నేడు తేలనున్న విద్యుత్ ఛార్జీల పెంపు భవితవ్యం
posted on Apr 4, 2013 9:03AM
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటు స్వపక్షంలోనూ అటు విపక్షంలోనూ విద్యుత్ సర్ ఛార్చిల వసూలు విమర్శలు ఎదుర్కొంటున్న కిరణ్ కుమార్ రెడ్డి నేడు మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, మంత్రులు, విద్యుత్ ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఛార్జీల పంపుదాలను సమీక్షిస్తామని, గత ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచిన తరువాత స్వల్పంగా తగ్గించారు. 150 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు కొంతమేర ఛార్జీలు తగ్గించాలని మంత్రులు కోరుతున్నారు. ఈ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకోలేకపోతే రేపు మళ్ళీ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది.