తెలంగాణ అసాధ్యం!

 


- ఎబికె ప్రసాద్
{సీనియర్ సంపాదకులు]

 

 

తెలుగుజాతిని విచ్చిత్తి లక్ష్యంగా రాజకీయ నిరుద్యోగులు, 'చేతబడి' రాజకీయాలూ కొన్నాళ్ళుగా ప్రారంభించి కొనసాగిస్తున్న 'ప్రత్యేక తెలంగాణా' ఉద్యమం ప్రస్తుతం చీలబాటలు పట్టింది. తెలుగుజాతిని చీల్చబోయి ఉద్యమమే రెండు మూడు పాయలుగా బద్దలైంది. ఇందులో ఒక 'పాయ'కు కాంగ్రెస్ నాయకత్వంతో లోపాయికారీగా మిలాఖత్ అయిన తన టి.ఆర్.ఎస్. పార్టీ రానున్న (2014) ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తుంది, అటు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ తో గాని, ఇటు బి.జె.పి.తో గాని, కమ్యూనిస్టు (సి.పి.ఐ.) పార్టీతో గానీ ఎలాంటి పొత్తుపెట్టుకోకుండానే పోటీ చేస్తుందని 'బొబ్బిలిదొర' కెసిఆర్ ప్రకటించాడు.

 

 కాగా, మొదట్లో కెసిఆర్ తో కలిసి ప్రొఫెసర్ కోదండరామ రెడ్డి ఏర్పాటు చేసిన సంయుక్త కార్యాచరణ సంఘం, ఇప్పుడు బయటికి ప్రకటించకపోయినా కె.సి.ఆర్. వర్గానికి దూరంగా ఉంటూ సొంత ఎజెండాతో ఉద్యమం పేరిట ఢిల్లీలో "జంతర్ మంతర్''లో గత నెల 29న "రెండురోజుల'' సత్యాగ్రహం తలపెట్టింది. అయినా కేంద్రప్రభుత్వం "తెలంగాణా రాష్ట్రం'' ఏర్పాటుకోసం ఎలాంటి ఆసక్తి కనబరచకపోవటంతో కోదండం వర్గం హతాశులై తిరిగి ఇంటికి చేరింది. ఇక జంతర్ మంతర్ 'దీక్ష'కు మద్ధతు పలికిన పార్టీలు, నాయకులు ఎవరు? తాడూ బొంగరం లేని పక్షాలు. పది-పదిహేను ఏళ్ళ నాడు కాకినాడ సభలో తెలంగాణా ఏర్పాటుకు హామీపడి, తీరా కేంద్రంలో తన ప్రభుత్వం ఏర్పరచి అయిదేళ్ళు కొనసాగించుకున్న బిజెపి-ఎన్.డి.ఎ. పరివార్ ముఠా ఆ హామీని అమలుపరచకుండా తప్పుకుంది. అయినా బిజెపి ఈసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే (ఆ అవకాశాలు కన్పించడంలేదు) గిస్తే మూడు మాసాల్లోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని మరోసారి 'మాట' వదిలింది.



ఇక "దీక్ష"కు మద్ధతు పలకడానికి వచ్చిన వారిలో - ఒకే ఒక పార్టీ సభ్యుడిగాను, అధ్యక్షుడుగానూ మిగిలిపోయిన "జనతా పార్టీ'' నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి ఒకడు. ఇతడు భారత రాజేకీయాల్లో ఆధునిక శకుని! ఇక కోదండం వర్గానికి మద్ధతు తెల్పడానికి చేరినవారిలో మరో వ్యక్తి భారత కమ్యూనిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం ప్రతాప రెడ్డి ఒకరు. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించడమేగాక బ్రిటిష్-నిజాం పరాయి పాలనల మూలంగా చెల్లాచెదురై పరాయి పంచాల్లో బతుకులీడ్చిన ప్రాచీన చరిత్రగల తెలుగుజాతినంతటినీ ఏకంచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణకు కారకులయిన కమ్యూనిస్టు పార్టీ తరువాతి కాలంలో రాజకీయంగా పతనం కావడం, ఆ పతన రాజకీయంలో భాగంగా ఉనికికోసం తెలంగాణా వేర్పాటువాదాన్ని భుజాన వేసుకోవడంతో ప్రజలలో విశ్వాసం కోల్పోయింది. శాసనవేదికలో ప్రాతినిధ్య పరంగానూ అతి బలహీనశక్తిగా మనుగడ సాగిస్తూ వచ్చిన పార్టీకి సురవరం కార్యదర్శి!


 కాంగ్రెస్ ప్రభుత్వం (కేంద్రం)లో భాగస్వామిగా ఉన్న పవార్ ఎన్.సి.పి. పార్టీ సంఖ్యాపరంగా బలహీనమైన పక్షం. కోదండం దేక్షకు మద్ధతిలిచ్చిన బాపతు బలం ఇదీ! "తెలంగాణా వాదాన్ని బలంగా చాటేందుకు'' హస్తినకు చేరిన సంసద్ యాత్ర అలా ముగిసింది! కాంగ్రెస్ లో టి.ఆర్.ఎస్.ను విలీనం చేయడానికి సిద్ధమైన కెసిఆర్ పార్టీకి చెందిన మరొక "నోటి దురుసు'' వ్యక్తి ఈటెల "కాంగ్రెస్ కు గోరీ'' కడతామని ప్రగల్భించాడు! 'ఈటెల'వారు సంసద్ యాత్రలో పాల్గొన్నది తెలంగాణా రాష్ట్రం కోసం కాదు, కెసిఆర్ పెంచుకున్న "పలుకుబడి''ని కాస్తా కోదండం కొట్టేయకుండా "చెక్'' చేయడానికే గాని మరొకందుకు కాదు. ఇక వేర్పాటు ఉద్యమానికి మద్ధతు పలికిన మరొక పార్టీ 'లెటర్ హెడ్' పార్టీగానే మిగిలిపోయిన ఫార్వర్డ్ బ్లాక్!




