సవాంగ్ విజయవాడ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు, ఆ తర్వాత వచ్చిన పోలీస్ కమిషనర్ల కాలం పరిశీలిస్తే దొంగ బంగారం లెక్క ఇట్టే తేలిపోతుంది. చోరీకి గురైన బంగారాన్ని పోలీసులు దొంగల నుంచి రికవరీ చేసి బాధితులకు న్యాయం చేస్తారు. ఉదాహరణకు ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. కేజీ బంగారం చోరీకి గురైంది. పోలీసులు ఆ దొంగని పట్టుకున్నారు. ఆ కేజీ బంగారం దొంగ నుంచి రికవరీ చేశారని అనుకుందాం. బాధితుడికి 750 గ్రాములే చేరుతుంది. ఇక్కడ పావుకిలో బంగారం గోవిందా. అదే గౌతమ్ సవాంగ్ కమిషనర్‌గా వున్న సమయంలో కేజీకి అరకేజీ.. ముప్పావు కేజీ గోవిందా. పోలీస్ కమిషనర్ స్థాయిలో వుండి సీఐ స్థాయి సిబ్బందితో నేరుగా నాకు రికవరీ బంగారం కావాలని అడగటం పోలీసు శాఖ చరిత్రలో ఇటువంటి ఉన్నతాధికారిని మేము అంతకుముందు ఎన్నడూ చూసి ఎరగం అనేవారంటే, పరిస్థితి ఎంత ఘోరంగా వుందో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో సివిల్  పంచాయితీలు. పక్కరాష్ట్రంలో వున్న వ్యక్తులను సైతం అక్రమంగా ఎత్తుకొచ్చి, ఆంధ్రాలో నిర్బంధించి, బెదిరించి పంచాయితీలు చేసేవారనే ఆరోపణలు అప్పుడు బలంగా వినిపించాయి. 

సవాంగ్ కమిషనర్‌గా వుండగా విజయవాడలో సెక్స్ రాకెట్, కాల్ మనీ వార్త పెను సంచలనం స‌ృష్టించింది. నాటి ఎంపీ కేశినేని నాని, గౌతమ్ సవాంత్ సంయుక్తంగా ముందుకు తీసుకువచ్చిన కేసు... విజయవాడ కాల్ మనీ, సెక్స్ రాకెట్ కేసు. ఏమాత్రం పసలేని కేసును పట్టుకుని నాటి ప్రతిపక్షం జగన్ గ్యాంగ్ ఏ స్థాయిలో నాటి ప్రభుత్వాన్ని అల్లరిపాలు చేశాయో మనం చూశాం. అత్యంత వివాదాస్పద కేసులలో పోలీసు ఉన్నతాధికారులు పత్రికా సమావేశం పెట్టి ప్రజలకు వివరణ ఇవ్వడం ఇవ్వడం పోలీసుల ప్రాథమిక బాధ్యత. అటువంటి బెజవాడలో అటు ప్రతిపక్ష పార్టీ రచ్చ, ఇటు మీడియాలో సంచలన కథనాలు... వీటిమీద స్పందించాల్సిన సవాంగ్ హైదరాబాద్ వెళ్ళి కూర్చున్నారు. ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వాస్తవాలు వివరించమంటే లెక్క చేయలేదు. చంద్రబాబు నాటి డీజీపీ జేవీ రాములును గట్టిగా మందలిస్తే సవాంగ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి  తూతూమంత్రంగా కేవలం ఐదు నిమిషాల్లో సమావేశం ముగించారు. 

ఆ తర్వాత కాలంలో గౌతమ్ సావాంగ్‌కి ఒక బలమైన కోరిక వుండేది. అదే డీజీపీ పోస్ట్. తరచూ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్ళి చంద్రబాబు మనవడు దేవాన్ష్.తో ఆడుకోవడం, కాకాపట్టడం మొదలుపెట్టారు. ఒక ఫైన్ మార్నింగ్ సవాంగ్ డీజీపీ కలను చంద్రబాబుతో పంచుకోవడం జరిగింది. సాధారణంగా రాజకీయ నాయకులు ఏం సమాధానం చెబుతారు? చూద్దాం అంటారు. చంద్రబాబు కూడా అదే అన్నారు... చూద్దాం అని! గౌతమ్ సవాంగ్ బలహీనతను అర్థం చేసుకున్న ఒక మీడియా అధినేత నేను మాట్లాడాను. నువ్వే డీజీపీ అని గౌతమ్ సవాంగ్‌లో బలీయంగా వున్న కోరికను తట్టి లేపాడు ఆ మీడియా అధినేత. అలా ఒకసారి కాదు.. పలుమార్లు జరిగింది. అదే అదనుగా గౌతమ్ సవాంగ్ చేత అనేక సివిల్ పంచాయితీలు చేయించి లాభపడ్డారు. ఇంకోపక్క ఇదే కోవలో రాష్ట్రంలో ఆటోమోబైల్ టైకూన్‌గా పేరున్న వ్యక్తి కూడా అనేక సివిల్ పంచాయితీలు చేయించి ఇరువురూ లాభపడ్డారు అని చెబుతారు. ఇక మీడియా అధినేత వాడకం అంతా ఇంతా కాదు అని చెబుతారు. 

