ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

 

బ్యాంకు అకౌంట్లు తెరిచి ఇస్తే డబ్బులు ఇస్తాం.... బ్యాంక్ అకౌంట్లు ఇస్తే మనకెందుకు డబ్బులు వస్తాయని అనుకోవచ్చు.. కానీ ఇది నిజం ..కుబేర సినిమా తరహాలోనే  సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్ప డుతున్నారు.. ఈ సైబర్ నేరగాళ్లు అడ్డ మీద ఉన్న కూలీలను మాత్రమే టార్గెట్‌గా చేసుకొని వారికి డబ్బుల ఎరగా వేసి బ్యాంకు అకౌంట్లను  తెరిపిం చుకుంటున్నారు.


కొంతమంది వ్యక్తులు అయితే నేరుగా కూలీలు ఉండే అడ్డా వద్దకు వెళ్లి అక్కడ ఉన్న కూలీలతో మాటామంతి కలుపుతారు. బ్యాంకు అకౌంటు తెరిచి ఇస్తే మీకు డబ్బులు ఇస్తామని నమ్మిస్తున్నారు. ఇందు కొరకు మీ ఆధార్ కార్డు తీసుకొని రావాలని చెప్తారు... వారి మాటలు నమ్మిన కూలీలు డబ్బుల కోసం బ్యాంకు అకౌంట్లు తెరిచేం దుకు సిద్ధమవు తారు. 

 ఆధార్ కార్డు తీసుకొని వచ్చిన  కూలీలను నేరుగా బ్యాంకుకు తీసు కెళ్ళి బ్యాంకులో అకౌంట్ ని తెరిపి స్తారు.ఆ తరువాత ఈ ముఠా బ్యాంకు పాస్ బుక్కు, ఏటీఎం కార్డులు రాగానే వీటన్నిటిని కలెక్ట్ చేస్తారు... ఈ తతంగమంతా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరుగుతుంది... అవునండోయ్ ఇది నిజం... ఇలా కుబేర సినిమా తరహాలో మోసాలకు పాల్పడుతున్న నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న కూలీలే టార్గెట్

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అడ్డా మీద ఉన్న కూలీలను టార్గెట్ గా చేసుకొని వారికి డబ్బు ఆశ చూపించి బ్యాంకు అకౌంట్లను తెరిపి స్తున్నారు.ఆ తర్వాత పాస్ బుక్, ఏటీఎం కార్డులను నేరుగా కర్ణాటక కు పంపిస్తారు ..అది కూడా కేవలం  బస్సులోనే పంపిస్తారు. ఎవ్వరి కి కూడా ఇక అకౌంట్లు తెరిపిం చినట్లు తెలియదు.బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఇచ్చినందుకు ఈ మూట కూలీలకు డబ్బులు ఇస్తుంది. ఇక్కడతో వీళ్ళ పని అయిపోతుంది.


ఇప్పుడు అసలు కథ మొదలైంది.

 ఆ ముఠా నేరుగా ఒక కాల్ సెంటర్ ని ఏర్పాటు చేసుకోని ఈ బ్యాంకు అకౌంట్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తుంది. ఈ బ్యాంకు అకౌంట్లుల న్నింటినీ కూడా బెట్టింగ్ యాప్లకు కనెక్ట్ చేస్తారు.. ఈ బ్యాంకు అకౌంట్లోకి డబ్బులు వచ్చిన తర్వాత వాటిని క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత డబ్బు తీసుకొని వెళ్ళిపో తారు.. సైబరాబాద్ లోని ఎస్వోటీ పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం తో కర్ణాటకలో ఉన్న ముఠాపైన నిఘా పెట్టారు. ఈ ముఠా నేరుగా ఒక కాల్స్ సెంటర్ ని ఏర్పాటు చేసుకోనీ దాని ద్వారా బెట్టింగ్ యాప్స్ నిర్వహి స్తుంది

 ..బెట్టింగ్ యాప్ ల ద్వారా వచ్చే డబ్బులన్ని టిని కూడా అడ్డా మీద కూలీల ద్వారా ఓపెన్ చేయించిన అకౌంట్లోకి మళ్ళీ స్తారు ..ఆ అకౌంట్లోకి డబ్బులు రాగానే వీటిని క్లోజ్ చేస్తారు అయితే ఇప్పుడు వరకు దాదాపు ఒక సైబరాబాద్ పరిధిలోనే వందల కొద్దీ నకిలీ బ్యాంకు అకౌంట్లు తెరిపిం చినట్లుగా పోలీ సులు గుర్తించారు. నకిలీ ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫా రమ్‌ల ద్వారా అమాయకులను మోసం చేస్తున్న దొప్పలపూడి నవీన్‌ కుమార్‌, వంకద్రి సందీప్‌ కుమార్‌, చింతల పాటి ప్రుధ్వి రామ రాజు,చింతల పాటి పవన్‌ వెంకట నాగ భారద్వాజ్‌, మామిడి శెట్టి రామాంజనేయులుఅనే ఐదుగురు నిందితులను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సైబర్‌ క్రైమ్‌ పోలీసులు, ఎస్ఓటీ సిబ్బంది సంయుక్తం గా ఈ ఆపరేషన్‌ చేపట్టారు. నిందితులు నకిలీ గేమింగ్‌ యాప్‌లను రూపొందించి, ఆకర్షణీయమైన లాభాలు చూపిస్తూ బాధితులను మోసగించేవారని అధికారులు తెలిపారు. 

ఈ క్రమంలో బ్యాంకు ఖాతాలు, సిమ్‌ కార్డులు సైబర్‌ గ్యాంగ్‌కు సరఫరా చేసినట్లు విచారణ లో వెల్లడైంది.ఈ గ్యాంగ్‌ టెలిగ్రామ్‌, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా 120 కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను ఉపయోగించి నకిలీ లావాదేవీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. వీరు సత్యనారాయణ వర్మ అనే వ్యక్తి ఆధ్వర్యంలో పని చేసేవారని.... “Dodge book777” అనే గేమింగ్‌ పోర్టల్‌ ద్వారా డబ్బులు మళ్లించారని అధికారులు వెల్లడించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2 ల్యాప్‌టాప్‌లు, 30 మొబైల్‌ ఫోన్లు, 32 చెక్‌ బుక్స్‌, 23 ఏటీఎం కార్డులు, 48 సిమ్‌ కార్డులు, 14 లక్షల నగదు , సంబంధిత ఖాతాలను సీజ్‌ చేసినట్లు అధికా రులు తెలిపారు.ప్రజలు తమ OTPలు, PINలు, బ్యాంక్‌ వివరాలను ఎవరికీ ఇవ్వకూ డదని, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్‌లను ఉప యోగించకుండా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

   

ఒక్క పెగ్గు మద్యం కోసం సొంత అన్ననే చంపేశాడు!

ఒక్క పెగ్గు.. ఒక్కటంటే ఒక్క పెగ్గు కోసం విచక్షణ మరిచి సొంత అన్ననే మేడమీద నుంచి తోసేసి చంపేసిన తమ్ముడి ఉదంతమింది. మద్యపానానికి బానిసైన వారికి   తల్లీ, తండ్రీ, అన్నా, తమ్ముడూ, భార్యా, పిల్లలూ, స్నేహితులు.. ఇలా అన్ని సంబంధాలూ విచ్ఛిన్నమౌతాయి. కుటుంబం బంధాలలో చిచ్చు రేగుతుంది.  మద్యం వ్యసనానికి బానిసైన  వ్యక్తి విచక్షణ కోల్పోతాడు. చుక్క మద్యం కోసం ఉచ్ఛనీచాలనూ విస్మరిస్తారు. ఎంతకైనా తెగిస్తాడు. సరిగ్గా అలాంటి ఉదంతమే హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఒక్క పెగ్గు కోసం సొంత అన్ననే మేడ మీద నుంచి తోసేసి చంపేసిన తమ్ముడి ఉదంతం సంక్రాంతి పండుగ నాడు హైదరాబాద్ నాచారంలో చోటు చేసుకుంది.   నాచారంలో నివాసం ఉంటున్న ఇద్దరు అన్నదమ్ములు  సంక్రాంతి పండుగ సందర్భం గా గురువారం (జనవరి 15)ఆనందోత్సాహాలతో పతంగులు ఎగరవేసి సంబరం జరుపుకున్నారు. ఆ తరువాత రాత్రి ఒక ఇంటి భవనం మూడో అంతస్తులో  మద్యం సేవించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మద్యం తాగుతుండగా, ఒక్క పెగ్గు విషయంలో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. అది కాస్తా వారి మధ్య వాగ్వాదానికీ, ఘర్షణకూ దారి తీసింది.  అన్న తమ్ముడిని ఒక్క పెగ్గు మద్యం ఇవ్వాలంటూ అడగడంతో వివాదం మరింత ముదిరింది.  ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు అన్నను ఒక్కసారిగా  మేడపై నుంచి తోసివేశాడు.   మూడు అంతస్తుల భవనం పై తోసివేయడంతో కిందపడిన అన్న తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  నిందితుడైన తమ్ముడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మద్యం మద్యం మత్తే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.  సంక్రాంతి పండుగ రోజున చోటుచేసుకున్న ఈ విషాద ఘటనతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్న వివాదం ప్రాణాంతకంగా మారడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

110 ఏళ్లకు పెళ్లి .. ఏడాదికే బిడ్డ...142 ఏళ్లలో మృతి

  ఆరోగ్య రహస్యంతో అక్షరాలా 142 ఏళ్లు జీవించిన సౌదీ అరేబియా కురువృద్ధుడు షేక్ నాసర్ బిన్ రద్దన్ అల్ వదాయి ఇకలేరు. 110 పదేళ్లకు మూడో పెళ్లి చేసుకుని, ఆపై ఏడాదికే తండ్రిగా మారి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన ఆయన జీవితం ఒక అద్భుతంగా నిలిచింది. క్రమశిక్షణతో కూడిన ఆహారం, దైవచింతనతో 40 సార్లు హజ్ యాత్ర చేసిన ఈయన.. 134 మంది వారసులను వదిలి వెళ్లారు.  దాదాపు ఒకటిన్నర శతాబ్దం పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపిన సౌదీ ఓల్డెస్ట్ మ్యాన్ షేక్ నాసర్ బిన్ రద్దన్ అల్ వదాయి తాజాగా ప్రాణాలు కోల్పోయారు. సౌదీఅరేబియా దేశం ఏర్పడక ముందే ఆయన జన్నించారు. 110 ఏళ్ల వయసులో ఎవరూ ఊహించని విధంగా మూడో పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత ఏడాదికే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అంతేకాకుండా 40 సార్లు హజ్ యాత్ర చేసి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్య పరిచాడు.   35 - 40 ఏళ్ల దాటితేనే పిల్లల్ని కనడానికి అనేక మంది స్త్రీ, పురుషులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే.. షేక్ నాసర్ మాత్రం వందేళ్లు పైబడినా పిల్లల్ని కనడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా శారీరక దృఢత్వం, మానసిక చురుకుదనం, సంతాన సామర్థ్యం కలిగి ఉండటం చూసి వైద్య నిపుణులు, పరిశోధకులు సైతం విస్మయానికి గురయ్యారు. ఆయన దీర్ఘాయువు వెనుక ఉన్న రహస్యాలపై ఇప్పటికీ అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.  

ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

  ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మార్చి 10కి వాయిదా వేసింది. ఇంటరిమ్ ప్రొటెక్షన్ కొనసాగుతుందని, ప్రస్తుతానికి ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఇక అదనపు విచారణ అవసరం లేదని పేర్కొంది. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారని సిట్‌ను ప్రశ్నించింది. ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.  ఈ సందర్భంగా ప్రభాకర్‌రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వం తరఫున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. దీనిపై స్పందించిన జస్టిస్ నాగరత్న“ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఆయన్ని పిలవకుండా ఉండలేము కదా? మీ ఉద్దేశం పూర్తయిందా లేదా? ప్రభాకర్‌రావును మళ్లీ జైల్లో పెట్టాలనుకుంటున్నారా?” అని ప్రశ్నించారు.ఈ కేసు దర్యాప్తులో న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయని పేర్కొన్న ధర్మాసనం, ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకొని తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది.

ఏపీలో ఆ ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్

  ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై విధులకు కచ్చితమైన సమయానికి హాజరుకావాలని ఆలస్యంగా వస్తే ఆ రోజు వేతనంలో కోత విధిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా మెరుగైన సేవలు అందించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  ఈ సంస్కరణల ద్వారా సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సర్కార్ లక్ష్యమని తెలుస్తోంది. ఇటీవ‌లే ప్ర‌భుత్వం గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల పేర్ల‌ను సైతం మార్చింది. గ్రామ స‌చివాల‌యాల‌ను స్వ‌ర్ణ గ్రామాలుగా, వార్డు సచివాల‌యాల‌ను స్వ‌ర్ణ వార్డులుగా మార్చేందుకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు స‌చివాల‌య పాల‌న‌లోనూ మార్పులు తీసుకురావాల‌ని నిర్ణయించిన ప్ర‌భుత్వం ఆ దిశ‌గా ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటోంది. 

ఇండియన్స్.. ఇరాన్ నుంచి వచ్చేయండి.. కేంద్రం ప్రకటన

ఇరాన్ లో నివసిస్తున్న ఇండియన్స్ అందరూ వెంటనే వెనక్కు వచ్చేయాలంటూ భారత ప్రభుత్వం పిలుపు నిచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ.. ఇరాన్ లో భారతీయులు ఎవరూ ఉండొద్దు, వెంటనే వెనక్కు వచ్చేయాలనీ, అక్కడ ఉన్న ఇండయన్స్ ను వెనక్కు తీసుకురావడానికి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నామనీ పేర్కొంది.   ఇరాన్‌  ముస్లిం దేశమే అయినప్పటికీ,  సాంకేతిక‌త‌, వైద్య విద్య  తదితర అంశాలలో ముందంజలో ఉండటంతో భారత్ నుంచి అనేక మంది విద్యార్థులు అక్కడ విద్యనభ్యసించేందుకు వెడుతుంటారు. ఇక నిర్మాణ రంగంలో పని చేయడానికి కూడా పెద్ద సంఖ్యలో భారతీయులు ఇరాన్ వెడతారు.  కానీ ఇటీవ‌ల కాలంలో ఇరాన్  కరెన్సీ విలువ భారీగా పతనం అయ్యింది.  దీంతో అక్కడ ఆహార ప‌దార్థాలు స‌హా అన్నిటి ధరలూ మింటికెగశాయి. దీనికి తోడు అమెరికా నుంచి యుద్ధ భ‌యం కూడా  ఉండటంతో  ఇరాన్   ఇత‌ర దేశాల‌కు చెందిన వారిని ప‌నుల్లో నియ‌మించ‌రాద‌ని ఆంక్షలు విధించింది. దీనికి నిరసనగా ఇరాన్ లో ఆందోళనలను మిన్నంటాయి. ల‌క్ష‌లాది  రోడ్ల‌పైకి వ‌చ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలను విధ్వంసానికి దారి తీస్తున్నాయి. దీంతో నిరసనకారులపై ఇరాన్ కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఆ దేశంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించింది. ఇరాన్ నిరసనకారులపై కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకూ  12 వేల మందికి పైగా నిర‌స‌న కాల్పుల్లో హతమయ్యారు ఇక అమెరికా రంగంలోకి దిగి నిరసనకారులకు మద్దతు ప్రకటించింది. తద్వారా దేశంలో హింసను రెచ్చగొట్టేలా ప్రకటనలు గుప్పిస్తోంది. నిరసనలు కొనసాగించాలనీ, నిరసనకారులకు పూర్తి సహకారం అందిస్తామనీ, భద్రత కల్పిస్తామని అగ్రదేశాధినేత ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఇరాన్ లో సంక్షోభం మరింత తీవ్రతరమయ్యే పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో, ఆ దేశంలో ఉన్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే భారతీయులందరూ వెంటనే  స్వదేశానికి వ‌చ్చేయాల‌ని పిలుపునిచ్చింది. ప్ర‌త్యేక విమానాల ఏర్పాటు షెడ్యూల్ ను నేడో, రేపో ప్రకటించనుంది. 

జగ్నన్న తోట ప్రభల తీర్థం.. ప్రత్యేకతలు.. విశిష్టతలు!

దేశమంతా జరుపుకునే పండుగ సంక్రాంతి .. ప్రాంతాన్ని బట్టి పండుగ ఒక్కో విధంగా జరుపుకుంటారు.  ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వారు సంక్రాంతి పండుగను తమదైన శైలిలో జరుపుకుంటారు. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్రాంతి పండుగ తరువాత వచ్చే కనుమ పండుగ కోససీమ వాసులకు ఒక అద్భుత ప్రత్యేక తీర్థాన్ని తీసుకువస్తుంది. కొబ్బరాకుల పందిరి వేసినట్లుండే కోనసీమలో కనుమ రోజున జరిగే జగ్గన్న తోట తీర్థానికి ఒక ప్రత్యేకత ఉంది.   ఈ జగ్గన తోట తీర్థాన్ని జగ్గన్న తోట ప్రభల తీర్థంగా కూడా అంటారు. పచ్చని పంటపొలాల మధ్య జరిగే తిరునాళ్ళ బంధానికి శతాబ్దాల చరిత్ర ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది.  అసలింతకీ ఈ జగ్గన్న తోట తీర్ధం ప్రత్యేకతలు, విశిష్ఠతలు ఏంటంటే..  కోనసీమ చుట్టుపక్కనున్న సుమారు 90 గ్రామాల నుంచి జనం ఈ ప్రభలతీర్థంలో పాలుపంచుకుంటారు. అమలాపురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న మొసలపల్లి-ఇరుసుమండ గ్రామాల సరిహద్దులో ఉన్న ఏడెకరాల కొబ్బరితోటలో ఈ ప్రభల తీర్థం జరుగుతుంది. ఈ తోటని జగ్గన్న తోటగా పిలుస్తారు. ఇక్కడ ఏ గుడీ ఉండదు. దేవునికి సంబంధించిన ఏ చిహ్నాలూ కనిపించవు.   భూ మండపంలో జరిగే ప్రకృతి వేడుక ఈ ప్రభల తీర్థం. శివుని వాహనంగా భావించే వీరభద్రునిగా కోనసీమ వాసులు ఈ ప్రభలని కొలుస్తారు. చుట్టుపక్కల గ్రామాల్లోని పరమేశ్వర రూపాలతో ఈ ప్రభలని అలంకరించి మేళ తాళాలతో  తమ భుజ స్కంధాలపై మోస్తూ ఊరేగింపుగా ఈ జగ్గన్న తోటకి తీసుకొస్తారు. ఈ ప్రభలని వెదురు కర్రలతో చేసి, రంగు రంగుల వస్త్రాలతో, పూలతో అలంకరించీ, వేదమంత్రాల మధ్య గంటలు మ్రోగిస్తూ మోసుకు వస్తారు. కుల మతాలకతీతంగా ఈ ప్రభలను జనం మోస్తారు. అలా మోయడం ఈశ్వర  సేవగా భక్తులు భావిస్తారు.  నాలుగు శతాబ్దాలుగా  ఈ జగ్గన్నతోట ప్రభల తీర్థం జరుగుతోందంటారు.  ఈ ప్రభల తీర్థానికొక  గాధ కూడా వుంది. మొసలపల్లి గ్రామంలో ఉన్న భోగేశ్వర స్వామి వారి ఆహ్వానంపై చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పరమేశ్వర ప్రతీకలైన ప్రభలు తరలివస్తాయనీ, లోక కళ్యాణార్థమై వారందరూ ఇక్కడ కలుస్తారని ప్రజల విశ్వాసం. దీన్ని ఏకాదశ రుద్రసమావేశంగా భక్తులు భావిస్తారు. ఈ ప్రభల తీర్థానికి జగ్గన్నతోట ప్రభల తీర్థమన్న పేరురావడానికీ ఒక కారణం ఉందంటారు.   మొసలపల్లి గ్రామ సమీపంలో విఠల జగ్గన్న అనే  వ్యక్తి ఆ గ్రామాన్నానుకుని ప్రవహించే కౌశికలో స్నానం చేసీ, పూజాపునస్కారాలు ముగించుకొని అక్కడే ఉన్న మర్రి చెట్టు కింద భోజనం చెసేవాడట. అలా చేస్తూ ఈ చెట్టునానుకున్న అమ్మ వారిని మైల పరుస్తున్నాడని భావించిన స్థానికులు అప్పటి నిజాం నవాబు ప్రతినిధులకి ఫిర్యాదు చేశారట. దీంతో  వాళ్ళు ఈయన్నిఅడ్డుకుని నిజాం నావాబు వద్దకు తీసుకెళ్లారట. ఆ సందర్భంగా ఈ జగ్గన్న   పాండిత్యాన్ని చూసి మెచ్చుకొని ఆ మర్రిచెట్టుతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న నాలుగువందల ఎకరాలు బహుమానంగా రాసిచ్చారట. తనపై ప్రజలు ఫిర్యాదు చేయబట్టే తనకీ భూమి లభించింది కాబట్టి వారికోసమే జగ్గన్న ఈ ప్రభల తీర్థం జరిపాడని అంటారు.  దేవుడికీ గుళ్ళూ గోపురాలూ అవసరం లేదనీ, మైలా మాపూ ఉండదనీ పదిమందికీ చెప్పడంకోసం ఈ ప్రభలపై దేవుణ్ణి ఎవరైనా మోసుకు రావచ్చని చెప్పేందుకే  ఈ తీర్థం మొదలయ్యిందనీ అంటారు. ఈ ప్రభలు ప్రజలు నడిచే దారంట రావు. రాళ్ళూ, రప్పలూ తోసుకుంటూ, గోతులనూ, కుప్పలనూ దాటుకుంటూ పొలాల మధ్యగా ఈ ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. చుట్టు పక్కల గ్రామాల నుండి ప్రభలు మోసుకు రావడమొక్కటే దీని ప్రత్యేకత కాదు. ఈ తీర్థానికి మరొ విశేషం  కూడా వుంది. అదేమిటంటే పాలగుమ్మి పక్కనే ఉన్న గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం గ్రామ ప్రభలు పీక  లోతు కౌశిక ప్రవాహాన్ని దాటుకుంటూ, పొలాల మధ్య నుండి వస్తాయి. ఈ ప్రభలు కౌశిక దాటడం చూడ్డం కోసం వేలాది మంది తరలి వస్తారు. ఒకసారి ఎత్తిన తరువాత  ఈ ప్రభలను  కిందకి దింపకూడదు. మోసేటప్పుడు నేలని తాకించకూడదు. కౌశిక దాటేటప్పుడు ప్రభ ఏ మాత్రం తడవ కూడదు. నీటి చుక్క కూడా ప్రభ మీదా, పైనున్న దేవుడి మీదా పడకూడదు.   గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం గ్రామ ప్రభలను ఎంతో ఏకాగ్రతతో ఏ మాత్రం కంగారు లేకుండా జాగ్రత్తగా కౌశిక దాటించి జగ్గన తోట తీర్థ ప్రదేశానికి చేరుస్తారు.  తీర్థమయ్యాక వచ్చిన దారినే తిరిగి ప్రభలని ఆయా గ్రామాలకి తీసుకెళతారు. ఈ ప్రభలు ఎంతో బరువు ఉంటాయి. అయినా వాటిని అవలీలగా దాటించగలగడం మాత్రం ఈశ్వరానుగ్రహం వల్లనేనని చెబుతారు వాటిని మోసే వాళ్లు.  మొత్తంగా శతాబ్దాలుగా జరుగుతున్న ఈ జగ్గనతోట ప్రభల తీర్ధం వైభవం ఎంత చెప్పినా తక్కువే. 

నిఘా సంస్థల డైరెక్టర్ జనరల్‌‌లను మార్చిన కేంద్రం

  జాతీయ దర్యాప్తు సంస్థ.. ఎన్‌ఐఏ  కొత్త డైరెక్టర్ జనరల్‌ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎన్‌ఐఏ డైరెకర్ట్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేష్ అగర్వాల్‌ను నియమించింది. ఆయన ఈ పదవిలో 2028 ఆగస్టు 31 వరకు కొనసాగనున్నారు. హిమాచల్‌ క్యాడర్‌కు చెందిన అగర్వాల్‌ 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం ఎన్‌ఐఏలో స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఏసీసీ సమావేశం ఈ నియామకాన్ని ఆమోదించింది. ఎన్‌ఐఏ మాజీ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ ను మహారాష్ట్ర కేడర్‌కు పంపింది. దీంతో ఎన్ఐఏ డీజీగా అగర్వాల్‌కు పదోన్నతి లభించింది. ఏజెన్సీతో అగర్వాల్ కు సుదీర్ఘ అనుబంధం ఉంది. అలానే సంక్లిష్ట దర్యాప్తులను నిర్వహించడంలో అనుభవం ఆయన తాజా నియామకానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.  ఎన్ఐఏతోపాటు బీఎస్‌ఎఫ్, ఐటీబీపీలకు కొత్త డైరెక్టర్‌ జనరళ్లనూ కేంద్రం నియమించింది. సీనియర్‌ ఐపీఎస్‌ శతృజీత్‌ సింగ్‌ కపూర్‌ను కేంద్రం ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ డీజీగా నియమించింది. ప్రస్తుతం ఐటీబీపీకి నేతృత్వం వహిస్తున్న ప్రవీణ్‌ కుమార్‌ను బీఎస్‌ఎఫ్‌ కొత్త చీఫ్‌గా నియమించింది.

జన నాయగన్ రిలీజ్ వాయిదా.. విజయ్‌కు చేదు అనుభవం

  దళపతి విజయ్ కు ఈ సంక్రాంతి చేదు అనుభవాన్ని మిగిల్చింది. అతను నటించిన చివరి సినిమా 'జన నాయగన్' విడుదల మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సినిమా విడుదలకు ఆదేశాలు జారీ చేయమంటూ నిర్మాతలు సుప్రీమ్ కోర్టు తలుపు తట్టగా, అత్యున్నత న్యాయస్థానం ఇప్పుడున్న పరిస్థితిలో ఈ కేసులో తాము జోక్యం చేసుకోమని తేల్చి చెప్పింది.  దాంతో పిటీషనర్ తరఫు న్యాయవాది రోహత్గి ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని, వీలైనంత త్వరగా తీర్పు ఇచ్చేలా చూడమని న్యాయమూర్తులకు విన్నవించుకున్నారు. రోహత్గి అభ్యర్థన మేరకు ఈ కేసును మద్రాసు హైకోర్టు లోనే తేల్చుకోమని, అయితే ఈ నెల 20లోగా తీర్పును వెలువర్చమని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మషి పేర్కొన్నారు. మద్రాస్ సింగిల్ బెంచ్ జడ్జ్ ఇచ్చిన ప్రతికూల తీర్పుపై సి.బి.ఎఫ్.సి. ద్విసభ్య ధర్మాసనంకు వెళ్ళింది. కేసును ప్రాధమికంగా విచారించిన న్యాయమూర్తులు సినిమా విడుదల అనుమతిపై స్టే విధించి, కేసును ఈ నెల 20కు వాయిదా వేశారు. దాంతో 'జన నాయగన్' నిర్మాత సుప్రీమ్ కోర్టు కు వెళ్ళి తమకు న్యాయం చేయమని కోరారు.  కానీ అక్కడ కూడా వారికి చుక్కెదురై తిరిగి ఈ వ్యవహారం చెన్నయ్ హైకోర్టు డివిజన్ బెంచ్ కోర్టులో పడినట్టు అయ్యింది. ఈ లోగా రివైజింగ్ కమిటీ సినిమాను చూసి ఎలాంటి సూచనలు చేస్తుందో చూడాలి. వాటిని నిర్మాతలు అంగీకరిస్తే, సినిమా ఇదే నెలలో జనం ముందుకు వచ్చే ఆస్కారం ఉంది. ఒకవేళ కోర్టు కూడా సుప్రీమ్ కోర్టు సూచనలను అనుసరించి, 20వ తేదీకి తుది తీర్పు ఇచ్చినా... ఈ నెల 23వ తేదీ లేదా 30న 'జన నాయగన్' జనం ముందుకు రావచ్చు.  

ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్‌

  ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలు పార్టీ మారారనడానికి తగిన ఆధారాలు లేవని అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. గత నెలల్లో పార్టీ ఫిరాయింపుకు సరైన ఆధారాలు లేవని ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  మరోవైపు కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్‌కుమార్ తమ అనర్హతపై ఇంక సభాపతికి వివరణ ఇచ్చుకోలేదు. బీఆర్ఎస్‌ పార్టీ నుంచి గెలిచి..  10మంది ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని.. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని.. ప్రతీ నెలా బీఆర్ఎస్‌ఎల్పీకి చందాలు చెల్లిస్తున్నామని తెలిపారు. ఇక నియోజకవర్గ అభివృద్ధి కోసమే.. సీఎం రేవంత్‌ను కలిశామని వారు తెలిపారు  