ఇక వేర్పాటువాదానికి మద్ధతు చెబుతున్న ఈ అమాం బాపతు రాజకీయ నిరుద్యోగులు రేపటి ఎన్నికలకోసం ప్రజలకు చేస్తున్న వాగ్దానాలు, ఇస్తున్న హామీలూ కోటలు దాటిపోతున్నాయి. వీళ్ళందరి నినాదం ఒక్కటే - "సీమాంధ్రుల దోపిడీ నుంచి విముక్తి పొందడమే లక్ష్యం''! కాని ప్రాంతీయ పెట్టుబడిదారుల దోపిడీ నుంచి విమోచన పొందేది ఎప్పుడో వీళ్ళు చెప్పరు. ఈ చిల్లర మల్లర రాజకీయ నిరుద్యోగులందరికి - తెలంగాణలో దశాబ్దాలుగా తిష్ఠవేసి తెలంగాణా దళిత బహుజన వర్గాల ప్రజల మూల్గుల్ని పీల్చిపిప్పిచేసిన దొరలు, జాగిర్దార్లు, భూస్వామ్య స్థానిక పెట్టుబడిదారులతో పాటు అదే దోపిడీకి, దోపిడీ రాజకీయాలకూ నాయకత్వం వచించిన మహారాష్ట్ర, పంజాబీ, రాజస్థానీ, సింధీ, కర్ణాటక పెట్టుబడుదారులు తమ శ్రేయోభిలాషులై తోటి సహోదర సహోదరులయిన తెలుగుప్రజలు కాకుండా పోయారు! దూరదృష్టిలో కొరవడిన ఈ దుర్మార్గపు రాజకీయానికి పునాదులన్నీ - వేర్పాటువాదులు తమ స్వార్థప్రయోజనాల కోసం తలపెట్టిన విషప్రచారంలోనే ఉన్నాయి. తెలంగాణలోనూ, ఇతర తెలుగు ప్రాంతాలలోనూ ఉన్న తెలుగువారంతా శాతవాహనుల కాలంనుంచీ ఆదాన ప్రదానాలుగా అటువాడు ఇటూ, ఇటువారు అటూ వలసపోయిన ప్రవాసులూ, నివాసులేనని మరవరాదు!


"పచ్చని తెలంగాణా రాష్ట్రం నా కల'' అని ఎన్నికల నినాదంగా చేపట్టిన కె.సి.ఆర్. పుట్టుపూర్వాలన్నీ "అమ్మ పుట్టిల్లు మేనమామకెరుక'' అన్నట్టుగా ఉత్తరాంధ్ర ప్రజలకు బాగా తెలుసు. అందువల్ల ఇతగాడు ఉద్దేశించిన లక్ష్యం అధికారం కోసం తన "కుటుంబ పచ్చదనమే'' గాని తెలంగాణా ప్రాంత పచ్చదనం మాత్రం కాదని! జాతిని చీల్చే విద్వేష ప్రచారంగాని, ప్రజల ఐక్యతను భంగపరిచే ప్రకటనలుగానీ, మత విద్వేష ప్రచారంగానీ రాజ్యాంగ విరుద్ధచర్యలుగా భావించి అలాంటి వారిని శిక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధైర్యంతో ముందుకు రావాలని కొలది రోజులనాడే (ఏప్రిల్ లో) సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని మరవరాదు. ఒక వైపున పంటలు కోల్పోయి, అప్పులపాలైన రైతులు, మరొక వైపున చేనేతకారులు అనేకమంది తెలంగాణలో కూడా ఆత్మహత్యలు చేసుకొంటూండగా పట్టించుకోని కెసిఆర్, కోదండం వర్గం, ఇంకొక వైపున విద్వేష ప్రచారం ద్వారా అక్కరకు రాణి హామీలపైన యువతలో ఆశలు రెచ్చగొట్టి వారిని ఆత్మహత్యలకు పురిగొల్పారు. ఈ పాపంనుంచి తప్పుకొనే మార్గం లేకనే ఇప్పుడు కుడితిలో పడిన ఎలుకల్లా కొట్టుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం రాకపోతే తమను స్థానిక ప్రజలు బతకనివ్వరన్న భయం వారిని వెంటాడుతోంది కాబట్టే కాలుకాలిన పిల్లుల్లాగా హైదరాబాద్ నుంచి హస్తినకు ఢిల్లీ నుంచి హైదరాబాదుకూ 'బరాట్లు' కొడుతున్నారు.



ఈ సందట్లోనే ఉస్మానియా ఆచార్యుడు, దళితమేధావి అయిన కంచి ఐలయ్య ఒక ప్రకటనలో [11.04.2013] "తెలంగాణా ఉద్యమం పేరుతొ కెసిఆర్ రూ. 50 వేలకోట్లు కూడబెట్టుకున్నారని బాహాటంగా ఆరోపించడం యువతలో సంచలన కారణమవుతోంది. ఈ పరిస్థితుల్లో కెసిఆర్ ప్రజల దృష్టిని మళ్ళించడంకోసం 2014లో జరిగే ఎన్నికలు "మధ్యంతరంగానే రేపో మాపో వస్తా''యన్న ప్రకటనలతోనూ "త్వరలో మరికొందరు ఇతర పార్టీల ఎం.ఎల్.ఎ.లు టి.ఆర్.ఎస్.లో చేరనున్నారన్న చిట్కాలతోనూ కాలక్షేపం చేస్తున్నాడు! ఇది కె.సి.ఆర్. 'ఒంటరి' పోరాటంతో చేస్తున్న 'తుంటరి' రాజకీయం తప్ప మరొకటి కాదు! ఈ భాగోతం యిలా వుండగా, కాంగ్రెస్ లో తన టి.ఆర్.ఎస్. పార్టీని కలిపివేయడానికి రెండు నెలలనాడు ఢిల్లీలో హామీపడి వచ్చిన ఈ 'చేతబడుల' రాజకీయవేత్త అందుకు విరుద్ధంగా తన రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్ పైన వ్యతిరేక ప్రచారాన్ని పూర్తిగా వదులుకోలేక పోతున్నాడు. ఈ 'గోడదూకుడు వ్యక్తిని తమకిచ్చిన మాటనుంచి తప్పుకోజూడడాన్ని అనుమానించిన కేంద్రనాయకత్వం ఇప్పుడు కె.సి.ఆర్. ఆస్తులపైన కూడా సి.బి.ఐ. ద్వారా ఆరా తీయిస్తున్నట్టు ఢిల్లీ నుంచి "సూర్య'' దినపత్రిక ప్రత్యేక ప్రతినిధి పంపించిన భారీ వార్తను ప్రచురించి రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది!


