Read more!

షాక్‌లో విద్యార్థులు.. ఆందోళనలో తల్లిదండ్రులు

 

హిమాచల్ ప్రదేశ్‌లోని లాల్జీ డ్యామ్ ప్రమాద ఘటనలో అప్పటి వరకూ తమతో కలసి నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా గడిపిన తమ సహచర విద్యార్థులు 24 మంది అకస్మాత్తుగా నీళ్ళలో కొట్టుకుపోవడంతో సంఘటన స్థలంలో వున్న మిగతా విద్యార్థులు షాక్‌కి గురయ్యారు. 24 మంది ఒకేసారి గల్లంతవడంతో మిగిలిన విద్యార్థులు, లెక్చరర్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సహచర విద్యార్థులు వరద ప్రవాహంలో కొట్టుకుపోవడంతో మిగిలిన విద్యార్థులు షాక్‌‌తో మాట్లాడలేకపోతున్నారు. ఇదిలా వుంటే, హిమాచల్ ప్రదేశ్‌లోని లాల్జీ డ్యామ్ ప్రమాద ఘటనతో విజ్ఞాన యాత్రకు వెళ్లిన విద్యార్థుల కుటుంబాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి. తమ పిల్లల నుంచి క్షేమసమాచారం అందని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తమ పిల్లల క్షేమ సమాచారాన్ని అందించాలని కోరుతున్నారు. బాచుపల్లిలోని కళాశాల దగ్గరకి విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.