మారువేషంలో ఆస్పత్రిలో తనిఖీలు చేసిన సూపరింటెండెంట్.. ఎక్కడో తెలుసా?

జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్   రమణ మారువేషంలో ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. ఒక పల్లెటూరి వృద్ధుడి వేషధారణలో ఆయన  రాత్రి వేళ ఆస్పత్రికి వచ్చి తనిఖీలు నిర్వహించారు.  ఆసుపత్రిలో రాత్రి వేళల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండటం లేదంటూ ఇటీవల జీజీహెచ్ పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో సూపరింటెండెంట్ ఈ తనిఖీ చేపట్టారు.

తన తనిఖీలలో  ఆసుపత్రిలో కొన్ని సమస్యలను ఆయన గుర్తించారు. వాటిని వెంటనే పరిష్కరిస్తానని చెప్పారు. కాగా ఆయన ఈ తనిఖీలో భాగంగా  ఎమర్జెన్సీ విభాగం, లేబరేటరి, సిటీస్కాన్, ఎంసీయూ, ఐసీయు వార్డులను  పరిశీలించారు.  వైద్యులు, సిబ్బంది పనితీరు పట్ల  సంతృప్తి వ్యక్తం చేశారు.

పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌కు ఘోర అవమానం

  ప్రధాని షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవడానికి 40 నిమిషాలు పాటు వెయిట్ చేశారు. ఎంతకీ ఆయనకు పిలుపు రాలేదు. దీంతో ఆయనే మీటింగ్ జరుగుతున్న రూముకు వెళ్లారు. అయినా కూడా పుతిన్ షరీఫ్‌ను పట్టించుకోలేదు. పది నిమిషాల తర్వాత ఆయన కోపంగా అక్కడినుంచి వెళ్లిపోయారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌కు ఘోర అవమానం ఎదురైంది. తుర్కిమెనిస్థాన్‌లో జరిగిన మీటింగ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ షరీఫ్‌ను అస్సలు పట్టించుకోలేదు.  పుతిన్, ఎర్డోగాన్ శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ కూడా వెళ్లారు. ఓ రూములో పుతిన్, ఎర్డోగాన్‌లు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు.  వారితో పాటు కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. అక్కడ షరీఫ్ లేరు. వేరే రూములో పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పుతిన్, ఎర్డోగాన్‌ల మధ్య మీటింగ్ మొదలై 40 నిమిషాలు పైనే గడిచింది. అయినా షరీఫ్‌కు పిలుపురాలేదు. దీంతో అసహనానికి గురైన షరీఫ్... పుతిన్, ఎర్డోగాన్ మీటింగ్ జరుగుతున్న రూముకు వెళ్లారు. రూములోకి ప్రవేశించి సోఫాలో కూర్చున్నారు.  అయితే, పుతిన్ కానీ, ఎర్డోగాన్ కానీ షరీఫ్‌ను పట్టించుకోలేదు. వారి మానాన వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. 10 నిమిషాలు గడిచాయి. అయినా ఆయనను ఎవ్వరూ పలకరించను కూడా లేదు. దీంతో షరీఫ్ కోపం కట్టలు తెంచుకుంది. అక్కడినుంచి గబగబా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  ఇక, ఈ సంఘటనపై ఆర్టీ ఇండియా స్పందిస్తూ... ‘ప్రధాని షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవడానికి 40 నిమిషాలు పాటు వెయిట్ చేశారు. ఎంతకీ ఆయనకు పిలుపు రాలేదు. దీంతో ఆయనే మీటింగ్ జరుగుతున్న రూముకు వెళ్లారు. అయినా కూడా పుతిన్ షరీఫ్‌ను పట్టించుకోలేదు. పది నిమిషాల తర్వాత ఆయన కోపంగా అక్కడినుంచి వెళ్లిపోయారు’ అని వెల్లడించింది.  రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పాటు ఇండియాలో పర్యటించారు. ఈ సందర్భంగా పుతిన్ ఎంతో సంతోషంగా కనిపించారు. ప్రధాని మోడీతో ఎంతో సన్నిహితంగా మెలిగారు. రెండు రోజుల పాటు సందడి సందడిగా గడిపారు. పర్యటన సందర్భంగా ఇద్దరూ చాలా సార్లు ప్రోటోకాల్స్‌ను బ్రేక్ చేశారు.  

తెలంగాణలో చలి పంజా...పడిపోతున్న ఉష్ణోగ్రతలు

  తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. అత్యంత కనిష్ఠ స్ధాయికి ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో ప్రజలు వణుకుతున్నారు. గత వారం అత్యల్పంగా  సగటున 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం, రాత్రి పొగ మంచు ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హైదరాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది.  గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏకంగా 28 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్‌ నమోదయింది. దీంతో గత పదేళ్ల రికార్డు (డిసెంబరు 12న ఇంత తక్కువ నమోదు కావడం) బద్దలైంది. దీంతోపాటు డిసెంబరు రెండోవారంలో ఎక్కువ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడం కూడా ఇదే తొలిసారని.. ఇంత తక్కువ గతంలో నమోదు కాలేదని వాతావరణశాఖ తెలిపింది.  హైదరాబాద్‌లో 10.8 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కన్నా 4.9 డిగ్రీలు తక్కువ. హనుమకొండలో ఏకంగా 7.4 డిగ్రీలు తగ్గి 8.5 నమోదైంది. ఆదిలాబాద్‌లో 5.6 డిగ్రీలు, మెదక్‌లో 6.5 డిగ్రీల మేర సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పడిపోయాయి.రాష్ట్రంలో శని, ఆది, సోమవారాల్లోనూ చలి తీవ్రత ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. చాలా జిల్లాల్లో 9.2 డిగ్రీల లోపు నమోదయ్యే అవకాశాలున్నాయని సూచించింది. శనివారం 20, ఆదివారం 13, సోమవారం 12 జిల్లాలకు ‘ఆరెంజ్‌’ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తంగా ఉండాలని సూచించారు.

సవితి తండ్రి చేతిలో... బాలుడి దారుణ హత్య

  హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచే సుకున్న ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇరుగు పొరుగు పిల్లలతో జరిగిన చిన్నపాటి గొడవ చివరకు ఓ 10 సంవత్సరాల బాలుడి ప్రాణాలు తీసిన విషాదకర ఘటనగా మారింది. స్థానికుల కథనం ప్రకారం, షేక్ మొహమ్మద్ అజహర్ (10) అనే బాలుడు పరిసరాల్లోని పిల్లలతో ఆడుకుంటూ గొడవకు దిగాడు. ఈ క్రమంలో “మీ పిల్లలను ఇలాగే పెంచుతారా?” అంటూ ఎవరో వ్యాఖ్యానించడంతో బాలుడి తండ్రి (సవితి తండ్రి) తీవ్ర ఆగ్రహానికి లోన య్యాడు. కోపంతో రెచ్చిపోయిన సవతి తండ్రి ఈ నెల 7వ తేదీన అజహర్‌ను రోడ్డుపైకి ఎత్తి బలంగా పడేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో బాలుడి తలకు తీవ్ర గాయాలు కాగా, అతడిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఇదిలా ఉండగా, మృతుడు అజహర్ కుటుంబ నేపథ్యంలో కూడా చర్చనీయాంశంగా మారింది.  అజహర్ తల్లి ,భర్త ఉండ గానే మరో వ్యక్తిని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నది. మొదటి భర్తతో కలిగిన సంతానమే అజహర్... రెండో వివాహం చేసుకున్న తర్వాత బాలుడు తల్లి దగ్గర ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో రెండో భర్త చేతిలోనే బాలుడు హత్యకు గురయ్యాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చాంద్రాయ ణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వైసీపీ ఎంపీలకు.... నిర్మల సీతారామన్ షాక్

  వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఎంపీలకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ప్రైవేటీకరణ కాదని, పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానంలో మాత్రమే చేస్తున్నారని నిర్మల సీతారామన్ ప్రశ్నించడంతో ఎంపీలు నిస్సత్తువకు లోనయ్యారు. ​ పీపీపీ అంటే ప్రైవేట్ కాదు: నిర్మల సీతారామన్ ​వైద్య కళాశాలల అంశాన్ని ప్రస్తావించినప్పుడు, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, "మేము మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం లేదు. మీరు అంటున్నట్టుగా అవి కేవలం పీపీపీ విధానంలో మాత్రమే కదా జరుగుతున్నాయి?" అని సూటిగా అడిగారు. ​దీనికి సమాధానంగా, వైసీపీ ఎంపీలలో ఒకరైన, జగన్ బాబాయి సుబ్బారెడ్డి, "అవును, అవి పీపీపీ పద్ధతిలోనే ఉన్నాయి" అని ధృవీకరించారు. వెంటనే నిర్మల సీతారామన్, "మరి అలాంటప్పుడు మీరు ప్రజల్లోకి వాటిని 'ప్రైవేట్' అని ఎందుకు చెబుతున్నారు?" అని ప్రశ్నించారు. ​ఎంపీలు ఏదో చెప్పబోతుండగా, "పీపీపీ అంటే ప్రైవేట్ కూడా ఉంటుంది కదా మేడం..." అని అన్న సమయంలోనే నిర్మల సీతారామన్ కలుగజేసుకున్నారు. "నో, నో. మీరు నన్ను దయచేసి తప్పుదోవ పట్టించవద్దు. మీరు ప్రజలను తప్పుదోవ పట్టినట్లుగా నన్ను కూడా చేస్తే ఎలా?" అని ఆమె గట్టిగా ప్రశ్నించారు.. నిర్మల సీతారామన్ నుండి వచ్చిన ఈ అనూహ్య ప్రతిస్పందనతో, వైసీపీ ఎంపీలు మరింత మాట్లాడలేక తెల్లమొహం వేసుకుని వెనుతిరిగారు.  

రేవంత్, మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ ...సీపీ కీలక ఆదేశాలు

  ఫుట్​బాల్​ అభిమానులకు ఈ నెల 13న పండగే పండగ. ఎందుకంటే ఫుట్​బాల్​ దిగ్గజ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్​లో మ్యాచ్​ ఆడబోతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి ఉప్పల్​ స్టేడియం వేదిక కానుంది. అయితే మెస్సీ పాల్గొనే మ్యాచ్​లో భద్రతాపరమైన లోపాలకు అవకాశం లేకుండా నిర్వహించాలని తెలంగాణ డీజీపీ శివధర్​రెడ్డి ఆదేశించారు. క్రీడాకారుడు లియోనల్​ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇమేజ్​, ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి మ్యాచ్​లో పాల్గొంటున్న దృష్ట్యా బందోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సూచించారు.  మెస్సీ ఫుట్​బాల్​ మ్యాచ్​ నేపథ్యంలో ఉప్పల్​ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను డీజీపీ గురువారం పర్యవేక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ నేపథ్యంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాసులు లేని వారు స్టేడియం వద్దకు రావద్దన్నారు. అలాగే ఆలస్యంగా వచ్చే వారిని స్టేడియంలోకి అనుమతించమని సీపీ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి , మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫుట్‌బాల్ మ్యాచ్ టికెట్లు కూడా హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి.   శుక్రవారం (ఈ నెల 12) మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచే ఈవెంట్ ఇది అని అన్నారు.శనివారం 7 గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మ్యాచ్ జరుగనుందని.. మ్యాచ్ సందర్భంగా అందరూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. స్టేడియం దగ్గర పాసులు అమ్మబడవని... ఇప్పటికే ఆన్‌లైన్‌లో పాసులను విక్రయించినట్లు చెప్పారు. పాసులు లేని వారు స్టేడియం వద్దకు రావద్దన్నారు. మెస్సీకి Z కేటగిరి భద్రత ఏర్పాటు చేశామని.. గ్రీన్ చానెల్ ద్వారా మెస్సీ ప్రయాణం చేస్తారని వెల్లడించారు. మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఉంటుందని.. టికెట్స్ లేని వారు ఇంట్లో ఉండి టీవీలో చూడాలని కోరారు.  మ్యాచ్‌కు వచ్చే వారు మూడు గంటల ముందే స్టేడియంకు చేరుకోవాలని... ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించమని స్పష్టం చేశారు. మ్యాచ్ కోసం వచ్చే వారు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించాలని సూచించారు. వ్యక్తిగత వాహనాలు తీసుకురావడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని తెలిపారు.వాహనాల పార్కింగ్ కోసం 34 ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి అందరి సహకారం అవసరమని సీపీ చెప్పారు.  ఎవరైనా అనుమతి లేకుండా మెస్సీని కలవాలి అని ప్రయత్నం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 3000 మంది పోలీసులు మ్యాచ్ కోసం భద్రత విధుల్లో ఉంటారన్నారు. డ్రోన్లు ద్వారా మ్యాచ్‌ను, భద్రతను పర్యవేక్షిస్తామన్నారు. 450 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. మఫ్టీలో కూడా అధికారులు ఉంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకుల కదలికలపై నిఘా పెడతారని వెల్లడించారు. నిషేధిత వస్తువులు స్టేడియం లోపలికి తీసుకు రావద్దన్నారు. మ్యాచ్ చూడటం కోసం వచ్చే మహిళా ప్రేక్షకుల కోసం షీ టీమ్స్ కూడా అందుబాటులో ఉంటాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.

ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు కేంద్రం నిర్ణయం

  కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు ఆమోదం తెలిపింది. ఇకపై పూజ్య బాపు గ్రామీణ్‌ రోజ్‌గార్ యోజనగా పేరు మారుస్తూ  కేంద్రం నిర్ణయం తీసుకుంది.  అలాగే పనిదినాల సంఖ్యను 100 నుంచి 125కి పెంచింది. ఒక రోజుకు ఇచ్చే కనీస వేతనాన్ని రూ.240కి సవరించింది. యూపీఎ సర్కార్ ఎన్‌ఆర్‌ఈజీఏ’ పథకాన్ని 2006లో ప్రారంభించింది. జనాభా లెక్కలు-2027కు ఎన్డీయే సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా పూర్తి డిజిటల్ పద్ధతిలో చేపట్టనున్న ఈ బృహత్ కార్యక్రమానికి రూ.11,718.24 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ ఆమోదముద్ర వేశారు. ‘కోల్  సేతు విండో’కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బొగ్గు గనుల రంగంలో సంస్కరణల కోసం నూతన పాలసీకి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. కొబ్బరి కి మద్దతు ధర ప్రకటించిన కేంద్ర కేబినెట్.. 2026 సీజన్‌లో క్వింటాల్ మిల్లింగ్ కొబ్బరి కి క్వింటాల్‌కు రూ. 445 రూపాయలు. బాల్  కొబ్బరి క్వింటాలుకు  400 రూపాయలు మద్దతు ధర పెంచింది. మిల్లింగ్ కొబ్బరి  క్వింటాలు ధర: 12,027 రూపాయలు, బాల్ కొబ్బరి ధర 12,500 ప్రకటించింది.   

సీఎం రేవంత్‌ను కలిసిన ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్

  భారత ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు, ఆర్థికవేత్త ప్రొ. అరవింద్ సుబ్రమణియన్ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 లో పాల్గొన్న  అరవింద్ సుబ్రమణియన్ తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ఆవిష్కరించి, అనుసరించడం ద్వారా రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధిస్తుందని చెప్పారు. ఈ సందర్బంగా ఆయనను ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించారు.ఈ భేటీలో సీఎంతో పాటు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తదితర అధికారులు ఉన్నారు. 