ఈ కూపీలో భాగంగానే ఆ పత్రిక కేసిఆర్ మరొక స్థానిక బడా పట్టుబడిదారుడైన ఒక 'ఘరానా'తో కలిసి ఒక దినపత్రికను ఒక ఛానెల్ ను నెలకొల్పడంపైన ఆ పత్రిక యజమానికి కెసిఆర్ కి ఉన్న వ్యాపార సంబంధాల గురించి కూడా సిబీఐ దర్యాప్తులోకి దిగనున్నట్టు రాసింది. దోపిడీ వ్యవస్థను కాపాడుకోగోరే పెట్టుబడీదారీ వర్గాలు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నా వారి దోపిడీ స్వభావం మారదు. కాని ఒక దోపిడీదారు మరొక దోపిడీదారుతో లాభాపేక్షతో పోటీపడుతున్నప్పుడు ఒక్కో సందర్భంలో వారి మధ్య ఘర్షణ 'కపట కలహంగా' తలెత్తుతూ ఉంటుంది! కాని దోపిడీ స్వభావంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోని భూస్వామ్య పెట్టుబడి వర్గాల మధ్య తేడా ఉండదు. కాని రాజకీయాలలోకి దిగి 'రాజకీయ నిరుద్యోగులు'గా ఉండే ఒక ప్రాంతపు పెట్టుబడిదారీ వర్గ ప్రతినిధులు మాత్రం ఇతర ప్రాంతాలకు చెందిన దోపిడీదారుల దోపిడీని మాత్రమే ఉదాహరిస్తూ "కపట కలహం'' తో ప్రజలమధ్య చిచ్చుపెట్టి ఐక్యతను విచ్చిన్నం చేయడానికి వెనుకాడరు.




ఆ అధికార దాహంతోనే ప్రాంతీయ భూస్వామ్య పెట్టుబడివర్గాలకు నాయకత్వం వహిస్తున్న కెసిఆర్ ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంకోసం స్వార్థపూరిత ఉద్యమాన్ని నిర్మించి 'సీమాంధ్రుల దోపిడీని నుంచి తెలంగాణాను విముక్తి చేయడం' తన లక్ష్యంగా ప్రకటించి, "సీమాంధ్రులను తరిమికొట్టండి'' వారి "ఆస్తిపాస్తుల్ని, ఇళ్లను స్వాధీనం చేసుకోండి "పరిశ్రమలనుంచి వారిని తరిమేస్తే, ఉద్యోగాలన్నీ తెలంగాణా యువతకే దక్కుతాయి'', "మధ్యలో ఉద్యమాన్ని ఆపేశామా సీమాంధ్రులు మనల్ని బతకనివ్వరు, చంపేస్తారు'' అంటూ నోటికొచ్చిన బజారు కూతలతో సామాన్యప్రజలనూ, నిరుద్యోగ విద్యార్థులనూ రెచ్చగొడుటూ నినాదాలు యిచ్చాడు. ఈ పరిణామం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బ తీయడానికీ, ఏ సోదర సీమాంద్రులపై కెసిఆర్ తన స్వార్థం కోసం కత్తికట్టాడో తిరిగి ఆ సీమాంధ్రలోని డిగ్రీ కళాశాలకు, వృత్తి కళాశాలలకూ ప్రాంతంలోని మన తెలుగుపిల్లలూ, ఇతర రాష్ట్రాల పిల్లలూ చదువుల కోసం వలసపోవలసి వచ్చింది; ఇతగాడి ప్రవర్తన మూలంగా కొన్ని పారిశ్రామిక సంస్థలూ, ముఖ్యంగా కొన్ని ఐ.టి. కంపెనీలు మూతపడి, వేలాదిమంది యువకులు, ఉద్యోగాలూ ఉపాధి కోల్పోవలసి వచ్చింది.



 ఆ మాటకొస్తే సీమాంధ్ర పెట్టుబడిదారులకే కాదు, మన తెలంగాణాలోని పెట్టుబడిదారులకూ ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత బడా బడా "ఫామ్ హౌస్''లూ "విలాసక్షేత్రాలూ'' (ఫామ్ హౌస్ లు)ఉన్నాయి. అవి ఉభయత్రా రాజకీయ మంత్రంగాలకూ కేంద్రాలు; ఇక హైదరాబాద్ లోని సినిమా పరిశ్రమ ఉనికి అంటారా, ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఎన్.టి.రామారావు కంటే చాలా ముందుగా తెలుగు సినిమా పరిశ్రమను మద్రాసునుంచి హైదరాబాద్ కు ఆహ్వానించిన తొలి ముఖ్యమంత్రి మన తెలంగాణాకు చెందిన సమర్థమైన పరిపాలనా దక్షుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డిగారేనని మరిచిపోయి కెసిఆర్ వర్గం కళ్ళున్న కబోధి పాత్ర వహిస్తే ఎలా?!

