తెలంగాణ అసాధ్యం!

 


- ఎబికె ప్రసాద్
{సీనియర్ సంపాదకులు]

 

 

తెలుగుజాతిని విచ్చిత్తి లక్ష్యంగా రాజకీయ నిరుద్యోగులు, 'చేతబడి' రాజకీయాలూ కొన్నాళ్ళుగా ప్రారంభించి కొనసాగిస్తున్న 'ప్రత్యేక తెలంగాణా' ఉద్యమం ప్రస్తుతం చీలబాటలు పట్టింది. తెలుగుజాతిని చీల్చబోయి ఉద్యమమే రెండు మూడు పాయలుగా బద్దలైంది. ఇందులో ఒక 'పాయ'కు కాంగ్రెస్ నాయకత్వంతో లోపాయికారీగా మిలాఖత్ అయిన తన టి.ఆర్.ఎస్. పార్టీ రానున్న (2014) ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తుంది, అటు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ తో గాని, ఇటు బి.జె.పి.తో గాని, కమ్యూనిస్టు (సి.పి.ఐ.) పార్టీతో గానీ ఎలాంటి పొత్తుపెట్టుకోకుండానే పోటీ చేస్తుందని 'బొబ్బిలిదొర' కెసిఆర్ ప్రకటించాడు.

 

 కాగా, మొదట్లో కెసిఆర్ తో కలిసి ప్రొఫెసర్ కోదండరామ రెడ్డి ఏర్పాటు చేసిన సంయుక్త కార్యాచరణ సంఘం, ఇప్పుడు బయటికి ప్రకటించకపోయినా కె.సి.ఆర్. వర్గానికి దూరంగా ఉంటూ సొంత ఎజెండాతో ఉద్యమం పేరిట ఢిల్లీలో "జంతర్ మంతర్''లో గత నెల 29న "రెండురోజుల'' సత్యాగ్రహం తలపెట్టింది. అయినా కేంద్రప్రభుత్వం "తెలంగాణా రాష్ట్రం'' ఏర్పాటుకోసం ఎలాంటి ఆసక్తి కనబరచకపోవటంతో కోదండం వర్గం హతాశులై తిరిగి ఇంటికి చేరింది. ఇక జంతర్ మంతర్ 'దీక్ష'కు మద్ధతు పలికిన పార్టీలు, నాయకులు ఎవరు? తాడూ బొంగరం లేని పక్షాలు. పది-పదిహేను ఏళ్ళ నాడు కాకినాడ సభలో తెలంగాణా ఏర్పాటుకు హామీపడి, తీరా కేంద్రంలో తన ప్రభుత్వం ఏర్పరచి అయిదేళ్ళు కొనసాగించుకున్న బిజెపి-ఎన్.డి.ఎ. పరివార్ ముఠా ఆ హామీని అమలుపరచకుండా తప్పుకుంది. అయినా బిజెపి ఈసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే (ఆ అవకాశాలు కన్పించడంలేదు) గిస్తే మూడు మాసాల్లోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని మరోసారి 'మాట' వదిలింది.



ఇక "దీక్ష"కు మద్ధతు పలకడానికి వచ్చిన వారిలో - ఒకే ఒక పార్టీ సభ్యుడిగాను, అధ్యక్షుడుగానూ మిగిలిపోయిన "జనతా పార్టీ'' నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి ఒకడు. ఇతడు భారత రాజేకీయాల్లో ఆధునిక శకుని! ఇక కోదండం వర్గానికి మద్ధతు తెల్పడానికి చేరినవారిలో మరో వ్యక్తి భారత కమ్యూనిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం ప్రతాప రెడ్డి ఒకరు. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించడమేగాక బ్రిటిష్-నిజాం పరాయి పాలనల మూలంగా చెల్లాచెదురై పరాయి పంచాల్లో బతుకులీడ్చిన ప్రాచీన చరిత్రగల తెలుగుజాతినంతటినీ ఏకంచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణకు కారకులయిన కమ్యూనిస్టు పార్టీ తరువాతి కాలంలో రాజకీయంగా పతనం కావడం, ఆ పతన రాజకీయంలో భాగంగా ఉనికికోసం తెలంగాణా వేర్పాటువాదాన్ని భుజాన వేసుకోవడంతో ప్రజలలో విశ్వాసం కోల్పోయింది. శాసనవేదికలో ప్రాతినిధ్య పరంగానూ అతి బలహీనశక్తిగా మనుగడ సాగిస్తూ వచ్చిన పార్టీకి సురవరం కార్యదర్శి!


 కాంగ్రెస్ ప్రభుత్వం (కేంద్రం)లో భాగస్వామిగా ఉన్న పవార్ ఎన్.సి.పి. పార్టీ సంఖ్యాపరంగా బలహీనమైన పక్షం. కోదండం దేక్షకు మద్ధతిలిచ్చిన బాపతు బలం ఇదీ! "తెలంగాణా వాదాన్ని బలంగా చాటేందుకు'' హస్తినకు చేరిన సంసద్ యాత్ర అలా ముగిసింది! కాంగ్రెస్ లో టి.ఆర్.ఎస్.ను విలీనం చేయడానికి సిద్ధమైన కెసిఆర్ పార్టీకి చెందిన మరొక "నోటి దురుసు'' వ్యక్తి ఈటెల "కాంగ్రెస్ కు గోరీ'' కడతామని ప్రగల్భించాడు! 'ఈటెల'వారు సంసద్ యాత్రలో పాల్గొన్నది తెలంగాణా రాష్ట్రం కోసం కాదు, కెసిఆర్ పెంచుకున్న "పలుకుబడి''ని కాస్తా కోదండం కొట్టేయకుండా "చెక్'' చేయడానికే గాని మరొకందుకు కాదు. ఇక వేర్పాటు ఉద్యమానికి మద్ధతు పలికిన మరొక పార్టీ 'లెటర్ హెడ్' పార్టీగానే మిగిలిపోయిన ఫార్వర్డ్ బ్లాక్!




ఇక వేర్పాటువాదానికి మద్ధతు చెబుతున్న ఈ అమాం బాపతు రాజకీయ నిరుద్యోగులు రేపటి ఎన్నికలకోసం ప్రజలకు చేస్తున్న వాగ్దానాలు, ఇస్తున్న హామీలూ కోటలు దాటిపోతున్నాయి. వీళ్ళందరి నినాదం ఒక్కటే - "సీమాంధ్రుల దోపిడీ నుంచి విముక్తి పొందడమే లక్ష్యం''! కాని ప్రాంతీయ పెట్టుబడిదారుల దోపిడీ నుంచి విమోచన పొందేది ఎప్పుడో వీళ్ళు చెప్పరు. ఈ చిల్లర మల్లర రాజకీయ నిరుద్యోగులందరికి - తెలంగాణలో దశాబ్దాలుగా తిష్ఠవేసి తెలంగాణా దళిత బహుజన వర్గాల ప్రజల మూల్గుల్ని పీల్చిపిప్పిచేసిన దొరలు, జాగిర్దార్లు, భూస్వామ్య స్థానిక పెట్టుబడిదారులతో పాటు అదే దోపిడీకి, దోపిడీ రాజకీయాలకూ నాయకత్వం వచించిన మహారాష్ట్ర, పంజాబీ, రాజస్థానీ, సింధీ, కర్ణాటక పెట్టుబడుదారులు తమ శ్రేయోభిలాషులై తోటి సహోదర సహోదరులయిన తెలుగుప్రజలు కాకుండా పోయారు! దూరదృష్టిలో కొరవడిన ఈ దుర్మార్గపు రాజకీయానికి పునాదులన్నీ - వేర్పాటువాదులు తమ స్వార్థప్రయోజనాల కోసం తలపెట్టిన విషప్రచారంలోనే ఉన్నాయి. తెలంగాణలోనూ, ఇతర తెలుగు ప్రాంతాలలోనూ ఉన్న తెలుగువారంతా శాతవాహనుల కాలంనుంచీ ఆదాన ప్రదానాలుగా అటువాడు ఇటూ, ఇటువారు అటూ వలసపోయిన ప్రవాసులూ, నివాసులేనని మరవరాదు!


"పచ్చని తెలంగాణా రాష్ట్రం నా కల'' అని ఎన్నికల నినాదంగా చేపట్టిన కె.సి.ఆర్. పుట్టుపూర్వాలన్నీ "అమ్మ పుట్టిల్లు మేనమామకెరుక'' అన్నట్టుగా ఉత్తరాంధ్ర ప్రజలకు బాగా తెలుసు. అందువల్ల ఇతగాడు ఉద్దేశించిన లక్ష్యం అధికారం కోసం తన "కుటుంబ పచ్చదనమే'' గాని తెలంగాణా ప్రాంత పచ్చదనం మాత్రం కాదని! జాతిని చీల్చే విద్వేష ప్రచారంగాని, ప్రజల ఐక్యతను భంగపరిచే ప్రకటనలుగానీ, మత విద్వేష ప్రచారంగానీ రాజ్యాంగ విరుద్ధచర్యలుగా భావించి అలాంటి వారిని శిక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధైర్యంతో ముందుకు రావాలని కొలది రోజులనాడే (ఏప్రిల్ లో) సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని మరవరాదు. ఒక వైపున పంటలు కోల్పోయి, అప్పులపాలైన రైతులు, మరొక వైపున చేనేతకారులు అనేకమంది తెలంగాణలో కూడా ఆత్మహత్యలు చేసుకొంటూండగా పట్టించుకోని కెసిఆర్, కోదండం వర్గం, ఇంకొక వైపున విద్వేష ప్రచారం ద్వారా అక్కరకు రాణి హామీలపైన యువతలో ఆశలు రెచ్చగొట్టి వారిని ఆత్మహత్యలకు పురిగొల్పారు. ఈ పాపంనుంచి తప్పుకొనే మార్గం లేకనే ఇప్పుడు కుడితిలో పడిన ఎలుకల్లా కొట్టుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం రాకపోతే తమను స్థానిక ప్రజలు బతకనివ్వరన్న భయం వారిని వెంటాడుతోంది కాబట్టే కాలుకాలిన పిల్లుల్లాగా హైదరాబాద్ నుంచి హస్తినకు ఢిల్లీ నుంచి హైదరాబాదుకూ 'బరాట్లు' కొడుతున్నారు.



ఈ సందట్లోనే ఉస్మానియా ఆచార్యుడు, దళితమేధావి అయిన కంచి ఐలయ్య ఒక ప్రకటనలో [11.04.2013] "తెలంగాణా ఉద్యమం పేరుతొ కెసిఆర్ రూ. 50 వేలకోట్లు కూడబెట్టుకున్నారని బాహాటంగా ఆరోపించడం యువతలో సంచలన కారణమవుతోంది. ఈ పరిస్థితుల్లో కెసిఆర్ ప్రజల దృష్టిని మళ్ళించడంకోసం 2014లో జరిగే ఎన్నికలు "మధ్యంతరంగానే రేపో మాపో వస్తా''యన్న ప్రకటనలతోనూ "త్వరలో మరికొందరు ఇతర పార్టీల ఎం.ఎల్.ఎ.లు టి.ఆర్.ఎస్.లో చేరనున్నారన్న చిట్కాలతోనూ కాలక్షేపం చేస్తున్నాడు! ఇది కె.సి.ఆర్. 'ఒంటరి' పోరాటంతో చేస్తున్న 'తుంటరి' రాజకీయం తప్ప మరొకటి కాదు! ఈ భాగోతం యిలా వుండగా, కాంగ్రెస్ లో తన టి.ఆర్.ఎస్. పార్టీని కలిపివేయడానికి రెండు నెలలనాడు ఢిల్లీలో హామీపడి వచ్చిన ఈ 'చేతబడుల' రాజకీయవేత్త అందుకు విరుద్ధంగా తన రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్ పైన వ్యతిరేక ప్రచారాన్ని పూర్తిగా వదులుకోలేక పోతున్నాడు. ఈ 'గోడదూకుడు వ్యక్తిని తమకిచ్చిన మాటనుంచి తప్పుకోజూడడాన్ని అనుమానించిన కేంద్రనాయకత్వం ఇప్పుడు కె.సి.ఆర్. ఆస్తులపైన కూడా సి.బి.ఐ. ద్వారా ఆరా తీయిస్తున్నట్టు ఢిల్లీ నుంచి "సూర్య'' దినపత్రిక ప్రత్యేక ప్రతినిధి పంపించిన భారీ వార్తను ప్రచురించి రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది!


ఈ కూపీలో భాగంగానే ఆ పత్రిక కేసిఆర్ మరొక స్థానిక బడా పట్టుబడిదారుడైన ఒక 'ఘరానా'తో కలిసి ఒక దినపత్రికను ఒక ఛానెల్ ను నెలకొల్పడంపైన ఆ పత్రిక యజమానికి కెసిఆర్ కి ఉన్న వ్యాపార సంబంధాల గురించి కూడా సిబీఐ దర్యాప్తులోకి దిగనున్నట్టు రాసింది. దోపిడీ వ్యవస్థను కాపాడుకోగోరే పెట్టుబడీదారీ వర్గాలు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నా వారి దోపిడీ స్వభావం మారదు. కాని ఒక దోపిడీదారు మరొక దోపిడీదారుతో లాభాపేక్షతో పోటీపడుతున్నప్పుడు ఒక్కో సందర్భంలో వారి మధ్య ఘర్షణ 'కపట కలహంగా' తలెత్తుతూ ఉంటుంది! కాని దోపిడీ స్వభావంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోని భూస్వామ్య పెట్టుబడి వర్గాల మధ్య తేడా ఉండదు. కాని రాజకీయాలలోకి దిగి 'రాజకీయ నిరుద్యోగులు'గా ఉండే ఒక ప్రాంతపు పెట్టుబడిదారీ వర్గ ప్రతినిధులు మాత్రం ఇతర ప్రాంతాలకు చెందిన దోపిడీదారుల దోపిడీని మాత్రమే ఉదాహరిస్తూ "కపట కలహం'' తో ప్రజలమధ్య చిచ్చుపెట్టి ఐక్యతను విచ్చిన్నం చేయడానికి వెనుకాడరు.




ఆ అధికార దాహంతోనే ప్రాంతీయ భూస్వామ్య పెట్టుబడివర్గాలకు నాయకత్వం వహిస్తున్న కెసిఆర్ ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంకోసం స్వార్థపూరిత ఉద్యమాన్ని నిర్మించి 'సీమాంధ్రుల దోపిడీని నుంచి తెలంగాణాను విముక్తి చేయడం' తన లక్ష్యంగా ప్రకటించి, "సీమాంధ్రులను తరిమికొట్టండి'' వారి "ఆస్తిపాస్తుల్ని, ఇళ్లను స్వాధీనం చేసుకోండి "పరిశ్రమలనుంచి వారిని తరిమేస్తే, ఉద్యోగాలన్నీ తెలంగాణా యువతకే దక్కుతాయి'', "మధ్యలో ఉద్యమాన్ని ఆపేశామా సీమాంధ్రులు మనల్ని బతకనివ్వరు, చంపేస్తారు'' అంటూ నోటికొచ్చిన బజారు కూతలతో సామాన్యప్రజలనూ, నిరుద్యోగ విద్యార్థులనూ రెచ్చగొడుటూ నినాదాలు యిచ్చాడు. ఈ పరిణామం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బ తీయడానికీ, ఏ సోదర సీమాంద్రులపై కెసిఆర్ తన స్వార్థం కోసం కత్తికట్టాడో తిరిగి ఆ సీమాంధ్రలోని డిగ్రీ కళాశాలకు, వృత్తి కళాశాలలకూ ప్రాంతంలోని మన తెలుగుపిల్లలూ, ఇతర రాష్ట్రాల పిల్లలూ చదువుల కోసం వలసపోవలసి వచ్చింది; ఇతగాడి ప్రవర్తన మూలంగా కొన్ని పారిశ్రామిక సంస్థలూ, ముఖ్యంగా కొన్ని ఐ.టి. కంపెనీలు మూతపడి, వేలాదిమంది యువకులు, ఉద్యోగాలూ ఉపాధి కోల్పోవలసి వచ్చింది.



 ఆ మాటకొస్తే సీమాంధ్ర పెట్టుబడిదారులకే కాదు, మన తెలంగాణాలోని పెట్టుబడిదారులకూ ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత బడా బడా "ఫామ్ హౌస్''లూ "విలాసక్షేత్రాలూ'' (ఫామ్ హౌస్ లు)ఉన్నాయి. అవి ఉభయత్రా రాజకీయ మంత్రంగాలకూ కేంద్రాలు; ఇక హైదరాబాద్ లోని సినిమా పరిశ్రమ ఉనికి అంటారా, ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఎన్.టి.రామారావు కంటే చాలా ముందుగా తెలుగు సినిమా పరిశ్రమను మద్రాసునుంచి హైదరాబాద్ కు ఆహ్వానించిన తొలి ముఖ్యమంత్రి మన తెలంగాణాకు చెందిన సమర్థమైన పరిపాలనా దక్షుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డిగారేనని మరిచిపోయి కెసిఆర్ వర్గం కళ్ళున్న కబోధి పాత్ర వహిస్తే ఎలా?!

ఎటుతిరిగీ ముఖ్యమంత్రి హోదా కోల్పోయిన తరువాతనే కాంగ్రెస్ రాజకీయ కుమ్ములాటల్లో చెన్నారెడ్డి తన నిరుద్యోగ బాధ తనకు దుస్సహమై తిరిగి అధ్కారంలోకి రావడంకోసం "తెలంగాణా ప్రజాసమితి''ని ఏర్పాటు చేసి వేర్పాటు ఉద్యమానికి బీజాలు నాటాడు. ఆ చరిత్ర తెలుగుప్రజలు మరచిపోలేరు! అలాగే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాతనే దోపిడీకాండలో భాగాస్వాములయిన మన తెలంగాణాలోని భూస్వామ్య-పెట్టుబడిదారుల కనీసం 20 మంది దాకా ఎంతలేదన్నా ఒక్కొక్కరు రూ.500 కోట్లనుంచి రూ.4,000కోట్ల వరకూ విలువగల ఆస్తులు ఏ రూపంలోనైతేనేమి కూడబెట్టుకున్నవారేనని ప్రాంతీయ సామాజికశాస్త్రవేత్తల అంచనా!
 

ఈ క్రమంలో, ప్రొఫెసర్ కంచి ఐలయ్య టి.ఆర్.ఎస్. నాయకుడు 'బొబ్బిలిదొర' కె.సి.ఆర్. మన తెలంగాణలో కూడగట్టుకున్న ఆస్తుల విలువ (రూ. 50,000 కోట్లు) [పమీ అతిగా ఉన్న అంచనా అని అనుకున్నా "ఇంటర్నెట్'' సమాచారం ప్రకారం గుజరాత్ నుంచి (కాండ్లా రేవునుంచి వ్యాపార లావాదేవీల్లో భాగంగా కెసిఆర్ నడుపుతున్నాడని చెబుతున్న ఎందు షిప్పులు) హైదరాబాద్ వరకూ అతనికి ఉన్న ఆస్తుల విలువ రూ.6,000 కోట్లు అని అంచనా! తల దాచుకోడానికి కేవలం 75 గజాల స్థలం కోసం తెలంగాణా పేదసాదలు పడిగాపులు పడుతూన్న దశలో 75 ఎకరాల్లో ఫాం హౌస్ కట్టుకోడానికి సాహసించిన 'ఉద్యమ' నాయకుడు రేపు మన తెలంగాణలో అధికారంలోకి వస్తే దళిత బహుజన, పేద, మధ్యతరగతి వర్గాలకు, యువతకూ ఏదో తవ్వి తలకెత్తుతాడను కోవడం కేవలం భ్రమ మాత్రమేనని గుర్తించాలి.



ఇక పేదసాదలు అంతో ఇంతో ఆశలుపెట్టుకున్న మావోయిస్టుల తెలంగాణా రాజకీయం మావో నిర్వహించిన ఐక్య చైనా, అఖండ చైనా విప్లవోద్యమానికి పూర్తి విరుద్ధం. చైనాలో ఏ రాష్ట్రాన్నీ మావో "వేర్పాటువాదం''తో విచ్చిన్నం చేయలేదు, భాషా రాష్ట్రాలనూ విడదీయలేదు. జాతీయ మైనారిటీల రక్షణ దృష్ట్యా మెజారిటీ 'హాన్' జాతి దురహంకారాన్ని విజయవంతంగా నిరోధించగలిగిన వాడు మావో. విప్లవోద్యమంలో తనకు అవసరమైన రక్షణ స్థావరాల నిర్మాణం కోసం ఏ రాష్ట్రాన్నీ మావో వేర్పాటు ఉద్యమం ద్వారా విడగొట్టడానికి ప్రయత్నించలేదు. అలాంటి ఉదాహరణ ఏదైనా ఉంటే ఇక్కడి వేర్పాటువాదులు గానీ, లేదా వారిని వ్యతిరేకిస్తూనే "స్థావరం'' కోసం తెలుగుజాతి ఐక్యమత్యాన్ని విచ్చిన్నం చేయగల వ్యూహరచనలో ఉన్న మావోయిస్టు సోదరులు గానీ పేర్కొంటే సంతోషిద్దాం!


ఏది ఏమైనా తెలంగాణా యువతను అబద్ధాలతో మభ్యపెట్టి, వారిని ఆత్మహత్యల వైపునక్కు పురిగొల్పిన కెసిఆర్, అతని ప్రాంతీయపార్టీ భవిష్యత్తు సంక్షోభదశలో ప్రవేశించి, పతనోన్ముఖంగా అడుగులు వేయడం అనివార్యమని ఆ పార్టీలోని కొందరు నాయకులు సహా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తన ప్రత్యర్థిపక్షాల నుంచి తన పార్టీ వైపుకు "ఆకర్షితులవుతు''న్నారని ఆశించిన కెసిఆర్ కు ఇటునుంచి అటువైపుగా వలసలు ప్రారంభం కావడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ!

 

ప్రభుత్వ పనితీరుకు పట్టం కట్టిన పంచయతీ ఫలితాలు.. సీఎం రేవంత్

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంత్రులతో కలిసి గురువారం (డిసెంబర్ 17) మీడియాతో మాట్లాడిన ఆఈయన ఈ రెండేళ్లలో తమ ప్రభుత్వ పని తీరుకు పంచాయతీ ఎన్నికలు రిఫరెండంగా ఆయన అభివర్ణించారు.  పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.  మొత్తం 12 వేల 702 పంచాయతీల్లో 7 వేల 527 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ విజయం సాధించిందనీ, అంటే 66శాతం స్ట్రైక్ రేట్ సాధించిందనీ చెప్పిన రేవంత్, బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కైపోటీ చేశాయనీ, అయినా కూడా రెండు పార్టీలూ కలిపి 33 శాతం పంచాయతీల్లోనే గెలిచాయని రేవంత్ అన్నారు.   పంచాయతీ ఎన్నికల్లో 808 మంది కాంగ్రెస్ రెబల్స్ గెలిచారన్న రేవంత్ రెడ్డి వారిని కూడా కలుపుకుంటే కాంగ్రెస్ మొత్తం 8 వేల 335 పంచాయతీలలో జెండా పాతిందన్నారు.  ఈ ఫలితాలను బట్టి చూస్తే.. ఎన్నికలు జరిగిన 94 అసెంబ్లీ సెగ్మెంట్లలో 87 సెగ్మెంట్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత కనబరిచిందన్నారు.  అంటే  2028 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మూడింట రెండు వంతుల మెజారిటీతో అధికారంలోకి వస్తామని స్పష్టమౌతోందన్నారు.  2028 ఎన్నికలలో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ తీసేయగలరా?!

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు విషయంలో కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్ర ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గ్రామీణ భారతం ఆకలితో అలమటించేలా కేంద్రంలోని మోడీ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటోందంటూ దుమ్మెత్తి పోస్తున్నాయి. కేంద్రం ఈ పథకంలో ఉన్న లోపాలను సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది. పేదలకు ఉపాధి కల్పించే బాధ్యత నుంచి వైదొలగుతోందని దుమ్మెత్తి పోస్తున్నది. ఈ నేపథ్యంలోనే  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీజేపీకి ఓ సవాల్ విసిరారు.  జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగిస్తున్నారు సరే.. భారత కరెన్సీ నోట్ల మీద నుంచి గాంధీ బోమ్మను తొలగించగలరా?  అని చాలెంజ్ చేశారు. బీజేపీ ప్రమాదకరమైన ఆట ఆడుతోందనీ, దేశ సమగ్రత, సామరస్యానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నదని డికే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. జగన్ పై చంద్రబాబు విజయం!?

తెలంగాణలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది. గత అసెంబ్లీ ఎన్నికలనాటి కంటే అధికంగా కాంగ్రెస్ కు ఓటింగ్ శాతం నమోదైంది. ఇక రెండో స్ధానంలో బీఆర్ఎస్ నిలిచింది. బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై   తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది. అదేంటంటే మూడో విడత ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత సోషల్ మీడియాలో తెలంగాణ పంచాయతీ ఎన్నికలలో జగన్ పై చంద్రబాబు విజయం అంటూ ఓ వార్త తెగ వైరల్ అయ్యింది. ఇదేంటి ఎన్నికలు జరిగింది తెలంగాణలో  ఆ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిపై గెలవడమేంటి? అన్న ఆసక్తి కలిగించేలా సోషల్ మీడియాలో వార్త  హల్ చల్ చేసింది. ఇంతకీ విషయమేంటంటే..  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామ సంర్పంచ్ పదవికి పోటీ పడిన వారిలో ఒకరి పేరు భేక్య చంద్రబాబు కాగా, మరో వ్యక్తి పేరు బానోత్ జగన్నాథమ్. ఈ పేర్లే ఈ ఎన్నికను ఆసక్తిగా మార్చేశాయి.  ఈ ఎన్నికలో   భూక్య చంద్రబాబు  బానోత్ జగన్నాథమ్  బానోత్ జగన్నాథమ్ పై విజయం సాధించారు.  దీనిపైనే నెటిజనులు తెలంగాణలో కూడా జగన్ ను చంద్రబాబు ఓడించారు అంటూ సెటైరిక్ గా పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  

సీఎం చంద్రబాబు హస్తిన పర్యటన ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం ఆయన ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి బయలు దేరుతున్నారు. ఈ సారి చంద్రబాబు పర్యటన లక్ష్యం.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన పోలవరం -నల్లమల సాగర్ ప్రాజెక్టులకు అనుమతుల సాధనే అంటున్నారు. నల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో చంద్రబాబు  ప్రధాని మోడీ,  జలవనరులశాఖ మంత్రి సిఆర్‌ పాటిల్‌ తో వేర్వేరుగా భేటీ కానున్నారు.నల్లమల సాగర్‌కు అనుమతులతో పాటు, పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఈ పర్యటనలో కేంద్రాన్ని సిఎం కోరనున్నట్లు తెలుస్తోంది. 

పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసన

కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీల ఎంపీలు నిరసనకు దిగారు. ఈ పథకం పేరుమార్పునకు వ్యతిరేకంగా  కాంగ్రెస్ సహా విపక్ష నేతలు పార్లమెంట్ ఆవరణలో ధర్నాకు దిగారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు.   కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా   ఉపాధి హామీ  పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.  ఉపాధి హామీ పథకాన్ని ఇప్పటికే  ఆచరణలో బలహీనపరిచిన ప్రభుత్వం, ఇప్పుడు దాని ఉనికినే  దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ భగ్గు.. బీజేపీ కార్యాలయాల ముట్టడి

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చాలన్న మోడీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడి జరుగుతోంది. అఖిల భారత కాగ్రెస్ కమిటీ పిలుపు మేరకు గురువారం (డిసెంబర్ 18)  దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల మట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.  తెలంగాణలో కూడా  రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే  అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో పాటు, నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను వేధిస్తోందని కాంగ్రెస్  నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.    బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యాలయాలు ముట్టడిస్తామంటే ఊరుకునేది లేదని, ప్రతిఘటిస్తాం, తాటా తీస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. 

షర్మిలకు బర్త్ డే విషెస్ చెప్పని జగన్.. కారణమేంటంటే?

జగన్.. సొంత చెల్లికి కనీసం బర్త్ డే విషెస్ కూడా చెప్పని వ్యక్తిగా మరోసారి వార్తలలో నిలిచారు. ఔను జగన్ చెల్లెలు షర్మిల బుధవారం (డిసెంబర్ 17) తన జన్మదినం జరుపుకున్నారు.  జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచా యితీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరం పెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.   దీంతో షర్మిల తన మకాం హైదరాబాద్ కు మార్చి కొంత కాలం వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రిగా తెలంగాణ రాజకీయాలలో కీలక భూమిక పోషించారు. అయితే..  గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ గూటికి చేరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతే కాకుండా గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. 2019 ఎన్నికలలో జగన్ విజయంలో షర్మిల కీలక పాత్ర పోషిస్తే.. 2024 ఎన్నికలలో జగన్ ఓటమిలో కూడా ఆమె తన వంతు పాత్ర పోషించారని పరిశీలకులు విశ్లేషణలు కూడా చేశారు.  ఈ పోలిటికల్ డిఫరెన్సెస్ కు తోడు.. జగన్ షర్మిల మధ్య ఆస్తి వివాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సరస్వతి పవర్ వాటాల బదలీ వ్యవహారంలో వీరి మధ్య ట్రైబ్యునల్ లో కేసు కూడా నడుస్తోంది.  అది పక్కన పెడితే.. కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల తనవంతు పాత్ర పోషిస్తున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, వైసీపీలపై ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో ఆమె తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ గొంతును బలంగా వినిపిస్తున్నారు. అందులో తప్పుపట్టాడినికి ఏమీ లేదు.   కాగా షర్మిల జన్మదినం సందర్భంగా కూటమి నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి షర్మిల ధన్యవాదాలు తెలుపుతూ బదులిచ్చారు కూడా.  అయితే సొంత అన్న జగన్ షర్మిలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయకపోవడం సరికాదని వైసీపీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది. తెల్లారి లేస్తే గాంధీ డైనాస్టీ అంటూ.. సోనియా, రాహుల్, ప్రియాంకలపై విమర్శలతో విరుచుకుపడే ప్రధాని నరేంద్ర మోడీ వారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేస్తుంటారు. అంతెందుకు నిత్యం చంద్రబాబుపై ఏక వచన ప్రయోగంతో విమర్శలు గుప్పించే జగన్ కు కూడా చంద్రబాబు జగన్ పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే విషెస్ చెప్పారు. తద్వారా వారంతా విభేదించడం, భిన్నాభిప్రాయం కలిగి ఉన్నంత మాత్రాన వ్యక్తిగత వైరం ఉండనవసరం లేదని చాటారు. కానీ జగన్ మాత్రం రాజకీయంగానైనా, కుటుంబ పరంగానైనా సరే తనతో విభేదించిన వారిని శత్రువులుగా చూస్తారనడానికి సొంత చెల్లికి బర్త్ డే విషెస్ తెలపకపోవడాన్ని ఉదాహరణగా చూపు తున్నారు పరిశీలకులు. 

మూడో విడతలోనూ ‘హస్తం’దే పై చేయి!

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరిగిన సంగతి తెలిసిందే. మూడు దశల్లోనూ కూడా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. మూడో దశలో 4,158 స్థానాల్లో ఎన్నికలు జరగగా, 2,286 పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.  మూడు దశల్లో కలిపి 12,726 పంచాయతీలకు ఎన్నికలు జరగగా, కొన్ని మినహా అన్ని స్థానాల్లో ఫలితాలు వచ్చాయి. వీటిలో 7,093 పంచాయతీల్లో  కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. 3,488   స్థానాలలో విజ యం సాధించి బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచి ఉనికి చాటుకుంది.  బీజేపీ 699  స్థానాలలో గెలిచి నామమాత్రపు ప్రభావాన్ని చూపింది.   అదలా ఉంటే మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు. ఇతరుల్లో సీసీఐ మద్దతుదారులు 24 , సీపీఎం 7 స్థానాలలో విజయం సాధించారు. మూడో విడత ఎన్నికల్లో సిద్దపేట మినహా మిగిలి30 జిల్లల్లోనూ  కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది.  కాగా,  పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల తర్వాత అత్యధిక స్థానాలు దక్కించుకున్నది స్వతంత్రులే. స్వతంత్రులే సుమారుగా 10శాతం సీట్లను గెలుచుకున్నారు. అయితే అలా గెలిచిన వారిలో   80 శాతం మంది కాంగ్రె‌స్ రెబల్సే కావడం గమనార్హం. పంచాయతీ ఎన్నికలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులూ ఈ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి పనిచేయడం సత్ఫలితాలను ఇచ్చింది. మూడో విడత పంచాయతీ పోలింగ్ లోనూ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.  మూడో విడతలో 85.77 శాతం పోలింగ్‌ నమోదైంది. రెండో విడతతో పోలిస్తే ఇది   0.9 శాతం తక్కువ. కాగా మూడు విడతలూ కలిసి మొత్తం 85.30 శాతం ఓటింగ్ నమోదైంది. చివరి మూడో విడతలో యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92. 56 శాతం ఓటింగ్ జరగగా,  నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా 76.45 శాతం పోలింగ్‌  జరిగింది. ఇలా ఉండగా నూతనంగా ఎన్నికైక సర్పంచ్ లు  ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముందుగా ప్రకటించిన మేరకు డిసెంబర్ 20న ముహూర్తం మంచిగా లేదంటూ ఎన్నికైన సర్పంచ్ లు తెలపడంతో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఈ నెల 22కు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.20న ముహూర్తం సరిగా లేదని కొత్తగా ఎన్నికైన సర్పంచులు,వార్డు సభ్యులు కోరడంతో ప్రభుత్వం తేదీని మార్చినట్లు తెలిపింది.

మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభంజనం

  తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది. మూడోవంతు సర్పంచ్ స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ కలిపినా 30 శాతం కూడా దాటలేదు. మొత్తం 4,158 స్థానాల్లో ఎక్కువ చోట్ల గెలిచి ఆధిక్యాన్ని చాటారు. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్‌ భూపాల్‌పల్లి, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, నాగర్‌ కర్నూల్‌, నల్గొండ, నిజామాబాద్‌, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్‌, కామారెడ్డి, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్‌ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు.  రాత్రి 8 గంటల వరకు కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 1850, బీఆర్ఎస్ 960, బీజేపీ 180, ఇతరులు 390 సర్పంచ్‌ స్థానాల్లో గెలు పొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం, గుండ్లరేవు గ్రామంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గుండ్లరేవు గ్రామంలో మూడో దశలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. భూక్యా చంద్రబాబు, బానోత్ జగన్నాథం అలియాస్ జగన్ ఇద్దరు వ్యక్తులు పోటీ చేశారు. ఏపీ రాజకీయ నాయకుల పేర్లతో వీరి పేర్లు ఉండటంతో గ్రామంలో ప్రచారం కూడా ఆసక్తికరంగా జరిగింది. వారి ప్రచారం కూడా 'చంద్రబాబు', 'జగన్' పేర్లతోనే ఎక్కువగా సాగింది. ఈరోజు జరిగిన పోలింగ్‌లో బానోత్ జగన్‌పై భూక్యా చంద్రబాబు విజయం సాధించారు. దీంతో 'జగన్‌పై చంద్రబాబు విజయం' అంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది  

ఉపఎన్నికలకు భయపడే అనర్హత వేటు వేయడం లేదు : కేటీఆర్

  అసెంబ్లీ సాక్షిగా నేడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయంపై స్పందిస్తూ, దేశ అత్యున్నత న్యాయస్థానాలపైనే కాదు, చివరికి రాజ్యాంగంపై కూడా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని విమర్శించారు. కేవలం ఫోటోలకు ఫోజులిచ్చేందుకు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. "స్వంత తండ్రి రాజీవ్ గాంధీ తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టాన్నే గౌరవించలేని అసమర్థ నాయకుడిగా రాహుల్ గాంధీ చరిత్రలో మిగిలిపోతారని కేటీఆర్ ఆరోపించారు. అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు సాక్షాత్తు ఫిరాయింపు ఎమ్మెల్యేలే అనేకసార్లు బాహాటంగా ప్రకటించినా, వారిని కాపాడటం రాహుల్ గాంధీ, మరియు కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం" అని మండిపడ్డారు. ఉప ఎన్నికల భయంతోనే వెనకడుగు వేసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనా వైఫల్యాలపై పంచాయతీ ఎన్నికల వేళ పల్లెపల్లెనా ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతోందని, ఆ భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలు  అంటే జంకుతోందని కేటీఆర్ అన్నారు. అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తోందని, తెలంగాణ సమాజానికి ఈ విషయం స్పష్టంగా అర్థమైపోయిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి మరీ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు తెరతీసిన నాటి నుంచి, నేటి స్పీకర్ నిర్ణయం వరకు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అడుగడుగునా అపహాస్యం చేస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి మేరకు స్పీకర్  కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుల స్ఫూర్తిని పట్టించుకోకుండా, కేవలం ఇక్కడి కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గి స్పీకర్ నిర్ణయం తీసుకోవడంపై కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  స్పీకర్ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అందులోని నిబంధనలను పట్టించుకోకుండా, ప్రజాస్వామ్య విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా స్పీకర్ వ్యవహరించారన్నారు. సభాపతి తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కేటీఆర్ తెలిపారు. సాంకేతికంగా అడ్డుపెట్టుకుని గోడ దూకిన ఎమ్మెల్యేలను తాత్కాలికంగా కాపాడినట్టు కాంగ్రెస్ సంబరపడినా, ప్రజాక్షేత్రంలో వారిని ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎప్పుడో అనర్హులుగా ప్రకటించేశారని కేటీఆర్ స్పష్టం చేశారు.