Read more!

హిమాచల్‌ప్రదేశ్: అకస్మాత్తుగా గేట్లు ఎత్తడంతో విషాదం

 

ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా, సమీప ప్రాంతాల వాసులను అప్రమత్తం చేయకుండానే లార్జి డ్యామ్ గేట్లను ఎత్తివేయడం వల్లనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సాధారణంగా హైడ్రో పవర్‌స్టేషన్‌లో స్వల్ప పేలుడు సంభవించినపుడు కూడా తక్షణం గేట్లు ఎత్తుతూ వుంటారు. అలాగే డ్యామ్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో అత్యధికమైతే తక్షణం గేట్లు ఎత్తి అధికంగా వచ్చి పడుతున్న నీటిని బయటికి పంపడానికి గేట్లు ఎత్తుతారు. అయితే గేట్లను ఎత్తేముందు వాకీటాకీల ద్వారా డ్యామ్‌కు సమీపంలో మూడు కిలోమీటర్ల వరకు సమీప ప్రాంత వాసులను హెచ్చరికలు జారీ చేయాల్సి ఉంటుంది. గేట్లుఎత్తే సమయంలో పెద్ద సైరన్ మోగించాల్సి ఉంటుంది. అలా హెచ్చరికలు జారీ చేయకపోవడం, సైరన్ మోగించకపోవడం వల్లే నది మధ్యలో వున్న విద్యార్థులు నీటి ప్రవాహం వస్తోందని తెలియక కొట్టుకుపోయారు. ఒకవేళ హెచ్చరికలు జారీ చేసినా, సైరన్ మోగించినా విద్యార్థులకు నీటి ప్రవాహం వస్తోందన్న విషయం తెలియకపోవడం వల్ల కూడా పట్టించుకుని వుండకపోవచ్చు.