ఎటుతిరిగీ ముఖ్యమంత్రి హోదా కోల్పోయిన తరువాతనే కాంగ్రెస్ రాజకీయ కుమ్ములాటల్లో చెన్నారెడ్డి తన నిరుద్యోగ బాధ తనకు దుస్సహమై తిరిగి అధ్కారంలోకి రావడంకోసం "తెలంగాణా ప్రజాసమితి''ని ఏర్పాటు చేసి వేర్పాటు ఉద్యమానికి బీజాలు నాటాడు. ఆ చరిత్ర తెలుగుప్రజలు మరచిపోలేరు! అలాగే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాతనే దోపిడీకాండలో భాగాస్వాములయిన మన తెలంగాణాలోని భూస్వామ్య-పెట్టుబడిదారుల కనీసం 20 మంది దాకా ఎంతలేదన్నా ఒక్కొక్కరు రూ.500 కోట్లనుంచి రూ.4,000కోట్ల వరకూ విలువగల ఆస్తులు ఏ రూపంలోనైతేనేమి కూడబెట్టుకున్నవారేనని ప్రాంతీయ సామాజికశాస్త్రవేత్తల అంచనా!
 

ఈ క్రమంలో, ప్రొఫెసర్ కంచి ఐలయ్య టి.ఆర్.ఎస్. నాయకుడు 'బొబ్బిలిదొర' కె.సి.ఆర్. మన తెలంగాణలో కూడగట్టుకున్న ఆస్తుల విలువ (రూ. 50,000 కోట్లు) [పమీ అతిగా ఉన్న అంచనా అని అనుకున్నా "ఇంటర్నెట్'' సమాచారం ప్రకారం గుజరాత్ నుంచి (కాండ్లా రేవునుంచి వ్యాపార లావాదేవీల్లో భాగంగా కెసిఆర్ నడుపుతున్నాడని చెబుతున్న ఎందు షిప్పులు) హైదరాబాద్ వరకూ అతనికి ఉన్న ఆస్తుల విలువ రూ.6,000 కోట్లు అని అంచనా! తల దాచుకోడానికి కేవలం 75 గజాల స్థలం కోసం తెలంగాణా పేదసాదలు పడిగాపులు పడుతూన్న దశలో 75 ఎకరాల్లో ఫాం హౌస్ కట్టుకోడానికి సాహసించిన 'ఉద్యమ' నాయకుడు రేపు మన తెలంగాణలో అధికారంలోకి వస్తే దళిత బహుజన, పేద, మధ్యతరగతి వర్గాలకు, యువతకూ ఏదో తవ్వి తలకెత్తుతాడను కోవడం కేవలం భ్రమ మాత్రమేనని గుర్తించాలి.



ఇక పేదసాదలు అంతో ఇంతో ఆశలుపెట్టుకున్న మావోయిస్టుల తెలంగాణా రాజకీయం మావో నిర్వహించిన ఐక్య చైనా, అఖండ చైనా విప్లవోద్యమానికి పూర్తి విరుద్ధం. చైనాలో ఏ రాష్ట్రాన్నీ మావో "వేర్పాటువాదం''తో విచ్చిన్నం చేయలేదు, భాషా రాష్ట్రాలనూ విడదీయలేదు. జాతీయ మైనారిటీల రక్షణ దృష్ట్యా మెజారిటీ 'హాన్' జాతి దురహంకారాన్ని విజయవంతంగా నిరోధించగలిగిన వాడు మావో. విప్లవోద్యమంలో తనకు అవసరమైన రక్షణ స్థావరాల నిర్మాణం కోసం ఏ రాష్ట్రాన్నీ మావో వేర్పాటు ఉద్యమం ద్వారా విడగొట్టడానికి ప్రయత్నించలేదు. అలాంటి ఉదాహరణ ఏదైనా ఉంటే ఇక్కడి వేర్పాటువాదులు గానీ, లేదా వారిని వ్యతిరేకిస్తూనే "స్థావరం'' కోసం తెలుగుజాతి ఐక్యమత్యాన్ని విచ్చిన్నం చేయగల వ్యూహరచనలో ఉన్న మావోయిస్టు సోదరులు గానీ పేర్కొంటే సంతోషిద్దాం!


ఏది ఏమైనా తెలంగాణా యువతను అబద్ధాలతో మభ్యపెట్టి, వారిని ఆత్మహత్యల వైపునక్కు పురిగొల్పిన కెసిఆర్, అతని ప్రాంతీయపార్టీ భవిష్యత్తు సంక్షోభదశలో ప్రవేశించి, పతనోన్ముఖంగా అడుగులు వేయడం అనివార్యమని ఆ పార్టీలోని కొందరు నాయకులు సహా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తన ప్రత్యర్థిపక్షాల నుంచి తన పార్టీ వైపుకు "ఆకర్షితులవుతు''న్నారని ఆశించిన కెసిఆర్ కు ఇటునుంచి అటువైపుగా వలసలు ప్రారంభం కావడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ!

 

పంచాయతీ ఎన్నికలు.. అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్!

పంచాయతీ ఎన్నికలలో తొలి విడత ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో అభ్యర్థుల్లో టెన్షన్ కనిపిస్తోంది. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల్లో  కలవరం మొదలైంది. ప్రచారానికి  వారం రోజులు మాత్రమే గడువు ఇవ్వడంతో గ్రామాల్లో ప్రచారం ముమ్మరం చేశారు. వారికి కేటాయించిన గుర్తులతో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సారి గ్రాయపంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి. ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం (డిసెంబర్ 9)  సాయంత్రంతో ముగియనుంది.  అదలా ఉండగా.. రెండో విడత ఎన్నికలకు సంబంధించిన  ప్రచారం మరింత జోరందుకుంది. ఈ నెల 14న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. మరో పక్క మూడో విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం కూడా పూర్తయ్యింది. దీనికి సంబంధించి ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. అంతే కాకుండా ఈ నెల 17న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.

