ఏపీలో కరోనా విలయతాండవం! 33 మంది మృతి!
posted on May 2, 2020 @ 12:38PM
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 62 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 24 గంటల్లో 5,943 శాంపిళ్ల పరీక్ష చేయగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,525 నమోదైంది. ఇప్పటివరకు 441 మంది డిశ్చార్జ్ కాగా 33 మంది మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 5,943 శాంపిళ్లను పరీక్షించగా 62 మందికి కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,525గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 441 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారని వివరించింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,051గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 4, తూర్పు గోదావరిలో 3, గుంటూరులో 2, కడపలో 4, కృష్ణాలో 12, కర్నూలులో 25, నెల్లూరులో 6, ప్రకాశంలో 1, విశాఖపట్నంలో 4, పశ్చిమ గోదావరిలో 1 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.