డీజీపీ మార్పు సమయం రానే వచ్చింది. జూన్ 30 సాయంత్రం 5 గంటలకు నాటి డీపీజీ మాలకొండయ్య రిటైర్‌మెంట్. మరి, నూతన డీజీపీ ఎవరు? చంద్రబాబు అప్పటి వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. గౌతమ్ సవాంగ్‌లో తీవ్ర ఆందోళన మొదలైంది. సవాంగ్ మీడియా అధినేతకు ఫోన్ చేశారు. నీ పేరే కన్ఫమ్. ఇంకొద్దిసేపట్లో చంద్రబాబు సంతకం పెట్టనున్నారు అనే తప్పుడు సమాచారాన్ని తెలియజేశారు. తన జీవితకాల కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది అనే తన్మయత్వంలో సవాంగ్ మునిగిపోయారు. గౌతమ్ సవాంగ్‌ని అభిమానించే మహిళలు, శ్రేయోభిలాషులు సవాంగ్ ఆఫీసుకి క్యూ కట్టారు. పూల బొకేలు, దండలు, స్వీట్ ప్యాకెట్లు, టపాసులు సిద్ధం చేశారు. ఆ  రాత్రి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏ కబురూ లేదు. తెల్లారి చంద్రబాబు కార్యాలయం నుంచి ఆర్పీ ఠాకూర్‌కి పిలుపు వచ్చింది. ఆర్పీ ఠాకూర్ ఏపీ నూతన డీజీపీగా ప్రకటన వెలువడింది. గౌతమ్ సవాంగ్‌లో నిర్వేదం, విషాదం అలముకున్నాయి. ఇదేంటి ఇలా జరిగింది అని ఆ మీడియా అధినేతను సవాంగ్ ప్రశ్నిస్తే అప్పటి వరకు సవాంగ్‌ని ఒక రేంజ్‌లో వాడిన మీడియా అధినేత ప్లేటు తిప్పేసి, సరిగ్గా చంద్రబాబు సంతకం పెట్టే సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు అడ్డుపడ్డారు అనే కట్టుకథలో సవాంగ్‌ని నమ్మించడంలో విజయవంతం అయ్యారు. నాటి చంద్రబాబు ప్రభుత్వం సవాంగ్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్.మెంట్ డీజీగా నియమించింది. ఇక్కణ్ణించి కథ కొత్త మలుపు తీసుకుంది. తన డీజీపీ కల ఆవిరైపోయిన వేదనలో సవాంగ్ అడుగులు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ వైపు పడ్డాయి. ఆనాడే, చంద్రబాబు ప్రభుత్వం వుండగానే లోటస్‌పాండ్ వేదికగా సవాంగ్ ఒక ఐపీఎస్ టీమ్‌ని సిద్ధం చేసుకున్నారు. వారంతా చంద్రబాబు వ్యతిరేకులుగా, ప్రతిపక్ష నేత జగన్ అనుకూల టీమ్‌ని సిద్ధం చేయడంలో గౌతమ్ సవాంగ్ విజయవంతం అయ్యారు. 

2019 ఎన్నికలలో తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయింది. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ మరుసటిరోజే మే 31న గౌతమ్ సవాంగ్ ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా నియమించబడ్డారు. ఇక్కడి నుంచి అసలు సవాంగం అన్న 3.0 స్టార్ట్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ, ఆ మాటకొస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే దారుణమైన పోలీసు రాజ్యం నడిచింది. ఇందిర ఎమర్జెన్సీ సమయంలో కూడా ఎమర్జెన్సీ అని ప్రకటించిన తర్వాత మాత్రమే నిర్బంధం కొనసాగింది. సవాంగ్ నేతృత్వంలో పోలీసు దమనకాండ ఆంధ్రప్రదేశ్ పోలీసు ప్రతిష్ఠను పాతాళంలోకి తొక్కేసింది. సవాంగ్ పోలీసు పాలనలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు, సామాన్య ప్రజలు అనేక దారుణాలకు గురయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే పెను విధ్వంసం సృష్టించారు. సవాంగ్ మార్కు వేట మొదలైంది. అందులో ముందు వరస... ఆలూరు బాల వెంకటేశ్వరరావు. ఏబీ వెంకటేశ్వరరావుపై సాగించిన దమనకాండ మీకు తెలుసుకదా! నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఉన్నవీ, లేనివీ అనేక చాడీలు చెప్పి, నకిలీ పత్రాలు సృష్టించి ఏబీ వెంకటేశ్వరరావుపై విరుచుకుపడటం ప్రధాన అంశం. ఏబీతోనే ఆగలేదు. ఏబీ కింద పనిచేసిన ఉద్యోగులందర్నీ ముప్పుతిప్పలు పెట్టించి మూడు చెరువుల నీళ్ళు తాగించారు. 

సవాంగ్ లిస్టులో మరొక బాధితురాలు.. ఐపీఎస్ అధికారిణి గీతాదేవి. ఆమె చేసిన నేరం.. ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ డీజీగా వున్నప్పుడు గీతాదేవి రీజినల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఆర్ఐఓ‌)గా పనిచేయటమే ఆమె చేసిన నేరం. గీతాదేవి మాతృమూర్తి కేన్సర్‌తో ఆఖరి పోరాటం చేస్తుంటే సవాంగ్ ఆమెను మానసికంగా కోలుకోలేనంత వేధింపులకు గురిచేశారు. ఇక తరువాతి వరుస చంద్రబాబు సామాజికవర్గం. పోలీసు శాఖలో పనిచేసే కమ్మ అధికారుల లిస్టు తయారుచేశారు. హెడ్ కానిస్టేబుల్ దగ్గర్నుంచి ఐపీఎస్ వరకు వున్న వున్న అధికారులు సవాంగ్ దృష్టిలో అంటరానివారు. స్వతహాగా జగన్ రెడ్డిది వివాదాస్పద, వికృత మనసత్త్వం. దానికి గౌతమ్ సవాంగ్ విషపూరిత ఆలోచనలు తోడైతే ఏమవుతుంది? అదే అయింది! ఎటుచూసినా విధ్వంసం. ఐదేళ్ళ జగన్ పాలన మీకు తెలియంది కాదు. ఎన్నికలకు ఏడాది ముందు పాలెగాడు జగన్‌కి సవాంగం అన్నపై ఉన్నపళంగా కోపం వచ్చింది. డీజీపీ పోస్టు నుంచి పీకిపడేశాడు. 

తెలుగుదేశం పార్టీ అతివాదులు సవాంగ్‌ను జగన్ ఇన్నాళ్ళూ అడ్డగోలుగా వాడుకుని కరివేపాకులా తీసిపారేశాడు... నాడు ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నియ్య.. నేడు సవాంగ్ అన్నియ్య అని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. జగన్ శిబిరం ఆలోచనలో పడింది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా సవాంగ్‌ను నియమించారు. ఆ పదవిలో కూడా గౌతమ్ సవాంగ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వున్నాయి. గ్రూప్-1 పరీక్ష పేపర్లు దిద్దే కార్యక్రమంలో గౌతమ్ సవాంగ్ తీవ్ర నేరానికి పాల్పడ్డారు. పరీక్ష పత్రాలను డిజిటల్ పద్ధతిలో దిద్దటాన్ని హైకోర్టు రద్దు చేసి, మాన్యువల్ రీవాల్యుయేషన్ చేయమని ఆదేశించింది. మొదటిసారి రీవాల్యుయేషన్ పీఎస్ఆర్ ఆంజనేయులు నేతృత్వంలో నిర్వహించబడింది. రెండోసారి గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో రీవాల్యుయేషన్ జరిగింది. హైకోర్టులో గౌతమ్ సవాంగ్ ప్రమాణ పత్రం దాఖలు చేశారు. దాంట్లో రీవాల్యుయేషన్ ఒకసారే జరిగిందనే తప్పుడు సమాచారాన్ని ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈమొత్తం ప్రక్రియ అక్రమమని తేల్చింది. పరీక్ష ఫలితాలు, ఎంపిక జాబితాను రద్దుచేసి మళ్ళీ మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. అలాగే, ఎంపికై ఉద్యోగంలో చేరినవారు కూడా కొనసాగటానికి వీల్లేదని తీర్పు చెప్పింది. ఇంటర్వ్యూ ప్రక్రియలో పోస్టులకు రేటు కట్టి అమ్ముకున్నారని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని నిగ్గు తేల్చడానికి గౌతమ్ సవాంగ్‌తోపాటు ఏపీపీఎస్సీ సభ్యులను విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. నాడు గౌతమ్ సవాంగ్ ఉత్సాహం చూపించిన కాల్ మనీ కేసును కోర్టు కొట్టివేసింది. గౌతమ్ సవాంగ్ ఆ కేసును కోర్టులో నిరూపించలేకపోయారు. 

వైసీపీ బాటలోనే బీఆర్ఎస్?.. అసెంబ్లీ బహిష్కరణకు నిర్ణయం

  పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఒక్క ఓటమితో కుదేలైపోయిందా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దీటుగా ఎదుర్కోలేక పలాయన మంత్రం పఠిస్తోందా? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. ఆ పార్టీ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం అందులో భాగమేనని అంటున్నారు. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికే అసెంబ్లీని బహిష్కరించి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇప్పుడు పార్టీ సభ్యులు కూడా అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.  దీంతో రాజకీయ వర్గాలలో బీఆర్ఎస్  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అడుగుజాడలలో నడుస్తోందని అంటున్నారు. ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంంది.   సోమవారం (జనవరి 5)న సభకు హాజరై.. మంగళవారం (జనవరి 6) నుంచి అంటే సభలో కృష్ణ, గోదావరి జలాలపై చర్చ జరిగే సమయానికి అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పరిశీలకులు మాత్రం సభలో కాంగ్రెస్ ను దీటుగా ఎదుర్కోనేందుకు సభాపక్ష ఉప నేతల నియామకం తరువాత బీఆర్ఎస్ బాయ్ కాట్ నిర్ణయం తీసుకోవడం ఏమిటన్న ప్రశ్నకు ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హారీశ్‌రావుకి క్రెడిట్ దక్కే చాన్స్ ఇవ్వవద్దన్య వ్యూహంతోనే బీఆర్ఎస్ ఈ బాయ్ కాట్ నిర్ణయానికి వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా అసెంబ్లీలో నదీ జలాలపై చర్చను బీఆర్ఎస్ బాయ్ కాట్ చేయడమంటే.. పలాయన మంత్రం పఠించడమేనని పరిశీలకులు భావిస్తున్నారు.   అయితే నిన్న మొన్నటి వరకూ నదీ జలాల అంశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఎండగడతాం అంటూ బీరాలు పలికిన బీఆర్ఎస్ ఇంత హఠాత్తుగా బహిష్కరణ నిర్ణయం తీసుకోవడంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక వేళ కేసీఆర్ సభకు హాజరైతే.. జల వివాదాలకు ఆయనే సమాధానం చెబుతారు. అయితే కేసీఆర్ గైర్హాజరౌతున్న నేపథ్యంలో ఇటీవల శాసనసభాపక్ష ఉప నేతగా నియమితులైన హరీష్ రావు సభలో బీఆర్ఎస్ తరఫున ప్రసంగించాల్సి ఉంది. అదే జరిగితే సభ సీఎం రేవంత్ వర్సెస్ హరీష్ రావు అన్నట్లుగా మారిపోతుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ డమ్మీ అయిపోతారు. ఇప్పటికే శాసనసభాపక్ష ఉప నేతగా హరీష్ రావు నియామకం కేటీఆర్ ను ఒకింత తక్కువ చేసినట్లుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో ఇక జలవివాదాలపై హరీష్ రావు గట్టిగా గళం విప్పితే కేటీఆర్ పరిస్థితి పార్టీలో మరింత దిగజారుతుందన్న భావనతోనే బీఆర్ఎస్ ఆకస్మికంగా అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నిటికీ మించి సీఎం రేవంత్, హరీష్ మధ్య కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయనీ, వారిరువురి మధ్యా అరగంట భేటీ జరిగిందనీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించిన గంటల వ్యవధిలో బీఆర్ఎస్ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో సంక్షోభం ముదిరేలా చేసుకోవడం కంటే.. జనం పలాయనం అనుకున్నా అసెంబ్లీ బాయ్ కాటే మేలని బీఆర్ఎస్ నిర్ణయించుకునట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విశేషమేంటంటే  పార్టీ అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయాన్నిస్వయంగా హరీష్ రావే ప్రకటించడం విశేషం.

కేసీఆర్ తోనూ ఢీ అంటే ఢీ.. కవిత మాటల అర్ధం అదేనా?

