అఖిల్ ఆడియో లాంచ్.. వేలు చూపిస్తూ హిరోయిన్ కు అఖిల్ వార్నింగ్
posted on Sep 21, 2015 @ 4:02PM
వి.వి వినాయక్ దర్శకుడిగా.. హీరో నితిన్ హీరోగా అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని నటిస్తున్న సినిమా "అఖిల్" ఆడియో ఫంక్షన్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రిన్స్ మహేశ్ బాబు ముఖ్య అతిధిగా విచ్చేసి ఆడియో ఆవిష్కరణ చేశారు. అయితే ఈ ఆడియో ఫంక్షన్ అంతా బాగానే ఉన్నా ఒక గమత్తైన అంశం ఒకటి చోటుచేసుకుంది. అందేంటంటే "అఖిల్" సినిమాలో అఖిల్ సరసన నటిస్తున్న హీరోయిన్ సాయేషాని మన హీరో కనుసైగతోనే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆడియో ఫంక్షన్ లో యాంకర్ సుమా హీరోయిన్ సాయేషాను డ్యాన్య్ చేయమని అడుగగా.. అందుకు హీరోయిన్ అఖిల్ ను కూడా స్టేజ్ పైకి రమ్మని పిలిచింది. అంతే అఖిల్ ఒక్కసారిగా వేలు చూపిస్తూ.. కనుసైగతోనే హీరోయిన్ ను వార్న్ చేసి ఆతరువాత స్మైల్ చేసి కవర్ చేసేశాడు. దీంతో పాపం అమ్మడు ఏం చేస్తుంది ఒక్కతే డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. మొత్తానికి అఖిల్ హీరోయిన్ ను బాగానే కంట్రోల్ లో పెట్టాడని అనుకుంటున్నారు.