ఏరియల్ సర్వే కాదు.. రియల్ సర్వే చేయాలి...

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈమధ్య కాలంలో నాలుగైదుసార్లు వివిధ ప్రాంతాల్లో ఏరియల్ సర్వేలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేలు కాకుండా రియల్ సర్వేలు చేస్తే బాగుంటుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సూచించారు. ఏరియల్ సర్వేల ద్వారా కాకుండా ప్రజల మధ్యకి వెళ్తే వారి సమస్యలు తెలుస్తాయని ఆయన అన్నారు. గగనతల పర్యటనలు తప్ప ముఖ్యమంత్రి తెలంగాణకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని అన్నారు. కేసీఆర్ తాను చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పొన్నాల దుయ్యబట్టారు. సీఎం వరంగల్ పర్యటన చేసిన సందర్భంగా ఎవరినీ కలవకుండా ఆంక్షలు అమలు చేయడం సరికాదని అన్నారు.

Teluguone gnews banner