తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
posted on May 18, 2024 @ 9:43AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం (మే 18( శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.
ఇక శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 71, 518 మంది దర్శించుకున్నారు.
వారిలో 43199 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 63లక్షల రూపాయలు వచ్చింది.