తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.31 కోట్లు

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం(ఏప్రిల్ 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. సోమవారం (ఏప్రిల్ 22) శ్రీవారిని మొత్తం 62 వేల 894 మంది దర్శించుకున్నారు.

వారిలో 22 వేల 894 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 31లక్షల రూపాయలు వచ్చింది. 

Teluguone gnews banner