ఈవీఎంలో డేటా సేఫ్ : సీఈవో ముఖేష్ కుమార్ మీనా
posted on May 22, 2024 @ 5:05PM
ఆంధ్రప్రదేశ్ పోలింగ్ రోజున మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని.. మాచర్లలో 7 ఘటనలు చోటుచేసుకున్నట్లు సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఘటనలన్నీ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించాం. ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉంది. దీంతో కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించాం. డేటా భద్రంగా ఉండడం వల్లే రీపోలింగ్ నిర్వహించలేదని వివరించారు.. ఈ కేసులో ఇంకా కొందరిని గుర్తించాల్సి ఉందని సీఈఓ తెలిపారు. ధ్వంసం ఘటలపై విచారణ ప్రారంభించామని చెప్పిన ఆయన.. సిట్కు పోలీసులు అన్ని వివరాలు అందించారన్నారు. ధ్వంసం ఘటనలపై విచారణ ప్రారంభించామని చెప్పిన ఆయన.. సిట్కు పోలీసులు అన్ని వివరాలు అందించారన్నారు. 20వ తేదీన రెంటచింతల కోర్టులో ఎస్ఐ మెమో దాఖలు చేయడంతో పాటు మొదటి నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పేర్కొనడం జరిగిందన్నారు. పది సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టినట్లు సీఈఓ వెల్లడించారు. దీంతో ఆయనకు ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందన్నారు.