తెలంగాణ రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పని ఖతమేనా? ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు కవిత ఇదే విషయాన్ని ఒకింత నర్మగర్బంగా చెప్పారా?  అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఆరంభం సందర్భంగా సభకు వచ్చి ఓ ఐదారు నిముషాలు సభలో కూర్చున్న బీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడు కల్వకుంట్ల కేసీఆర్..  ఆ తరువాత  సభ నుంచి బయటకు వెళ్లి పోయారు. అయితే.. ఆ రోజు సభలో ఏ విషయంపైనా చర్చ జరిగే అవకాశం లేనందున ఆయన సభనుంచి వెళ్లిపోయారనీ, కొత్త సంవత్సరం రెండో తేదీ నుంచి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రేవంత్ సర్కార్ ను అడుగడుగునా ఇరుకున పెట్టి తన విశ్వ రూపాన్ని చూపిస్తారనీ బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు గట్టిగా చెప్పారు. అదే నమ్మారు. అయితే కేసీఆర్ మాత్రం సభలో పార్టీ గొంతు గళంగా వినిపించేందుకు ఉప నాయకులను నియమించడంతో.. ఆయన ఈ శీతాకాల సమావేశాలలో ఇక సభలో కనిపించరని పరిశీలకులు ఆ రోజే చెప్పారు. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం సభకు కేసీఆర్ గైర్హాజరయ్యారు.  ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ భవిష్యత్ పై తెలంగాణ జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ వ్యాఖ్యలు చేశారు. సభకు కేసీఆర్ డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఇక ఖతమే అని అన్నారు.  శుక్రవారం (ఫిబ్రవరి 2) శాసనమండలి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో  చిట్ చాట్ చేసిన ఆమె.. తన తండ్రి కేసీఆర్ కే  సవాల్ విసిరారు. ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు. తప్పు చేయకుంటే కేసీఆర్ సభకు రావాలని సవాల్ విసిరారు.   అధినాయకుడు అసెంబ్లీకి రాకుండా..  పిల్ల కాకులకు సభాసమయాన్ని వదలడం సరికాదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కు ప్యాకేజీలు, అమ్ముకోవడం తప్ప ఏం తెలియదని ఎద్దేవా చేశారు.   హరీష్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య రహస్య బాండ్ ఉందని ఆరోపించిన ఆమె హరీష్ సీఎం చాంబర్ లో అరగంట సేపు ముచ్చటించడం నిజం కాదా అని ప్రశ్నించారు.   అసెంబ్లీలో  మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించిన ఆమె..  రేవంత్ వర్సెస్ హరీష్ అన్నట్లుగా అసెంబ్లీ చాలా ప్రమాదకరమన్నారు.  కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ పై నేరుగా అటాక్ చేయడం ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ తో తాను మాట్లాడి నాలుగు నెలలు పైనే అయ్యిందన్నారు.  కేటీఆర్, హరీష్ లకు పార్టీని వదిలేయడంపై ఆమె ఈ సందర్భంగా కేసీఆర్ ను తప్పుపట్టారు.  ఇలా మాట్లాడడం ద్వారా ఆమె తాను కేసీఆర్ తో డీ అంటే ఢీ అనడానికి రెడీ అన్న సంకేతాలు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తరువాత తన శాసనమండలి సభ్యత్వానికి కవిత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇప్పటికీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. శుక్రవారం (జనవరి 2) కూడా ఆమె శాసనమండలి స్పీకర్ ను తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు. 

సొంత ఇంటి పంచాయతీ పరిష్కరించలేక చేతులెత్తేశారు.. కేసీఆర్ పై రఘునందన్ విమర్శలు

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. కొత్త సంవత్సరం తొలి రోజున ఆయనపై బీజేపీ ఎంపీ రఘునందనరావు తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ తీరు ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్న చందంలా ఉందన్నట్లుగా ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఇతరుల పంచాయతీలను పరిష్కరించడంలో గొప్ప ఉత్సాహం చూపిస్తారనీ, అయితే సొంత ఇంటి పంచాయతీల పరిష్కాం విషయంలో మాత్రం చేతులెత్తేశారనీ అన్నారు. గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.  ఇక కల్వకుంట్ల కవిత సొంత దారి చూసుకున్నారనీ, నేడో, రేపో ఆమె కొత్త పార్టీ ప్రారంభించడం ఖాయమనీ జోస్యం చెప్పారు.  అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్దకు వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహన అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డిలు లేచి నిలబడకపోవడం వారి విచక్షణకు సంబంధించిన విషయమన్న రఘునందనరావు.. కేటీఆర్ కు ముఖ్యమంత్రి కావాలన్న యాంబిషన్ ఉందనీ, అయితే అది సాకారం అవ్వాలంటే ఉండాల్సిన మద్దతు కేటీఆర్ కు సొంత పార్టీ నుంచే కరవైందన్నారు.  పార్టీ దాకా ఎందుకు ఆయనకు సొంత కుటుంబంలోనే మద్దతు లేదని చెప్పారు.  ఈ పరిణామాలన్నిటినీ నిశబ్దంగా గమనిస్తున్న హరీష్ రావు సమయం కోసం వేచి చూస్తున్నారని తాను భావిస్తున్నానన్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న రఘునందనరావు.. కావాలంటే ఈ విషయాన్ని తాను రాతపూర్వకంగా కూడా చెబుతానన్నారు.  ఇక రాష్ట్ర బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలపై స్పందిస్తూ.. ఏ పార్టీలోనైనా అభిప్రాయబేధాలు సహజమని కొట్టి పారేశారు.  దశాబ్ద కాలం బీఆర్ఎస్ పాలనను.. రెండేళ్ల కాంగ్రెస్ పాలననూ చూసిన తెలంగాణం ఇప్పడు బీజేపీకి పట్టం గట్టాలని ఉవ్విళ్లూరుతున్నారన్నారు.  

బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డిపై కాల్పులు

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై కర్నాటకలోని బళ్లారిలో హత్యాయత్నం జరిగింది. ఆయనపై స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు కాల్పులు జరిపి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  మహర్షి వాల్మీకి విగ్రహం ఏర్పాటు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీవిషయంలో  తలెత్తిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.   ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి  గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో  కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. అలాగే తొలుత కాల్పులు జరిపిన సతీష్ రెడ్డి గాయపడ్డాడు.   స్థానిక ఎమ్మెల్యే భరరత్ రెడ్డి, గాలి జనార్థన్ రెడ్డిల మధ్య దీర్ఘకాలంగా రాజకీయ వైరం ఉన్న సంగతి విదితమే.  భరత్ రెడ్డి వర్గం వారు గాలి జనార్ధన్ రెడ్డి నివాసం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఘర్షణకు దారి తీసింది.  కాగా ఈ కాల్పుల ఘటన నేపథ్యంలో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొడంతో  పోలీసులు 144వ సెక్షన్ విధించారు. బళ్లారిలో ప్రధాన నాయకులు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు.  