రాష్ట్రపతి తెలంగాణ పర్యటన... మినిస్టర్ ఇన్ వైటింగ్‌గా మంత్రి సీతక్క

  శీతాకాల విడిది కోసం  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో డిసెంబర్ 17 నుండి 22 వరకు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో   రాష్ట్రపతి పర్యటకు మంత్రి సీతక్క ‘మినిస్టర్-ఇన్-వైటింగ్’గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.. శీతాకాల విడిదిలో భాగంగా సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పటిష్టమైన భద్రత, ట్రాఫిక్, బందోబస్తు ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖను ఆదేశించారు. అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ టెండర్లు, ప్రత్యేక వైద్య బృందాలను నిరంతరం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.  

భార్యను కాపురానికి పంపడం లేదని మామను చంపిన అల్లుడు

  భర్త వేధింపులు భరించలేక  భార్య కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయింది... దీంతో ఆ భర్త ప్రతిరోజు అత్తగారింటికి వెళ్లి గొడవ పడుతూ చివరకు మామను హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని ఆమీన్పూర్ బీరంగూడలో నివాసముంటున్న చంద్రయ్య (58) అనే వ్యక్తి తన కూతురు లక్ష్మిని గత కొన్ని సంవత్సరాల క్రితం రామకృష్ణ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. వీరికి ముగ్గురు కూతుర్లు ,ఒక కొడుకు మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు... రామకృష్ణ మద్యానికి బానిస అయ్యాడు... ప్రతిరోజు పీకలదాకా మద్యం సేవించడం ఆ మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడడం చేస్తూ ఉండేవాడు. రామకృష్ణ తన కన్న కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న వెంటనే భార్య లక్ష్మి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భర్త రామకృష్ణ అత్తవారింటికి వచ్చి తరచుగా గొడవ పడుతూ ఉండేవాడు.  అల్లుడు రామకృష్ణ, భార్యను తిరిగి తమ కాపురానికి పంపడం లేదని అత్తమామలతో తరుచుగా గొడవ చేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపధ్యంలో గురువారం రాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న రామకృష్ణ మామ చంద్రయ్యతో గొడవపడ్డాడు.. ఇద్దరి మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది.  కోపంతో రగిలిపోయిన అల్లుడు రామకృష్ణ కత్తితో ఒక్కసారిగా మామ చంద్రయ్యపై దాడి చేసి  కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలతో చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి సమయంలో కుటుంబ సభ్యులు అడ్డుకు నేందుకు ప్రయత్నించగా, వారిని కూడా చంపేస్తానని రామకృష్ణ బెదిరించాడు.  మామను హత్య చేసిన అనంతరం అల్లుడు రామకృష్ణ అక్కడి నుండి పారిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే ఆమీన్పూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి... పరారీలో ఉన్న నిందితుడు రామకృష్ణ కోసం గాలింపు చర్యలు చేపడుతూ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు...  

బిల్లులందు పురుష బిల్లులు వేర‌యా!