పుత్రిక రాజ‌కీయ అరంగేట‌గ్రం.. గ్రౌండ్ ప్రిపరేషన్ లో బొత్స!

బొత్స సత్యనారాయణ.. అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నాత‌నదైన రాజ‌కీయం చేయ‌డంలో ఆరితేరిన వార‌న్న పేరుంది ఆయనకు.  విజయనగరం రాజ‌కీయాల్లో బొత్స ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది ఉన్నారు. కానీ.. ఇప్పుడు బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు.  ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి  సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.   ఈ క్రమంలోనే  తాను పొలిటికల్ గా యాక్టివ్‌గా ఉన్నప్పుడే వారసుల్ని రంగంలోకి దింపాలని భావిస్తున్నారని అంటున్నారు.  తన కుమార్తె తన కుమార్తె బొత్స అనూష పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. బొత్స వారసురాలి పొలిటికల్ ఎంట్రీకి కావాల్సిన గ్రౌండ్‌ వర్క్ పెద్ద ఎత్తున‌ జరుగుతోందని తెలుస్తోంది. ఇటీవల చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో వైసీపీ కార్యక్రమాల్లో అనూష  చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె పొలిటికల్‌గా యాక్టివ్‌ అవుతున్నారనడానికి ఇదే సంకేతమని అంటున్నారు   రాజ‌కీయ విశ్లేష‌కులు. వివిధ కార్యక్రమాల పేరిట బొత్స  అనూష‌ ప్రజల్లోకి వెళ్తున్న తీరు, అందర్నీ కలుపుకుని పోయేందుకు చూపిస్తున్న చొరవ చూస్తుంటే అతి త్వ‌ర‌లోనే  ఆమె రాజ‌కీయ ఎంట్రీకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువడుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నది.  చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణకు ప్రత్యామ్నాయంగా అనూష ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతోందని సొంత కేడరే చెబుతోంది. వృత్తి పరంగా డాక్టర్‌ అయిన అనూష… ఇటీవల సెగ్మెంట్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు, కేడర్‌ మీటింగ్స్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీల్లో డైరెక్టర్ గావున్న అనూష ప్రజల్లోకి వెళ్ళి వారికి కావల్సిన వైద్య సలహాలను అందిస్తున్నారు. అలాగే గుర్ల, మెరకముడిదాం మండలాల్లో అయితే… స్థానిక‌ నాయకులు ఏ కార్యక్రమం నిర్వహించినా అక్కడికి వెళ్లి త‌న‌దైన శైలిలో స్పందిస్తున్నార‌ట‌. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండిటిలో ఏదో ఒక మండలం నుంచి జెడ్పీటీసీగా ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దాని ద్వారా ముందు జడ్పీ ఛైర్‌పర్సన్‌తో పొలిటికల్‌ కెరీర్‌ మొదలు పెట్టాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.  తల్లి ఝాన్సీ తరహాలోనే అనూష కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తారని బొత్స అనుచరగణం చెప్పుకుంటోంది. మరో వైపు ఇటీవలి కాలంలో అనూష పర్యటనల మీద ప్రజల‌ స్పందన గురించి కూడా ఆరా తీశారట బొత్స సత్యనారాయణ. పాజిటివ్ రిపోర్ట్ రావడంతో… ఇప్పుడు కోరుకుంటున్నట్టు రేపు పరిస్థితులన్నీ అనుకూలించి తాను రాజ్యసభకు వెళితే… చీపురుపల్లి నియోజకవర్గ బాధ్యతల్ని అనూష చూసుకునేలా స్కెచ్ రెడీ చేస్తున్నారట. అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నందున అప్పటికి ఎలాగోలా కుమార్తె సెట్‌ అవుతారన్న ఆలోచనలో ఉన్నారట బొత్స. ఓవరాల్‌గా ఆ కుటుంబం నుంచి మ‌రో రాజకీయ వారసత్వం  ఖాయమైపోయిందంటున్నారు ఎమ్మెల్సీ సన్నిహితులు.

