ఇవివి సత్యనారాయణ జయంతి

 

 

 

 

తెలుగు సినిమాకు కమర్షియల్‌ కామెడీ అందించిన అతి కొద్ది మంది దర్శకులల్లో ఆయన ఒకరు.. జంద్యాల లాంటి మహామహులు అందిస్తున్న సున్నితమైన కామెడీకి దూరంగా ఆ కామెడీకి కాస్త స్పైస్‌ జోడించి తెలుగు తెరమీద నవ్వులు పువ్వులు పూయించిన దర్శకుడు ఇవివి సత్యనారాయణ.. రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా తన కంటచూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఇవివి గారి జయంతి సందర్భంగా ఆ నవ్వుల రారాజు జీవిత విశేషాలను తెలుసుకుందాం..


తెలుగు తెరకు మెమరబుల్‌ సక్సెస్‌లు అందించిన ఇవివి.. 1958 జూన్ 10న పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో జన్మించారు. 42 తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. హిందీలో అమితాబ్ నటించిన సూర్యవంశానికి కూడా దర్శకుడు ఈవీవీనే. ఈవీవీ తల్లిదండ్రులు వెంకటరావు, వెంకటరత్నం. భార్య సరస్వతి కుమారి. తరువాత ఆయన వారసులుగా ఇద్దరు కుమారులు ఆర్యన్‌ రాజేష్‌, అల్లరి నరేష్‌లను హీరోలుగా పరిచయం చేశారు..

 


1990లో చెవిలో ఫువ్వు సినిమాతో దర్శకత్వ అరంగేట్రం చేసిన ఇవివి...తొలి ప్రయత్నంలో అనుకున్న విజయం సాదించలేక పోయారు..కాని అదే ఏడాది ప్రేమ ఖైదీ చిత్రంతో మెగా హిట్‌ను దక్కించుకున్నారు. జంధ్యాల వద్ద కొన్నాళ్లు సహాయకుడిగా పనిచేసిన ఇవివి... ఇంద్రుడు-చంద్రుడు సినిమాలో పోలీస్ అధికారి క్యారెక్టర్ వేసి తనలోని నటున్ని కూడా పరిచయం చేశారు.



 వెరైటీ టైటిల్స్ పెట్టినా, గోదావరి యాస డైలాగులు పలికించినా, కామెడీ క్యారెక్టర్లన్నిటినీ వరసపెట్టి ఒకే సినిమాలో చూపించినా... అవన్నీ ఇవివికే చెల్లాయి. ఫిట్టింగ్ మాస్టర్.. బెండు అప్పారావు ఆర్‌ఎంపీ.. తొట్టిగ్యాంగ్.. దొంగల బండి.. ఎవడి గోల వాడిది.. వీడెక్కడి మొగుడండీ.. అదిరింది అల్లుడూ.. కితకితలు.. ఇలాంటి టైటిల్స్ విన్నప్పుడల్లా ఆయన మార్క్‌ కొట్టోచ్చినట్టుగా కనిపిస్తుంది, అదే ఇవివి స్టైలంటే.



ఇవివి తల్లిదండ్రులు స్థిరపడింది నిడదవోలు మండలం కోరుమామిడిలో. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఇవివికి చిన్నప్పటి నుంచే సినిమాలంటే విపరీతమైన ఇష్టం. టెన్త్ వరకూ బుద్ధిగానే చదివిన ఆయన నిడదవోలు కళాశాలలో ఇంటర్లో చేరాక... క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూసి చివరకు పరీక్ష తప్పారు.



తరవాత వ్యవసాయం కూడా కలిసి రాకపోవడంతో తనకు ఎంతో నచ్చిన సినీరంగంలో స్థిరపడాలనుకున్నారు ఇవివి.. అలా చెన్నై చేరిన ఆయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోన్నారు.. ఆ సమయంలో ఇండస్ట్రీలో బతకటం అంత ఈజీకాదు.. తిరిగి ఊరికి వెళ్లిపొమ్మని చెప్పిన వాళ్లు ఉన్నారు.. కాని ఆయన ఏ రోజు నిరాశపడలేదు.. తొలిసారిగా దేవదాసు కనకాల దర్శకత్వంలో రూపొందుతున్న ఓ ఇంటి భాగోతం సినిమాకు సహాయ దర్శకుడిగా జాయిన్‌ అయ్యారు..



అప్పటినుంచి ఇవివి వెనుదిరిగి చూడలేదు. ప్రముఖ దర్శకుడు జంధ్యాలకు శిష్యుడిగా మారిన తరువాత ఆయనకు తన గమ్యం ఏంటో, తను ఎంటు సినిమాలను తీయగలడో తెలుసుకున్నాడు. తొలి సినిమాతో నిరాశపడినా.. తరువాత రామానాయుడు నిర్మించిన ప్రేమఖైదీ చిత్రంతో ఇవివికి బ్రేక్‌ వచ్చింది. ఆ చిత్రం విజయవంతం కావటంతో ఇవివికి మంచి అవకాశాలు వచ్చాయి. జంధ్యాల కంటే కొంచెం ఘాటైన హాస్యాన్ని చిత్రాల్లో ప్రవేశపెట్టారు.



