చంద్రబాబు షిర్డీ సందర్శన
posted on May 16, 2024 @ 6:11PM
ఎన్నికల ప్రచారం పూర్తయిన వెంటనే తిరుమల వేంకటేశ్వరుడిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. పోలింగ్ పూర్తయిన వెంటనే ఆయనకు ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాశీకి వెళ్ళే అవకాశం లభించింది. ఇప్పుడు ఆయన సతీ సమేతంగా షిర్డీ సాయిబాబాను సందర్శించుకున్నారు. ఆయన ఏ దేవాలయానికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించే ప్రార్థిస్తారు. ఆయన ప్రార్థనలు ఫలించి దుర్మార్గపు ప్రభుత్వం అంతరిస్తే అంతకంటే కావల్సింది ఏముంటుంది?