గుంతకల్లులో కీలక నేతల వారసత్వ రాజకీయం

  ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. రాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరే నియోజకవర్గాలతో  పోలిస్తే ఆ రాజకీయం ఎప్పుడు సైలెంట్‌గా ఉంటుంది. గుంతకల్ నియోజకవర్గంలో కేవలం ఒకే మండలం రెండు మున్సిపాలిటీ లు మాత్రమే ఉండడంతో పెద్దగా రాజకీయ జోక్యాలు ఉండవు. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడ వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.  2014 ఎన్నికల్లో ఒకసారి టీడీపీ తరఫున జితేంద్ర గౌడ్, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున వెంకట్రామిరెడ్డి గెలిచారు.ఇద్దరు కూడ ఎక్కడ పెద్దగా వార్తల్లో నిలిచేవారు కాదు.  ఇలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు తమ వారసులను ఎంట్రీ ఇచ్చేందుకు ఇద్దరు కీలక నేతలు రంగం సిద్ధం చేస్తున్నారట. 2024లో టీడీపీ నుంచి గెలిచినా గుమ్మనూరు జయరాం, వైసీపీ నేత వెంకట్రామిరెడ్డిలు ఇద్దరు ఇదే పనిలో ఉన్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్‌ను ప్రిపేర్ చేస్తున్నారట నేతలు. అధికార టీడీపీ, విపక్ష వైసీపీలో వారసుల ఎంట్రీ త్వరలో జరగనుందని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ నుంచి గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గుత్తి, పామిడి మండలాల్లో ఇంచార్జిగా ఉండటంతో ఈ రెండు చోట్ల తన ఫోకస్ పెంచారు. వరుస పర్యటనలు చేస్తూ క్యాడర్‌తో మమేకం అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూతురు నైరుతి రెడ్డి గుంతకల్లు మొత్తం తన భుజస్కందాలపై వేసుకొని తండ్రికి చేదోడు వాదుడుగా ఉంటూ వస్తున్నారు.  అయితే తండ్రి ఇటీవల అనార్యోగానికి గురవడంతో తనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణ, రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నా లాంటి పెద్ద కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూతురు నైరుతి రెడ్డి విజయవంతం చేయడంతో ఆమెపై వైసీపీ క్యాడర్‌లో కాన్ఫిడెన్స్ పెరిగిందట. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడు నేత పెళ్లికి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైరుతి రెడ్డితో  ప్రత్యేకంగా మాట్లాడడం ఈ ఊహాగానాలకు మరింత  బలం చేకూర్చింది.  అందులోనూ వైసీపీలో వేరే నేత ఎవరు పోటీలో లేకపోవడంతో  అయితే వెంకట్రామిరెడ్డి లేదంటే ఆయన కూతురు నైరుతి రెడ్డికి  ఛాన్స్ ఉండే అవకాశం ఉందంటున్నారు.ఇక టీడీపీలో చూసుకుంటే గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ అంత ఈజీగా ఛాన్స్ కొట్టేసే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే గుమ్మనూరు జయరాం ఫోకస్ మొత్తం కర్నూల్ జిల్లాలోని సొంత సెగ్మెంట్ ఆలూరుపై పెట్టడం.. అందులోనూ గుంతకల్లు  టీడీపీ లో గుమ్మనూరు జయరాం ఇమడకపోవడం, అవినీతి ఆరోపణలు వస్తుండడంతో పార్టీ అతనికి పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు.  అందులోనూ టీడీపీలో ఈసారి గుంతకల్ టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ఇదే సీట్‌పై కన్నేయడం, టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ కూడా గుంతకల్లుపై ఫోకస్ పెంచడం, ఆయనకు అది సొంత నియోజకవర్గం కూడా కావడంతో గుమ్మనూరు ఈశ్వర్‌కు కొద్దిపాటి ఛాన్స్‌లు మాత్రమే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మరి వచ్చే ఎన్నికల నాటికి మరి వారసుల ఎంట్రీ ఉంటుందా లేదా అనేది చూడాలి.

డల్లాస్ లో కొడాలి నాని గురించి లోకేష్ ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారాలోకేష్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.   ఆరు రోజుల అమెరికా పర్యటనలో  లోకేష్ లక్ష్యం పెట్టుబడుల ఆకర్షణే. అందులో భాగంగానే ప్రస్తుతం డల్లాస్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ డల్లాస్ లో తెలుగు కమ్యూనిటీ విత్ లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ ఆర్ఐలు కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి ఎంత అండగా నిలిచారో వివరించారు. రాష్ట్రం నంబర్ వన్ గా ఎదగడంలో ఎన్ఆర్ఐల సహకారం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఒక ఎన్ఆర్ఐ కొడాలి నాని గురించి అడిగారు. అధికారం అండ చూసుకుని అరాచకత్వంతో రెచ్చిపోయిన కొడాలి నానిపై ఏం చర్యలు తీసుకుంటారంటూ ప్రశ్నించారు. అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.   అంధ్రప్రదేశ్ ను నంబర్ వన్ గా నిలబెట్టేందుకు అందరం సమష్టిగా కృషి చేయాలి, అందరూ దానిపైనే దృష్టి పెట్టాలి అని చెప్పిన ఆయన అనవసర విషయాల ప్రస్తావన ఎందుకంటూ వ్యాఖ్యానించారు.  

విజయసాయి కాషాయ మంత్రం..జగన్ కు కషాయం!