కడపను తాకిన కోస్తా కోడి కత్తి...కొక్కరోకో అంటున్న కోడిపందాలు

  కోడిపందేలు అంటే కోస్తా గుర్తుకొస్తుంది. పందెం రాయుళ్ళు తెలుగు రాష్ట్రాలనుంచి అక్కడికి చేరుకొని సంక్రాంతి కోడిపందేలతో జోష్ మీద ఉంటారు...ఈ సారి కోస్తా కోడి కత్తి కడపకు చేరింది. భీమవరం, అమలాపురం లాంటి ప్రాంతాల్లో ఆడే కోడి పందేలు కడపజిల్లా లోను కోత లేస్తున్నాయి. లక్షలకు లక్షల పందేలు తో సంక్రాంతి రోజున కోళ్ళ పందేలు జోరుగా జరిగాయి. కోడిపందేలు ఆడకుండా చర్యులు తీసుకోవాలని కోర్టులు చెప్పినా , కోడిపందాలు ఉండకూడదన్న నిభంధనలున్నా  పలుచోట్ల మాత్రం కోడి కత్తులు ఆడాయి.ఈ ప్రాంతంలో  సుశిక్షితులైన పందె ఆర్గనైజర్ లు లేక పోవడంతో కొందరు కోస్తా నుంచి ఆర్గనైజర్ లను రప్పించి నట్లు సమాచారం. జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా కోడిపందాలు ఆడించడం ,పందెం రాయుళ్లు, వాటి తిలకించేందుకు వచ్చే వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జిల్లాలో ఆసక్తికరంగా మారింది *నేతలే అండగా ! ఉమ్మడి కడప జిల్లాలో యధేచ్చగా కోడి పందేలు సాగాయి. అధికార నేతల  అండతో ప్రత్యేక బరులు ఏర్పాటు చేసి మరీ కోడి పందేలు నిర్వహించారు.పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలో, పులివెందులలో కోడిపందాలు టిడిపి నేతలే ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది.పులివెందుల నియోజక వర్గంలో వేంపల్లి, లింగాల మండలాల్లో కోడిపుంజులు కాలు దువ్వాయి.  లింగాల మండలం దొండ్ల వాగులో భీమవరం నుంచి ఆర్గనైజర్లతో కోడి పందేలు ఆడించినట్లు సమాచారం. కొన్ని చోట్ల కోడి పందేలతో పాటు ఇతర ఆటలు ఆడించినట్లు గా తెలుస్తోంది.వేముల మండలం భూమయ పల్లె, పార్నపల్లి ,అలవలపాడు, పాములూరు, ఎర్రబెల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడిపందాలు జరిగాయి.రాజంపేట అత్తిరాల అమగంపల్లె, పుల్లంపేట ప్రాంతాల్లో జోరుగా కోడిపందాలు జరిగినట్లు సమాచారం. *ఆటగాళ్ళు కు సదుపాయాలు. ఆటగాళ్లకు సకల సదుపాయాలు కల్పించారు. ఒక్కో ఆట రెండు నుంచి ఐదు లక్షలు పలికినట్లు తెలుస్తోంది. తాడిపత్రి కదిరి తదితర  ప్రాంతాల నుంచి పులివెందుల, రాజంపేట లకు పందెంకాసేవారు, జూదరులు రావడం జరిగింది..సంక్రాంతి ఆటవిడుపు గా అని చెబుతున్న నేతలు పండుగ సంబరాల మాటున కోస్తాకు దీటుగా భారీ మొత్తంలో  కోడి పందేలు నిర్వహించడం కడప జిల్లాలో సంక్రాంతి కోస్తా కోడి పందేలను తలిపించింది. *పోలీసు ఆంక్షలను లెక్క పెట్టకుండా పోలీసు ఆంక్షలను లెక్క చేయని పందెం రాయుళ్లు యదేచ్చగా ఆటసాగించారు. కొన్ని చోట్ల కోళ్ల పందేలు ప్రత్యేక వీడియో షూట్ చేసి మరీ ఆడించడం జరిగింది. *పోలీసుల దాడులు  కోస్తా బరుల కు తీసిపోని రీతిలో కోడి పందేలు జరగడంతో వీటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. కొండాపురం మండలం ఓబన్న పేట గ్రామ పొలాల్లో కోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించి ఆరుగురు అరెస్టు చేశారు. టీ.కోడూరు కోడి పందేల స్థావరంపై దాడి చేసి ఆరుగురు అరెస్టు చేశారు. మొత్తంగా జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో కోడిపందాలు జరగడం గమనార్హం.