జగన్ దీక్ష.. చచ్చిపోతామంటే అనుమతిస్తామా.. చంద్రబాబు
posted on Sep 25, 2015 @ 11:52AM
సింగపూర్ పర్యటన అనంతరం తిరిగి వచ్చిన చంద్రబాబు ఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగిందని.. ఏపీకి న్యాయం చేయాలని.. విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. అంతేకాదు ఇరు రాష్ట్రాల మధ్య తెలత్తిన సమస్యలను పరిష్కరించాలని కోరామని అన్నారు. భూసేకరణ ద్వారా ఏపీ రాజధాని కోసం 50వేల ఏకరాల భూమిని సేకరించామని.. ఈ భూములను డీనోటిఫై చేయాలని.. అంతేకాదు తిరుపతి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా కొన్ని భూములను కూడా డీనోటిఫై చేయాలని అడిగినట్లు, అందుకు మంత్రి సానుకూలంగా ప్రతిస్పందించినట్లు ఆయన తెలిపారు. కాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైకాపా అధినేత జగన్ దీక్షకు పూనుకున్ననేపథ్యంలో దాని గురించి మాట్లాడుతూ.. దీక్షకు అనుమతి ఇచ్చేది లేదంటూ.. చచ్చిపోతామంటే అనుమతి ఇస్తామా అని చంద్రబాబు.