Read more!

ఒక్కసారిగా నీటి ప్రవాహం వచ్చేసింది: ప్రత్యక్ష సాక్షి దివ్య

 

హిమాచల్ ప్రదేశ్‌ దుర్ఘటనను ప్రత్యక్షంగా చూసిన విద్యార్థులు షాక్‌లో వున్నారు. తమ స్నేహితులు 24 మంది ఒక్కసారిగా నీటిలోకి కొట్టుకుని పోవడాన్ని వీరు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. డ్యామ్ కింది భాగంలో తోటి విద్యార్థులు ఫోటోలు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం రావడంతో కొట్టుకుపోయారని సంఘటన స్థలంలో వున్న ప్రత్యక్ష సాక్షి, విజ్ఞానజ్యోతి కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దివ్య చెప్పారు. దుర్ఘటన దృశ్యాలు ఇప్పటికీ తన కళ్లముందే కదలాడుతున్నాయన్నారు. తోటి విద్యార్థులు నీళ్లలో కొట్టుకుపోవడంతో షాక్‌కు గురయ్యానన్నారు. ఈ నెల 3వ తేదీ రాత్రి 10.30 గంటలకు తామంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరామని ఆమె తెలిపారు. తాను క్షేమంగానే ఉన్నానని హైదరాబాద్‌లోని తన తండ్రి రవిందర్‌రెడ్డికి ఫోన్ ద్వారా తెలియజేశానని చెప్పారు.