Read more!

ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య....

 

నెల్లూరులో బి.నాగశ్రావణి (20) అనేఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకి పాల్పడింది. తన హాస్టల్ గదిలోనే ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆమె మరణించింది. చదువులో రాణించలేకపోతూ వుండటం, ఎంత చదివినా తక్కువ మార్కులు వస్తూ వుండటం వల్లే మనోవేదన చెందుతూ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. నాగశ్రావణి నెల్లూరులోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతోంది. తనతోపాటు గదిలో ఉంటున్న మరో విద్యార్థిని రూమ్‌లోంచి బయటకి వెళ్ళినప్పుడు శ్రావణి తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందింది. అయితే శ్రావణి ముఖంపైన ఇబ్బందికరమైన మచ్చలుండటంతో సర్జరీ చేయించుకొందని, సర్జరీ అనంతరం కూడా ముఖం అందంగా రాకపోవడంతో తోటి విద్యార్థులకు తన ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకొని మరణించిందన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి.