Read more!

బాలికకు వేధింపులు.. ఆమె విషం తాగడంతో.. 

ఆమె తన కుటుంబంతో ఓ ఇంట్లో కిరాయికి ఉంటుంది. బతుకు దెరువుకోసం అమ్మ నాన్నలు చిన్న చితక ఉద్యోగాలు చేస్తున్నారు. కరోనా కారణంతో ఇంటి దగ్గరే ఉంటూ ఆన్లైన్ క్లాసులు వింటుంది..అమ్మనాన్న ఉద్యోగానికి వెళితే రాత్రి అయితే గానీ రారు. ఇంట్లో  ఒంటరిగా ఉన్న అమ్మాయి పై ఆ ఇంటి ఓనర్ కొడుకు మధుసూదన్ రెడ్డి కన్ను పడింది. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు.. అప్పటికి ఆ అమ్మాయి కుదరదు అని తెగేసి తేల్చి  చెప్పింది. ఆయినా వినలేదు ఆ నీచుడు.. ఆమె తండ్రి ఫోన్‌కు కాల్‌ చేసి, బాలికను మాట్లాడమని వేధించేవాడు. ఆమె తండ్రి డ్యూటీ నుంచి వచ్చే భార్యను తీసుకురావడానికి రోజూ వెళ్తాడు. ఆ సమయంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. విషయం తెలిసిన మధుసూదన్‌ రెడ్డి ఆ సమయంలో ఇంట్లోకి చొరబడి, తలుపులు మూసి బెదిరించి లై*గికదాడికి పాల్పడ్డాడు. ఆ తతంగాన్ని వీడియో కూడా తీశాడు. ఎవరికైనా చెబితే నీ తల్లిదండ్రులను చంపేస్తానని, వీడియోలు, ఫొటోలు బయటపెడతానని తరచూ లైంగికదాడికి పాల్పడేవాడు.

అతడి వేధింపులు భరించలేక ఆమె ఎదురుతిరిగింది. విషం తాగి చస్తా కానీ, లొంగనంటూ ప్రతిఘటించింది. అయినా, నిన్ను వదిలేది లేదంటూ.. కావాలంటే చచ్చిపో అంటూ విషం తెచ్చి ఇచ్చాడు. రోజూ అతడి చేతిలో చావటం కంటే, ఒకేసారి చనిపోదామని ఆ బాలిక విషం తాగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు తనపై జరిగిన దారుణాలను పోలీసులకు వివరిస్తూ కన్నీటి కన్నీరు కార్చింది. 

ఈ నెల 10న బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో మరోసారి లై*గికదాడికి యత్నించగా, ఆమె ప్రతిఘటించింది. బలవంతం చేస్తే నీ పేరు రాసి చచ్చిపోతానని బెదిరించింది. అయితే, మధుసూదన్‌ రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలో ఉన్న బాలిక దగ్గరకు వచ్చి ‘నాకు లొంగితే సరే.. లేదంటే చచ్చిపో’ అంటూ విషం బాటిల్‌ ముందు పెట్టాడు. దీంతో ఆమె విషం తాగింది. ఆమె పడిపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు సమీప ఆస్పత్రికి తరలించారు. బాలిక స్ప్రహలోకి రావడంతో పోలీసులు ఆమె వాంగ్మూలం తీసుకున్నారు. పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో ఆమె జరిగిన విషయం చెప్పడంతో పాటు నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరింది. జగద్గిరిగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.