రాజకీయాలకు అలవాటు పడిన నాయకులు వాటిని వదులు కోవడానికి ఇష్టపడరు.  ఏదో ఆవేశంలో రాజకీయ వైరాగ్యం కలిగినా, మరీ ఆవేశపడి రాజకీయ సన్యాసం తీసుకున్నానంటూ ప్రకటనలు చేసేసినా.. ఆ ఆవేశం తగ్గాకా మళ్లీ వాళ్ల చూపు రాజకీయలవైపే అంటుంది. అడుగులు కూడా రాజకీయం వైపే పడతాయి. ఒక లగడపాటి రాజగోపాల్ అయినా, మరో ఉండవల్లి అరుణ్ కుమార్ అయినా.. ఇంకో వడ్డే శోభనాదీశ్వరరావైనా అంతే. అవకాశం లేక, జనం మొచ్చక, ఒప్పక వీరంతా రాజకీయ ప్రకటనలకే పరిమితమయ్యారు. అయితే విజయసాయిరెడ్డి పరిస్థితి అది కాదు.విజయసాయి  అవేశంతో కంటే ఎంతో  ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.  ఎందుకంటే.. వైసీపీలో ఒక సమయంలో ఆయన జగన్ తరువాత జగనంతటి నాయకుడిగా వెలుగొందారు.  ఆయన రాజకీయ సన్యాసం ప్రకటించిన సమయంలో రాజకీయంగానే కాదు, కేసుల పరంగా కూడా నిండా మునిగి ఉన్నారు. ఇంత కాలం తన సర్వస్వం ధారపోసి పెంచిన పార్టీ దూరం పెట్టింది. అదే సమయంలో కేసులూ చుట్టుముట్టాయి. ఆ కేసుల నుంచి బయటపడాలంటే.. వైసీపీకి తాను దూరం అని నిరూపించుకోవాలి. అదే సమయంలో.. తన స్వేదంతో పెంచిన పార్టీలో.. తన ఉనికినే ప్రశ్నార్థకం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకు అవకాశం రావాలంటే.. పోలిటికల్ గా తాను న్యూట్రల్ గా ఉన్నాననీ, ఉంటాననీ నిరూపించుకోవాలి. అందుకే ఆ సమయంలో విజయసాయి రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నట్లుగా ప్రకటించారని పరిశీలకులు విశ్లేషించారు. వారి విశ్లేషణలకు తగ్గట్టుగానే ఆయన వ్యవసాయమే వ్యాపకం అని ప్రకటించినా, సోషల్ మీడియా ద్వారా, చేయగలిగినంత రాజకీయం చేశారు. అలాగే కేసుల విచారణకు హాజరైన సందర్భంగా మీడియా ముందూ రాజకీయాలే మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టులకు ఆయన ఇచ్చిన లీకులే కారణమంటే అతిశయోక్తి కాదు. విజయసాయి వైసీపీ నుంచి బయటకు వచ్చి, రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మాటలు, చేతలు, అడుగులూ అన్నీ బయటకు జగన్ కోటరీ టార్గెట్ అన్నట్లు కనిపించినా.. ఆయన అసలు లక్ష్యం జగన్ అన్నట్లుగానే సాగాయి. అంతెందుకు విజయసాయి వైసీపీకి గుడ్ బై చెప్పిన తరువాత హైదరాబాద్ వెళ్లి మరీ  జగన్ సోదరి షర్మిలతో భేటీ అయ్యారు. ఆ తరువాత కూడా విజయసాయి పొలిటికల్ గా బీజేపీకి చేరువ అవుతున్నారన్న ప్రచారం జరిగింది.   ఇప్పుడు ఆ ప్రచారాలకీ, ఆ విశ్లేషణలకూ బలం చేకూర్చే విధంగా హిందుత్వకు మద్దతుగా ఆయన తన గళం వినిపించారు. అదీ అలా ఇలా కాదు.. వైసీపీ పునాదులే కదిలిపోయేంత గట్టిగా విజయసాయి బాం బు పేల్చారు. మొత్తంగా గత రెండు దశాబ్దాలుగా  జరిగిన మతమార్పిడులపై విచారణ జరిపించాలనీ, ఇందుకు ఒక కమిటీని వేయాలని విజయసాయి డిమాండ్ చేశారు. హిందుత్వకు ద్రోహం చేసిన వారిని ఎవరినీ విడిచిపెట్టకూడదని ఉద్ఘాటించారు. ఈ మాటల వెనుక ఆయన ఆయన ప్రధాన టార్గెట్ వైసీపీ అండ్ జగన్ అని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుందంటారు పరిశీలకులు. గత రెండు దశాబ్దాలుగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకూ జరిగిన మతమార్పిడులపై విచారణ జరిపించాలన్నది ఆయన చేసిన డిమాండ్.   వైఎస్ జమానాలో క్రైస్తవ మతంలోకి పెద్ద ఎత్తున మతమార్పిడులు జరగిన విషయం అందరికీ తెలి సిందే. ఇప్పుడు విజయసాయిరెడ్డి డిమాండ్  ద్వారా బీజేపీకి పదునైన ఆయుధాన్ని అందించారని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు విజయసాయి ప్రత్యక్ష రాజకీయాలలో లేకపోవచ్చు కానీ, బీజేపీ గొంతుక వినిపించారు.  తద్వారా తన అడుగులు ఎటు అన్న సంకేతాలు ఇచ్చారు. విజయసాయి కాషాయం పుచ్చుకుంటే.. జగన్ కు ఇక గడ్డుకాలమేనన్నది పరిశీలకుల విశ్లేషణ

కారు పార్టీ పోయి...హస్తం పార్టీ వచ్చిన దోపిడీ ఆగలేదు : కిషన్‌రెడ్డి

  కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రెండేళ్ల కాంగ్రెస్‌ నయవంచన పాలన పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో నెరవేర్చని హామీలను పేర్కొంటూ ఛార్జ్‌షీట్‌ విడుదల చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల పాలైందని కేంద్ర మంత్రి అన్నారు. తెలంగాణలో కారు పార్టీ పోయి హస్తం పార్టీ దోపిడీ మాత్రం ఆగలేదని ఆయన అన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లయినా 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయలంటే భూములు అమ్మవలసి వస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఏ ముఖం పెట్టుకొని ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సన్నం, ఉచిత బస్సు పథకాలను మాత్రమే ప్రచారం చేసుకుంటుందని, అందులో సన్నం బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం వాటనే ఎక్కువ ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విజయోత్సవాలు జరుపుకునే హక్కు ఎక్కడిదని ఎంపీ డీకే అరుణ అన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.4 వేలు ఏవి? రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి ఎంత కేటాయించారని చెప్పాలని ప్రశ్నించారు  గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల హాయంలో తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల రాజ్యం కొనసగుతోందని కిషన్ రెడ్డి  తెలిపారు. ఈ మహాధర్నలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, మాజీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణం : సీపీఐ

బీజేపి రాజ్యాంగంలో లౌకిక, సొషలిష్ట అనే పదాలు 400 ఎంపీ సీట్ల ఇస్తే తొలగిస్తామనడం దారుణమన్ని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. రాజ్యాంగ సవరణ పేరుతో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలను అణచివేసి ఆర్ఎస్ఎస్ విధానాలు పెంచిపోషించడం వల్ల దేశంలో అశాంతి నెలకొల్పుతున్నరన్నారు.  అలగే దేశంతో రూపాయి విలువ 56 రూపాయలు ఉన్నదాని 90 రూపాయల 30 పైసులు పడిపొవడాని నిర్మాల సీతారామన్న మంచిదే అన్నడం చాలా దారుణమన్నారు. దిని వల్ల ప్రజలు, రైతులు నష్టపోతారన్నారు. అలగే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ విద్యను ప్రైవేటికరణ చేసి చాల అన్యాయం చెస్తుందన్నారు. రాజ్యధాని పేరుతో మల్లి ల్యాండ పుల్లింగుకు పాల్పడుతుందన్నారు. డబ్బులంతా అమరావతిపై పెట్టి మల్లి ప్రాంతీయ ఉద్యమాలకు తెరతీస్తున్నారన్నారు.

మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్

  మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఉద్దేశించి పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనపై వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో మ‌రో కేసు నమోదైంది. చవటపాలెం సొసైటీ ఛైర్మన్ రావూరు రాధాకృష్ణ నాయుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే.. కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నకిలీ మద్యం కేసుకు సంబంధించిన కీలక ఫైళ్లు కూడా మాయమవడం కలకలం రేపుతోంది. 2014 ఎన్నికల సమయంలో గోవా నుంచి నకిలీ మద్యం తెప్పించి, లేబుళ్లు మార్చి ఓటర్లకు పంపిణీ చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.  ఆనాడు ఈ నకిలీ మద్యం తాగి పలువురు మరణించగా, వందలాది మంది అనారోగ్యానికి గురయ్యారు.ఈ కేసుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఫైళ్లు 2018లోనే అదృశ్యమైనట్లు విజయవాడ ప్రత్యేక కోర్టు గుర్తించి, కేసును సీఐడీకి అప్పగించింది. అయితే, 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఇప్పుడు కూటమి  ప్రభుత్వం అధికారంలో రావడంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తనపై కేసు నమోదు కావడంతో కాకాణి తీవ్రంగా స్పందించారు. దేవాలయ భూములు అక్రమాలపై ప్రశ్నించినందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సోమిరెడ్డికి దమ్ముంటే నార్కో అనాలసిస్ టెస్ట్‌కు సిద్దమా అని సవాల్ విసిరారు.

వింటర్ లో హాట్ హాట్ గా మద్యం సేల్స్! నాలుగు రోజుల్లో రూ.600 కోట్లు!

తెలంగాణలో మద్యం విక్రయాలు అమాంతంగా పెరిగిపోయాయి. తెలంగాణలో మందుబాబులు గజగజలాడించే చలి నుంచి రక్షణ కోసం చలిమంటలు, దుప్పట్లు, రగ్గులను కాకుండా మద్యాన్ని ఆశ్రయించారని భావించాల్సి వస్తోంది. ఎందుకంటేచలి పెరగడంతో గత నాలుగు రోజులలో  రాష్ట్రంలో  ఏకంగా 600 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అయితే ఈ అమ్మకాలు 5 కోట్ల 86 లక్షలుగా ఉన్నాయి.  వెచ్చటి మద్యం గొంతులో పోసుకుని చలిలో  తెలంగాణ మందుబాబులు ఖుషీ చేస్తున్నారని ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పొలిస్తే  మద్యం విక్రయాలు ఈ ఏడు ఏకంగా 107 శాతం పెరిగాయి.  రాష్ట్రం మొత్తంగా చూస్తే ఈ నెల మొదటి తారీకు నుంచి నాలుగో తేదీ వరకూ అంటే డిసెంబర్ 1 నుంచి 4 వరకూ కేవలం నాలుగు రోజుల్లో 600 కోట్లు ఉండటానికి  గ్రామ పంచాయతీ ఎన్నికలు, కొత్త మద్యం విధానం కూడా కారణమని అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.  నాలుగు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో  5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడవ్వడమే ఇందుకు నిదర్శనం. అదే గత ఏడాది ఇదే కాలంలో  బీర్ల అమ్మకాలు 4.26 లక్షల కేసులు మాత్రమే. 

ఏపీ గ్రోత్ రేట్@10.5%

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటోంది.  ఈ ఏడాది ఏపీ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. వైసీపీ హయాంలో ఏపీ ప్రగతి తిరోగమనంలో సాగిన సంగతి తెలిసిందే.  అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత  దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26  ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.   దేశవ్యాప్తంగా సగటు వృద్ధి 8.8 శాతం ఉంటే, ఒక్క అంధ్రప్రదేశ్ మాత్రం జాతీయ సగటును మించిన వృద్ధి రేటు సాధించింది. ఈ వేగం ఇలాగే సాగితే  ఈ ఏడాది మొత్తం రాష్ట్ర ఆదాయం సుమారు 18 లక్షల 65 వేల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీ అభివృద్ధిలో సింహ భాగం వ్యవసాయానిదే అని చెప్పాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వ్యవసాయ ఉత్పత్తులు 9.6 శాతం పెరిగి 81 వేల 496 కోట్ల రూపాయలకు చేరాయి. గత ఏడాది ఈ వృద్ధి 36 శాతంగా ఉంది. అలాగే సేవల రంగం 8.5 శాతం, పరిశ్రమలు 23 శాతం  పెరిగాయి. ఈ మూడు రంగాలూ ఒకేసారి బలపడటం వల్లనే  ఆర్థిక వ్యవస్థ పునాది గట్టిపడిందని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ 2047    ప్రకారం 2047 నాటికి రాష్ట్ర ఆదాయం 2.4 లక్షల కోట్ల డాలర్లకు , తలసరి ఆదాయం 35 లక్షల రూపాయలు చేరాలి. ఆ దీర్ఘకాలిక లక్ష్యం దిశగా తొలి అడుగు పడిందనే తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.  పథకాల అమలులో వేగం,  అధికారుల చొరవ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వెల్లువ అన్నీ కూడా ఏపీ ప్రగతికి, పురోగతికి, ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తున్నాయని చెప్పాలి.    సముద్ర ఆహార ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రాకు 38 శాతం వాటా ఉంది, దాదాపు 7.74 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 28 వేల 409 మెగావాట్లకు చేరింది. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం, బ్యాంకుల్లో డబ్బు లభ్యత పెంచడం వల్ల ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగింది. జగన్ హయాంలో కుదేలైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చంద్రబాబు హయాంలో ఇప్పుడు కోలుకుని వేగంగా ముందుకు సాగుతోంది.