తనను కూడా నాలుగు పీకి బాధ్యతలు నేర్పమన్న నాగబాబు
posted on Mar 26, 2020 @ 12:18PM
నాగబాబు మళ్ళీ యాక్టివ్ అయిపోయారు. ప్రజలు హక్కులే కాదు, బాధ్యతల గురించి కూడా మాట్లాడటం, వాటిని అలవాటు చేసుకోవటం నేర్చుకోవాలని ట్విట్ట్టర్ వేదికగా సూచించాడు. " ఒక న్యూస్ ఛానెల్ లో ఎవరో ప్రొఫెసర్ దాస్ గారు అన్నమాట నాకు చాలా నచ్చింది."మనం ప్రజలకి హక్కులు నేర్పాము.బాధ్యతలు నేర్పలేదు"అక్షర సత్యం ...ఈ తప్పు ప్రభుత్వం వారిదే.మా జనాలకి బాధ్యతలు నేర్పే టైం వచ్చింది.నేను కూడా అతితుడ్ని కాదు.మా ప్రజలందరికీ తన్ని బాధ్యతలు నేర్పించండి.నేర్చుకుంటాం..." అంటూ అయన చేసిన ట్వీట్, బాధ్యత రహితంగా ఉండే ప్రజానీకానికి హెచ్చరికలా , ఆయన ట్వీట్ పని చేస్తుందని ఆశిద్దాం.