కొత్త సంవత్సరంలో కవిత వార్ కొత్త పుంతలేనా?

బీఆర్ఎస్ వర్సెస్ కవిత వార్ కొత్త సంవత్సరంలో కొత్త పుంతలు తొక్కబోతున్నది. ఇప్పటి వరకూ ఘాటుగా విమర్శలు చేస్తున్నా కవిత తన విమర్శలను ఒకింత సున్నితంగా చిన్నపాటి సూదిమొన గుచ్చినట్లుగా చేస్తు వచ్చారు. అయితే ఇక ముందు అంటే కొత్త సంవత్సరంలో తాను ఇంకెంత మాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు సాగుతానని.. ఈ ఏడాది చివరి రోజున కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడిన ఆయన ఈ సారి కేటీఆర్ లక్ష్యంగా కూడా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.  కేటీఆర్ నేరుగా అమెరికా నుంచి వచ్చి పార్టీలో చేరితే.. తాను మాత్రం   2006 లో  సొంతంగా తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశాననీ, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ అన్న విషయానికి తెలంగాణ సాధన ఉద్యమంలో అగ్రస్థానం కలిగేలా చేశాననీ చెప్పుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ తాను ఇండిపెండెంట్ గానే పాల్గొన్నా నన్నారు.  తెలంగాణ ఆవిర్భవించి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ తీరులో మార్పు వచ్చిందని కవిత అన్నారు.  అప్పుడే తన ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానం తనకు కలిగిందన్న కవిత..  తన ఫోన్ ను తన భర్త పోన్ ను ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను అప్పుడే పార్టీ దృష్టికి తీసుకువచ్చినా తేలికగా తీసుకున్నారని కవిత చెప్పారు. అదే కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ చేయిస్తే తేలికగా తీసుకుంటారా అని ప్రశ్నించిన ఆమె,  మా ఇంట్లో పని చేస్తున్న ఒకరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో  సిట్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడే తన ఫోన్, తన భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న విషయం అర్ధమైందన్నారు.  మహిళలకు అవకాశం ఇచ్చే విషయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సరిగా వ్యవహరించలేదని తండ్రి నిర్ణయాలను సైతం తప్పుపట్టిన కవిత.. కేసీఆర్ హయాంలో 42 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తే.. వారిలో కనీసం ఒక్క మహిళ కూడా లేని విషయాన్ని ఎత్తి చూపారు. ఆ నాడే తాను తన తండ్రిని ప్రశ్నించానని చెప్పుకొచ్చారు.  ఇక హరీష్ రావుపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. హరీష్ రావును తెలంగాణ చంద్రబాబుగా అభివర్ణించారు. ఏడాది ముగుస్తున్న సమయంలో ఆమె పాడ్ కాస్ట్ లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు వచ్చే సంవత్సరం కవిత బీఆర్ఎస్ పై ఇప్పటి వరకూ చేస్తున్న యుద్ధం కొత్త పుంతలు తొక్కబోతోందన్న విషయాన్ని తేటతెల్లం చేశాయి. ఇప్పటి వరకూ తన సోదరుడిని హరీష్ ముంచేస్తారు, తన తండ్రిని తప్పుదోవపట్టిస్తారు అంటూ వచ్చిన కవిత.. ఇప్పుడు మొత్తంగా పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా మొత్తం అందరిపైనా యుద్ధం ప్రకటించేసినట్లైంది. 

మెగా ఫ్యాన్స్ వర్సెస్ నాగబాబు.. జనసైనికులు ఎటువైపు?

జనసేన ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ నాగబాబు కొద్ది కాలంగా ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు, వినిపించడం లేదు. అటువంటి నాగబాబు.. నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన కామెంట్లకు కౌంటర్ ఇవ్వడం ద్వారా ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశారు. జనసేన ఎమ్మెల్సీగా.. ఆ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు పని చేసుకుంటూ పోతున్న నాగబాబు.. శివాజీ కామెంట్లకు కౌంటర్ ఇచ్చి, మెగా ఫ్యాన్స్ కు టార్గెట్ గా మారారు. శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు  కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.   వాస్తవానికి మెగా కాంపౌడ్ అంత పటిష్ఠంగా ఉండటానికి నాగబాబే కారణమని అంటుంటారు, ఆయన నాగ‌బాబు లేకుండా మెగా కాంపౌండ్ ఇంత స్ట్రాంగా నిల‌బ‌డే ఛాన్స్ లేదనే వారు కూడా చాలా మంది ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి అయినా, మెగాపవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అయినా.. తాము మాట్లాడితే ఇబ్బంది అనుకునే విషయాలను నాగబాబు నోట పలికిస్తారని వారిని దగ్గరా తెలిసన వారు చెబుతుంటారు.   ఇందుకు ఉదాహరణగా అల్లు అర్జున్ గత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసిన సందర్భంలో కానీ,  ఇండస్ట్రీలో చిరుకు మద్దతుగా గళం విప్పే అంశంలో కానీ నాగబాబు ఎలాంటి శషబిషలూ లేకుండా ముందుకు వచ్చిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. ఇక తన స్వంత కుమార్తె నీహారిక విషయంలో ఆమె పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అండగా నిలబడిన ఉదంతాన్నీ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ నాగబాబును జనసేన నుంచి సస్పెండ్ చేయాలంటూ చేస్తున్న డిమాండ్ ను జనసైనికులు కొట్టి పారేస్తున్నారు. మహాళల వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో నాగబాబు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని ఆయనకు అండగా నిలబడుతున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ అనవసర అంశాన్ని ఇంకా పొడిగించకుండా కామైపోవడం మంచిదని హితవు చెబుతున్నారు.  

గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడు రేహాన్ వాధ్రా గాంధీయేనా?

రాహుల్ గాంధీ నెహ్రూ గాంధీ నెహ్రూ కుటుంబ వారసుడు.  కాంగ్రెస్ పార్టీకి ప్ర‌స్తుత‌ం పెద్ద దిక్కు. ద‌శా దిశా దిస్కూచి కూడా రాహుల్ గాంధీయే. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి కూడా ఆయనే. అందులో సందేహం లేదు. అయితే.. రాహుల్ తరువాత కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా చూసిన ఆయన సోదరి ప్రియాంక వధేరా గాంధీ కుమారుడు   రేహాన్ వాద్రానే వార‌సుడు. అందుకు కారణం రాహుల్ గాంధీ అవివాహితుడిగా ఉండటమే. ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.   అదే రాహుల్ గాంధీకి వివాహమై ఉంటే.. ఆయ‌న త‌న‌యులే త‌ర్వాతి  త‌రం వార‌సులు అయి ఉండేవారు. కొద్ది కాలం కిందటి వరకూ రాహుల్ గాంధీ వివాహం అన్నదే వారి కుటుంబంలోనే కాక, రాజకీయవర్గాలలో కూడా హాట్ టాపిక్ గా ఉండేది. అయితే.. రాహుల్ వివాహం పట్ల సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆ చర్చ క్రమంగా ఆగిపోయింది. ఇప్పుడు రాహుల్ మేనల్లుడు రేహాన్ తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడానికి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని పెళ్లి పీటలెక్కుతున్నారు. అయితే రాహుల్ గాంధీకి కూడా ఓ ప్రియురాలు ఉండేదని గట్టిగా వినిపించేది. అయితే ఆయన రేహాన్ లా ధైర్యం చేయలేదు. అందుకు ప్రధాన కారణం సెక్యూరిటీ థ్రేట్ అంటారు.  అప్ప‌ట్లో సోనియా గాంధీ ప్ర‌ధాని  కావ‌ల్సిన  వారు.. ఆమె ప్ర‌ధాని కాలేక పోవ‌డానికి, త‌ర్వాత రాహుల్ పెళ్లాడ‌క పోవ‌డానికి కూడా అదే కారణంగా చెబుతారు.  అప్ప‌ట్లో ఎల్. టీ. టీ. ఈ అనే మిలిటెంట్ గ్రూప్ రాజీవ్ గాంధీని హ‌త‌మార్చిన సంగ‌తి తెలిసిందే. సోనియా ప్ర‌ధాని కాకుండా హెచ్చ‌రిక‌లు జారీ చేసి అడ్డుకున్నది కూడా ఎట్టీటీయే అని అప్పట్లో గట్టిగా వినిపించింది.ఈ నేప‌థ్యంలో రాహుల్ తన త‌ద‌నంత‌ర వార‌సుల‌కు ఈ ప్రాణ‌హాని  సైతం అనువంశికంగా  క‌ల్పించ‌డం ఎందుకు? అన్న కోణంలో ఆలోచించి.. త‌న పెళ్లి ఊసెత్తలేదని అంటారు. అందుకే రేహాన్ పెళ్లి ద్వారా ఆ ఇంట ఇన్నేళ్ల‌కు ఒక శుభ‌కార్యం జ‌రుగుతుండ‌టంతో హ్యాపీ ఫీల‌వుతున్నారు కాంగ్రెస్ కార్య‌ర్త‌లు.

తిరుమలలో రోజా రాజకీయ వ్యాఖ్యలు.. వెల్లువెత్తుతున్న విమర్శలు?

తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధం. తిరుమల పవిత్రతను కాపాడడానికీ, అలాగే తిరుమల క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా ఉండడానికీ టీటీడీ ఈ నిబంధనను అమలు చేస్తున్నది. కోట్లాది మంది భక్తులు కుల, మత, రాజకీయ విభేదాలకు అతీతంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తుంటారు. అలా వచ్చే వారిలో సామాన్యుల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార వర్గాలకు చెందిన వారు ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే వారిలో ఎవరి నేపథ్యం ఎలాంటిదైనా.. తిరుమల కొండపై అందరూ శ్రీవారి భక్తులుగా మాత్రమే మెలగాలన్న ఉద్దేశంతో తిరుమల గిరిపై రాజకీయ ప్రసంగాలు, వ్యాఖ్యలపై నిషేధం విధించారు.   టీటీడీ ట్రస్ట్ బోర్డు ఈ విషయాన్ని  స్పష్టంగా పేర్కొంది. ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది.  తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.  అయితే మాజీ మంత్రి   రోజా ఆ నిబంధనలనూ, ఆంక్షలనూ తోసి రాజని తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేశారు.  జగనన్న మళ్లీ సీఎం కావాలని శ్రీవారిని తాను కోరుకున్నట్లు దర్శనానంతరం మీడియాతో చెప్పారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల కొండపై రోజా తన రాజకీయ ఆకాంక్షను మీడియా ముందు వ్యక్తపరచడం నిబంధనల ఉల్లంఘనేననీ, ఆమెపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.   తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం రోజాకు ఇదే మొదటి సారి కాదంటున్నారు. గతంలో అంటే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన తొలి రోజులలోనే తిరుమల కొండపై ఆమె చేసిన రాజకీయ వ్యాఖ్యలు దుమారం రేపాయి.  ఘోర పరాజయం తర్వాత కూడా ఆమె తీరులో ఎలాంటి మార్పు లేదని ఇష్టారీతిగా వ్యవహరించినా అడిగేవారు లేరన్న రీతిలో ఆమె తీరు ఉందని అంటున్నారు. టీటీడీ కేవలం హెచ్చరికలకు పరిమితం కాకుండా.. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేసిన రోజాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 

కేసీఆర్ ఆస్త్రసన్యాసమేనా?

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అస్త్రసన్యాసం చేసేశారా? ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాల హాజరు ఇక ముగిసిపోయిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీలో గళమెత్తేందుకు అధికారాలు అప్పగిస్తూ ఆయన చేపట్టిన నియామకాలను చూస్తుంటే ఔననే అనాల్సి వస్తోందంటున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా మాజీ మంత్రి హరీష్ రావును కేసీఆర్ నియమించారు. అంతే కాదు.. అసెంబ్లీ, మండలిలో   పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు  సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని  దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.  అసెంబ్లీలో హరీష్ రావు తో పాటు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లను డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమించారు.   సభా వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉన్న హరీష్ రావుతో పాటు, మహిళా, బీసీ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని సబితా ఇంద్రారెడ్డి, తలాసానిలకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. వీరు ముగ్గురూ సభలో పార్టీ పక్షాన కీలక అంశాలపై చర్చలలో పాల్గొంటారు. ఇక శాసనమండలిలో ఎల్. రమణ,  పి. సతీష్ రెడ్డిలను ఉప నేతలుగా నియమించారు. పార్టీ విప్ గా దేశపతి శ్రీనివాస్‌ను పార్టీ విప్‌గా నియమించారు. కేటీఆర్ కు ఎటువంటి బాధ్యతలూ అప్పగించకపోవడంపై పార్టీలోనే కాదు, రాజకీయవర్గాలలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీ లోపలా, బయటా కూడా అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవడంలో కేటీఆర్ వైఫల్యాల కారణంగానే ఆయనకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా అవకాశం ఇవ్వకుండా పక్కన పెట్టారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. అది పక్కన పెడితే.. కేసీఆర్ ఇక ఈ సమావేశాలు హాజరయ్యే అవకాశాలు లేవనడానికి ఈ నియామకాలే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు నియామకం

  అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా (డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా) మాజీ మంత్రులు హరీష్ రావు, పటోల్ల సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలిలో, బీఆర్ఎస్ పార్టీ శాసనమండలిపక్ష ఉప నేతలుగా (డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా) ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలను నియమించారు. మండలిలో పార్టీ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ని నియమించారు.  విప్ బాధ్యతలు సభలో సభ్యుల హాజరు, అధికార పార్టీ నేతల ప్రతిస్పందనలను సమీక్షించడం, పార్టీ విధానాలను అమలు చేయడం వంటి కీలక అంశాలను కవర్ చేయనున్నారు. కేసీఆర్ తన అసెంబ్లీ నాయకత్వానికి మద్దతుగా మధుసూదనాచారీని బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా కొనసాగించారు. శాసన పభ సమావేశాల్లో పార్టీ తొలి ప్రతినిధిగా మధుసూదనాచారీని కొనసాగించడం ద్వారా పార్టీ తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల అమల్లో కీలకంగా మారనుంది.