Read more!

చింతకాయల విజయ్ కు సీఐడీ నోటీసులు

టీడీపీ యువ నేత చింతకాయల విజయ్ కు ఏపీ సీఐడీ  మళ్లీ నోటీసులు జారీ చేసింది. సామాజిక మాధ్యమంలో ఏపీ సీఎం జగన్ సతీమణి  వైఎస్ భారతికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన కేసులో ఈ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 28వ తేదీన  విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో నోటీసుల్లో పేర్కొన్నారు.

నర్సీపట్నంలోని విజయ్ నివాసానికి వెళ్లి  సీఐడీ అధికారులు  ఆ  సమయంలో విజయ్ అక్కడ లేకపోవడంతో ఆయన తండ్రి, మాజీ మంత్రి  అయ్యన్న పాత్రుడుకి నోటీసులు అందజేశారు.

అయితే చింతకాయల విజయ్ కు మరో సారి సీఐడీ నోటీసులపై తెలుగుదేశం శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి.  కక్ష సాధింపుల్లో భాగంగానే నోటీసులు ఇస్తున్నారని విమర్శిస్తున్నాయి.