  జాతీయ మ‌హిళా క‌మిష‌న్ గురించి మ‌నం వినే  ఉంటాం. అలాంటిదిపుడు జాతీయ పురుష క‌మిష‌న్ ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారు. డిసెంబ‌ర్ 6న రాజ్య‌స‌భ‌లో ఒక బిల్లు ప్ర‌వేశ పెట్టారు. ఈ బిల్లు ఉద్దేశం ఏంటంటే పురుషుల హ‌క్కుల సంర‌క్ష‌ణ‌, వారి సంక్షేమం వంటి విష‌యాల్లో ఈ బిల్లు  వారికి ఎంత‌గానో ఉప యోగ‌ప‌డుతుంది.  ఇంత‌కీ పురుషుల హ‌క్కులు అంటూ ఏవీ ఇప్ప‌టి వ‌ర‌కూ లేవు. మాన‌వ హ‌క్కులే పురుషుల హ‌క్కుల కింద‌కు వ‌స్తాయి. బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే కేటాయించేలాంటి  సీట్లు పురుషుల‌కంటూ ఉండ‌వు. ఇ ఇక రిజ‌ర్వేష‌న్ల‌లో ఓసీకంటూ ప్ర‌త్యేకించీ రిజ‌ర్వేష‌న్లుండ‌వు. ఎక‌నామిక‌ల్లీ బ్యాక్ వ‌ర్డ్ క్లాస్ ఎలాగో ఇది కూడా అలాంటిదేన‌ని చెప్పాల్సి వ‌స్తుంది.  అయితే,  ప్ర‌పంచ వ్యాప్తంగా  ప్ర‌స్తుతం మూడు ర‌కాల‌ జండ‌ర్లు త‌యారై కూర్చున్నాయి. ఒక‌ప్పుడు ఆడ మ‌గ మాత్ర‌మే ఉండేవారు. ఇప్పుడు థ‌ర్డ్ జండ‌ర్ ఒక‌టి త‌యారైంది. ఇక పురుషుడు అంటే ఎవ‌రు? అత‌డ్ని ఎలాంటి గుణ‌గ‌ణాల కొద్దీ డిసైడ్ చేస్తారు? అన్న‌ది కూడా చ‌ర్చ‌నీయంశ‌మే. ఈ విష‌యాల‌పై ఈ బిల్లు ద్వారా ఒక క్లారిటీ రావ‌ల్సి ఉంది. పురుషత్వం అంటే ఏమిటి? అన్న‌ది  కూడా ఒక‌ డిబేట‌బుల్ పాయింటే. ఇటీవ‌లి కాలంలో పుంస‌త్వ స్థాయిలు విప‌రీతంగా ప‌డిపోతూ వ‌స్తున్నాయ‌ని చెబుతున్నాయి కొన్ని గ‌ణాంకాలు.  దానికి తోడు రాన్రాను ఫిమేల్ డామినేష‌న్ పెరిగి మేల్ ఢ‌మాల్ అంటున్న ప‌రిస్థితి కూడా ఉంది. స‌హ‌జీవ‌నాలు పెరుగుతున్న ఈ కాలంలో, ఎల్జీబీటీ కి హై ప్ర‌యారిటీ ఇస్తోన్న ఈ సంద‌ర్భంలో.. పురుషుల హ‌క్కులు ప్ర‌శ్నార్ధ‌క‌మే. ప్ర‌స్తుత యువ‌త‌రం మాట అటుంచితే.. వీరి తండ్రుల త‌రంలో చాలా మంది భార్యా బాధితులున్నారు. వీరిపైన రివ‌ర్స్ లో గృహ‌హింస వంటి త‌ప్పుడు కేసులు పెడుతుంటారు. ఇలాంటి వాటిలో పురుష  క‌మిష‌న‌న్ ర‌క్ష‌ణ క‌ల్పిస్తుందేమో చూడాలి. ఆపై గ‌త ఐదేళ్ల కాలంలో ఐదు రాష్ట్రాల్లో 785 మంది భ‌ర్త‌లు త‌మ త‌మ భార్య‌ల చేతిలో హ‌త‌మ‌య్యారు. అది కూడా వారి  వారి ప్రియుల సాయంతో ఆయా భార్యామ‌ణులు త‌మ  త‌మ భ‌ర్త‌ల‌ను చంపేసిన ఘ‌ట‌న‌లు ఇటీవ‌లి కాలంలో బాగా వైర‌ల్ అయ్యాయి. ఈ క్ర‌మంలో పురుష  క‌మిష‌న్ ఏదైనా పురుషుల‌కు  ర‌క్ష‌ణ క‌ల్పించ‌ గ‌ల‌దా? అన్న‌ది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా పురుషాధిక్య ప్ర‌పంచంగా పిలిచే ఈ స‌మాజంలో పురుషుల హ‌క్కుల‌కే ర‌క్ష‌ణ  లేకుండా పోవ‌డం కూడా తీవ్ర విషాద‌క‌రం. చ‌ర్చ‌నీయాంశం కూడా.