జగన్ ఒక ఉన్మాది... చింతమనేని తీవ్ర వ్యాఖ్యలు

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టిన వాడెవడూ రాజధాని అమరావతిని మార్చాలని కోరుకోడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులకు మద్దతుగా దీక్షలో పాల్గొన్న చింతమనేని ప్రభాకర్.... రాజధాని మార్పు కోరుకుంటున్నవారిపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఒక ఉన్మాది... దుర్మార్గుడని... ప్రజలందరిలో ఇదే అభిప్రాయముందన్నారు. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా, వైసీపీ అడ్రస్ గల్లంతవుతుందంటూ చింతమనేని జోస్యం చెప్పారు. ఇక, జగన్ తన ఇంటి పేరును రివర్స్ అని పెట్టుకుంటే బాగుంటుందంటూ సెటైర్లు వేశారు. రాజధాని అమరావతి తరలింపు కేవలం 29 గ్రామాల సమస్య కాదని... మొత్తం రాష్ట్రం సమస్య అన్నారు. అమరావతి నుంచి రాజధానిని మార్చితే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు.

Teluguone gnews banner