రాజేంద్రప్రసాద్ హీరోగా ఆ ఒక్కటీ అడక్కు, అప్పుల అప్పారావు, ఆలీబాబా అరడజను దొంగలు వంటి చిత్రాలు తీశారు. జంబలకిడి పంబ, సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది లాంటి చిత్రాల తరువాత మహిళలు మెచ్చిన తాళి, ఆమె వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.



అగ్ర నటులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో భారీ బ్లాక్‌ బస్టర్‌లను అందించారు ఇవివి. రంభ, ఊహ, ఆమని, రవళి వంటి నటీమణులతో పాటు పవన్‌కళ్యాణ్‌ను కూడా తెలుగు తెరకు పరిచయం చేశారు ఇవివి.  తరువాత తన వారసులుగా ఆర్యన్‌ రాజేష్‌, అల్లరి నరేష్‌లను హీరోలుగా పరిచయం చేసిన ఆయన వారిద్దరితో కూడా మంచి సక్సెస్‌ఫుల్‌ సినిమాలను అందించారు..



  ఇలా తెలుగు తెరకు ఎన్నో మరపురాని చిత్రాలు అందించిన ఇవివి సత్యనారాయణగారు భౌతికంగా మనతో లేకున్నా నవ్వు బతికున్నంత కాలం మనతోనే ఉంటారు.. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఆ కామెడీ కింగ్‌కు మరోసారి నివాళులర్పిద్దాం.

 

2015: A bad year of Tollywood

  Indeed, it is very bad year for Telugu Film Industry. It lost many talented actors, music directors, producers this year. Industry was so scared with their deaths that it even performed ‘Maha Mrutyunjaya Homam,’ but the deaths couldn’t be stopped till the last days of this year. Very few were passed away due to elderly age. Majority of them passed away unexpectedly in middle age while their career was in its peak position.   The tragic series has begun with sudden death of actor Ahuti Prasad in the very beginning of this year on January 4th. On the very next day, noted dialogues writer Ganesh Patro died. Then again in the same month producer VB Rajendra Prasad passed away on 12th. Film industry was shocked when hears about the sudden death of ace comedian MS Narayana on January 23rd.   Move Moghul and Dadasaheb Phalke Award winner Dr. Rama Naidu passed away on February 18th. And there was small interval in this tragic death series. It begins again in April month.   Young music director K Srinivas Chakravarthy, who is popularly known as Sri died on April 18th and within 48 hours noted audio designer Madusudhan Reddy died on 20th. And again on April 24th veteran producer Edida Nageswara Rao, who made many classic films passed away. Then, unfortunately Arti Agarwal, who proved her mettle as a great actress died while undergoing a surgery in USA on June 6th.   Veteran music director MS Viswanath passed away on July 14th. Film industry lost two veteran comedians in October. Kallu Chidambaram on 18th and Mada Venkateswara Rao on 24th. Young actor Prasahanth died accidentally on November 13th.   Veteran actor Ranganath, who spoke a lot about life and death, has committed suicide by hanging himself in his home on December 19th as he was very much upset with his beloved wife’s death few months earlier. While, the year is going to end shortly in few hours, young comedian Potti Rambabu suddenly died with brain stroke on December 28th.   This loss to film industry can’t be fulfilled in the near future as each and every one of them is very highly talented and great human beings as well. Let us hope, year 2016 will bless the Telugu Film Industry and gives success to all the people working in front of cameras and behind.

సైనా కేరెక్టర్లో అలియా భట్?

  క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా ఒక సినిమా రూపొందబోతోంది. ‘తారే జమీన్ పర్’ చిత్ర దర్శకుడు అమోల్ గుప్తే దర్శకత్వం వహించే ఈ సినిమాకి సైనా నుంచి అనుమతి కూడా లభించింది. ఈ సినిమా నిర్మాణానికి అనుమతి ఇస్తున్నట్టు సైనా ఫాదర్ ఇప్పటికే ప్రకటించారు. సైనా నెహ్వాల్ తన జీవిత కథ ఆధారంగా రూపొందే ఈ సినిమా దేశంలోని యువతరానికి క్రీడల మీద ఆసక్తిని పెంచేలా వుండాలని కోరుకుంటున్నట్టు సమాచారం. ఇదిలా వుంటే, ఈ సినిమాలో సైనా పాత్రని ఏ హీరోయిన్ ధరిస్తుందా అనే ఆసక్తి బాలీవుడ్‌లో భారీ స్థాయిలో నెలకొంది. ఈ పాత్రని తనసొంతం చేసుకోవడానికి ఎంతోమంది హీరోయిన్లు అర్రులు చాస్తున్నారని సమాచారం. ముఖ్యంగా పర్సనాలిటీ పరంగా సైనా నెహ్వాల్‌ తరహాలోనే వుండే అలియాభట్ సైనా పాత్రని ధరించడానికి భారీగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.